బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. తన సొంత పార్టీపై నిరసన గళం వినిపించారు. విశాఖ పట్నం పార్లమెంటు సీటును ఆశించిన ఆయనకు పార్టీ మొండి చేయి చూపింది. పైగా.. ఎక్కడో కడప నుంచి తీసుకువచ్చి.. సీఎం రమేష్ కు అనకాపల్లి సీటును అప్పగించింది. దీంతో తీవ్రంగా హర్ట్ అయిన జీవీఎల్.. నిరసన స్వరం వినిపించారు. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. తాను విశాఖలో మూడేళ్లుగా అనేక పనులు చేస్తున్నానని చెప్పారు. అయినా కూడా తనకు టికెట్ నిరాకరించారని పేర్కొన్నారు. ఇది చాలా తనను బాధించిందన్నారు.
మూడేళ్ల నుంచి విశాఖలోనే తాను ఉన్నానని జీవీఎల్ చెప్పారు. స్థానికంగా ప్రజలకు చేరువయ్యానని, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకునే ప్రయత్నం కూడా చేశానని చెప్పారు. ఆయా సమస్యలపై పోరాడానని చెప్పారు. తన పరిధిలో ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కరించానని అన్నారు. తాను అందరితోనూ కలిసి మూడేళ్ల నుంచి విశాఖ అభివృద్ధి కోసం కృషి చేశానని జీవీఎల్ పేర్కొన్నారు. తాను చేసిన సేవ నిస్వార్థమైనదని.. ఇది వృథా అయిందని అన్నారు. అయినప్పటికీ.. తాను కుంగిపోవడం లేదన్నారు. వచ్చే రోజుల్లో మరింత ఎక్కువగా కష్టపడతానని చెప్పారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తాను సేవ చేయలేదని జీవీఎల్ అన్నారు. ‘జీవీఎల్ ఫర్ వైజాగ్’ అనేది నిరంతర ప్రక్రియ అని.. ఇది కొనసాగుతునే ఉంటుందని ఆయన తెలిపారు. త్వరలోనే విశాఖకు వస్తానని….తన అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తానని చెప్పారు. బీజేపీపై తనకు వ్యతిరేకత లేదని.. అయితే, తనకు టికెట్ రాకుండా కొందరు చక్రం తిప్పారని భావిస్తున్నట్టు చెప్పారు. విశాఖలోనూ, రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడే విధంగా కార్యాచరణ రూపొందించుకుం దామని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు తన అనుచరులకు పిలుపునిచ్చారు.
This post was last modified on March 25, 2024 7:03 pm
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…