బీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉరఫ్ కేసీఆర్ కుటుంబం పరిస్థితి దారుణంగా మారిందా? పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సొంత నేతలు లేని పరిస్థితి, పోటీలో నిలపలేని పరిస్థితి సైతం వచ్చిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం జరుగుతున్న 2024 లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పూర్తిగా దూరంగా ఉంది. వాస్తవానికి ఎప్పుడు పార్లమెంటుఎన్నికలు జరిగినా.. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరో ఒకరైనా పోటీ చేస్తున్నారు.
కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడం గమనార్హం. ఇలా జరగడం బీఆర్ ఎస్ పార్టీ చరిత్రలో తొలిసారి కావడం గమనార్హం. 2000-21 సంవత్సరంలో(23 ఏళ్ల కిందట) కేసీఆర్ చెప్పినట్టుగా గుప్పెడు మంది నాయ కులతోనే టీఆర్ ఎస్(ప్రస్తుతం బీఆర్ ఎస్) పార్టీ ఏర్పడింది. తెలంగాణ ఉద్యమాన్ని ఓ రేంజ్కు తీసుకువె ళ్లింది. పాదం పాదం కదిపేలా… పల్లెపల్లెను జాగృత స్థితిలోకి తీసుకు వచ్చింది. ఇలా.. ప్రారంభమైన టీఆర్ ఎస్ .. అనతి కాలంలోనే ప్రజల హృదయాలను చూరగొంది.
అప్పటి నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తూనే ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత వంటి వారు కల్వకుంట్ల కుటుంబం నుంచి పార్లమెంటుకు పోటీ చేశారు. ఎవరో ఒకరు ఎన్నికల బరిలో నిలుస్తూ.. తమ హవాను ప్రదర్శించారు. వరుస విజయాలు కూడా కేసీఆర్ అందుకున్నారు. అప్రతిహత విజయ నినాదంతో ఆయన ముందుకు సాగారు. కాంగ్రెస్తో జట్టు కట్టి యూపీఏ హయాంలో కేంద్రంలోనూ పదవులు దక్కించుకున్నారు.
అయితే, ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం వారి కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేయడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో కేటీఆర్ లేదా హరీశ్ రావు పోటీ చేయవచ్చనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కానీ, వీరిద్దరిలో ఎవరూ బరిలోకి దిగలేదు. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కవిత విషయానికి వస్తే.. గత 2014లో నిజామాబాద్ నుంచి గెలిచిన ఆమె.. 2019లో ఓడిపోయారు.
ఇక, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. పోటీ చేయాలనే అనుకున్నారు. కానీ, మద్యం కేసుల కారణంగా కేసీఆర్ ఆమెకు టికెట్ను నిరాకరించినట్టు పార్టీ వర్గాలు అప్పట్లోనే చెప్పాయి. మొత్తంగా చూస్తే.. ఒకవైపు పోయే నాయకులు.. మరోవైపు కుటుంబ చిక్కులు.. ప్రత్యర్థుల నుంచి పోటీ వంటివి కేసీఆర్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన కుటుంబం పోటీలో లేకుండా పోవడం మరి చిత్రమైన విషయం.
This post was last modified on March 26, 2024 12:14 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…