బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. తన సొంత పార్టీపై నిరసన గళం వినిపించారు. విశాఖ పట్నం పార్లమెంటు సీటును ఆశించిన ఆయనకు పార్టీ మొండి చేయి చూపింది. పైగా.. ఎక్కడో కడప నుంచి తీసుకువచ్చి.. సీఎం రమేష్ కు అనకాపల్లి సీటును అప్పగించింది. దీంతో తీవ్రంగా హర్ట్ అయిన జీవీఎల్.. నిరసన స్వరం వినిపించారు. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. తాను విశాఖలో మూడేళ్లుగా అనేక పనులు చేస్తున్నానని చెప్పారు. అయినా కూడా తనకు టికెట్ నిరాకరించారని పేర్కొన్నారు. ఇది చాలా తనను బాధించిందన్నారు.
మూడేళ్ల నుంచి విశాఖలోనే తాను ఉన్నానని జీవీఎల్ చెప్పారు. స్థానికంగా ప్రజలకు చేరువయ్యానని, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకునే ప్రయత్నం కూడా చేశానని చెప్పారు. ఆయా సమస్యలపై పోరాడానని చెప్పారు. తన పరిధిలో ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కరించానని అన్నారు. తాను అందరితోనూ కలిసి మూడేళ్ల నుంచి విశాఖ అభివృద్ధి కోసం కృషి చేశానని జీవీఎల్ పేర్కొన్నారు. తాను చేసిన సేవ నిస్వార్థమైనదని.. ఇది వృథా అయిందని అన్నారు. అయినప్పటికీ.. తాను కుంగిపోవడం లేదన్నారు. వచ్చే రోజుల్లో మరింత ఎక్కువగా కష్టపడతానని చెప్పారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తాను సేవ చేయలేదని జీవీఎల్ అన్నారు. ‘జీవీఎల్ ఫర్ వైజాగ్’ అనేది నిరంతర ప్రక్రియ అని.. ఇది కొనసాగుతునే ఉంటుందని ఆయన తెలిపారు. త్వరలోనే విశాఖకు వస్తానని….తన అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తానని చెప్పారు. బీజేపీపై తనకు వ్యతిరేకత లేదని.. అయితే, తనకు టికెట్ రాకుండా కొందరు చక్రం తిప్పారని భావిస్తున్నట్టు చెప్పారు. విశాఖలోనూ, రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడే విధంగా కార్యాచరణ రూపొందించుకుం దామని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు తన అనుచరులకు పిలుపునిచ్చారు.
This post was last modified on March 25, 2024 7:03 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…