Political News

రఘురామ బయటపెట్టిన బీజేపీ కుట్ర

ఐదేళ్ల కిందట నరసాపురం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచి.. కొన్ని నెలలకే రెబల్‌గా మారిన నేత రఘురామ కృష్ణం రాజు. గత నాలుగున్నరేళ్లలో జగన్ సర్కారును ఆయన స్థాయిలో ఎవ్వరూ తూర్పారబట్టలేదంటే అతిశయోక్తి కాదు. రచ్చబండ పేరుతో జగన్ సర్కారు వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. దీంతో ఏపీ సీఐడీ విభాగం ఆయన్ని ఏదో కేసులో అరెస్ట్ చేయడం.. తనను లాకప్‌లో చిత్రహింసలు పెట్టారని రఘురామ వెల్లడించడం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే.

ఐతే అందుకు బదులుగా నరసాపురం నుంచి ఎంపీగా ఘనవిజయం సాధించి వైసీపీకి చెక్ పెట్టాలని రఘురామ భావించారు. ఐతే ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనేదే సస్పెన్సుగా మారింది. చివరికి బీజేపీ తరఫున నరసాపురం బరిలో ఉంటారని భావించారు. కానీ అనూహ్యంగా ఆ స్థానానికి వేరే అభ్యర్థిని ప్రకటించి రఘురామకు మొండిచేయి చూపించింది బీజేపీ.

దీంతో రఘురామ ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయారు. తనకు వ్యతిరేకంగా సోము వీర్రాజు కుట్ర చేశారని.. జగన్ కూడా లాబీయింగ్ చేసి సీట్ రాకుండా చేశారని రఘురామ ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక బీజేపీ తనను ఎలా మోసం చేసిందో ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర రీతిలో వెల్లడించారు. ‘‘బీజేపీ వాళ్లు నరసాపురంలో సర్వే జరపగా.. నేను భారీ మెజారిటీతో గెలుస్తానని తేలింది. వైసీపీ అభ్యర్థి కంటే 25 శాతం ఓట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ వాళ్లే చెప్పారు.

అందుకే టీడీపీ నుంచి నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం తీసుకుందామని బీజేపీ వాళ్లు నాతో అన్నారు. కానీ నా గొంతు కోయాలంటే ముందు టీడీపీ నుంచి ఆ స్థానం తీసుకోవాలి కదా.. అందుకే అలా చేశారు. ఆ స్థానం తమ చేతికి వచ్చాక ఊరూ పేరు లేని అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. నరసాపురం నుంచి నేను పోటీ చేస్తానన్న ఉద్దేశంతోనే టీడీపీ వాళ్లు ఆ స్థానాన్ని బీజేపీకి వదిలేశారు. కానీ తీరా జరిగింది వేరు. చంద్రబాబు గారు నాకు ఇప్పుడు న్యాయం చేయాలి. బీజేపీ కూడా ఈ తప్పును సరిదిద్దుకోవాలి’’ అని రఘురామ అన్నారు.

This post was last modified on March 26, 2024 9:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

4 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago