Political News

జీవీఎల్ నిర‌స‌న గ‌ళం.. ఏమ‌న్నారంటే!

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు.. త‌న సొంత పార్టీపై నిర‌స‌న గ‌ళం వినిపించారు. విశాఖ ప‌ట్నం పార్ల‌మెంటు సీటును ఆశించిన ఆయ‌నకు పార్టీ మొండి చేయి చూపింది. పైగా.. ఎక్క‌డో క‌డ‌ప నుంచి తీసుకువ‌చ్చి.. సీఎం ర‌మేష్ కు అన‌కాప‌ల్లి సీటును అప్ప‌గించింది. దీంతో తీవ్రంగా హ‌ర్ట్ అయిన జీవీఎల్‌.. నిర‌స‌న స్వ‌రం వినిపించారు. భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. తాను విశాఖ‌లో మూడేళ్లుగా అనేక ప‌నులు చేస్తున్నాన‌ని చెప్పారు. అయినా కూడా త‌న‌కు టికెట్ నిరాక‌రించార‌ని పేర్కొన్నారు. ఇది చాలా త‌న‌ను బాధించింద‌న్నారు.

మూడేళ్ల నుంచి విశాఖలోనే తాను ఉన్నాన‌ని జీవీఎల్ చెప్పారు. స్థానికంగా ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యాన‌ని, వారి స‌మ‌స్య‌లు తెలుసుకుని ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం కూడా చేశాన‌ని చెప్పారు. ఆయా సమస్యలపై పోరాడానని చెప్పారు. తన పరిధిలో ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కరించానని అన్నారు. తాను అందరితోనూ కలిసి మూడేళ్ల నుంచి విశాఖ అభివృద్ధి కోసం కృషి చేశానని జీవీఎల్ పేర్కొన్నారు. తాను చేసిన సేవ నిస్వార్థమైనదని.. ఇది వృథా అయిందని అన్నారు. అయిన‌ప్ప‌టికీ.. తాను కుంగిపోవ‌డం లేద‌న్నారు. వ‌చ్చే రోజుల్లో మ‌రింత ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తాను సేవ చేయలేదని జీవీఎల్ అన్నారు. ‘జీవీఎల్ ఫర్ వైజాగ్’ అనేది నిరంతర ప్రక్రియ అని.. ఇది కొనసాగుతునే ఉంటుందని ఆయ‌న తెలిపారు. త్వరలోనే విశాఖకు వస్తానని….తన అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తానని చెప్పారు. బీజేపీపై త‌న‌కు వ్య‌తిరేక‌త లేద‌ని.. అయితే, త‌న‌కు టికెట్ రాకుండా కొంద‌రు చ‌క్రం తిప్పార‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు. విశాఖలోనూ, రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడే విధంగా కార్యాచరణ రూపొందించుకుం దామని రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ నరసింహరావు త‌న అనుచ‌రుల‌కు పిలుపునిచ్చారు.

This post was last modified on March 25, 2024 7:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago