బీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉరఫ్ కేసీఆర్ కుటుంబం పరిస్థితి దారుణంగా మారిందా? పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సొంత నేతలు లేని పరిస్థితి, పోటీలో నిలపలేని పరిస్థితి సైతం వచ్చిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం జరుగుతున్న 2024 లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పూర్తిగా దూరంగా ఉంది. వాస్తవానికి ఎప్పుడు పార్లమెంటుఎన్నికలు జరిగినా.. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరో ఒకరైనా పోటీ చేస్తున్నారు.
కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడం గమనార్హం. ఇలా జరగడం బీఆర్ ఎస్ పార్టీ చరిత్రలో తొలిసారి కావడం గమనార్హం. 2000-21 సంవత్సరంలో(23 ఏళ్ల కిందట) కేసీఆర్ చెప్పినట్టుగా గుప్పెడు మంది నాయ కులతోనే టీఆర్ ఎస్(ప్రస్తుతం బీఆర్ ఎస్) పార్టీ ఏర్పడింది. తెలంగాణ ఉద్యమాన్ని ఓ రేంజ్కు తీసుకువె ళ్లింది. పాదం పాదం కదిపేలా… పల్లెపల్లెను జాగృత స్థితిలోకి తీసుకు వచ్చింది. ఇలా.. ప్రారంభమైన టీఆర్ ఎస్ .. అనతి కాలంలోనే ప్రజల హృదయాలను చూరగొంది.
అప్పటి నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తూనే ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత వంటి వారు కల్వకుంట్ల కుటుంబం నుంచి పార్లమెంటుకు పోటీ చేశారు. ఎవరో ఒకరు ఎన్నికల బరిలో నిలుస్తూ.. తమ హవాను ప్రదర్శించారు. వరుస విజయాలు కూడా కేసీఆర్ అందుకున్నారు. అప్రతిహత విజయ నినాదంతో ఆయన ముందుకు సాగారు. కాంగ్రెస్తో జట్టు కట్టి యూపీఏ హయాంలో కేంద్రంలోనూ పదవులు దక్కించుకున్నారు.
అయితే, ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం వారి కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేయడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో కేటీఆర్ లేదా హరీశ్ రావు పోటీ చేయవచ్చనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కానీ, వీరిద్దరిలో ఎవరూ బరిలోకి దిగలేదు. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కవిత విషయానికి వస్తే.. గత 2014లో నిజామాబాద్ నుంచి గెలిచిన ఆమె.. 2019లో ఓడిపోయారు.
ఇక, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. పోటీ చేయాలనే అనుకున్నారు. కానీ, మద్యం కేసుల కారణంగా కేసీఆర్ ఆమెకు టికెట్ను నిరాకరించినట్టు పార్టీ వర్గాలు అప్పట్లోనే చెప్పాయి. మొత్తంగా చూస్తే.. ఒకవైపు పోయే నాయకులు.. మరోవైపు కుటుంబ చిక్కులు.. ప్రత్యర్థుల నుంచి పోటీ వంటివి కేసీఆర్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన కుటుంబం పోటీలో లేకుండా పోవడం మరి చిత్రమైన విషయం.
This post was last modified on March 26, 2024 12:14 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…