పక్కా మైనారిటీ స్థానంగా పేరొందిన హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బీసీ నేతను ప్రకటించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక.. అనేక చర్చలు తెరమీదికి వచ్చాయి. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా మిగిలిన ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ఫైనల్ చేశారు. హైదరాబాద్ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు.
కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే.. బీజేపీ మాత్రం హైదరాబాద్ సీటును మాధవీలత కు కేటాయించింది. ఆమె ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ లో ఆమె దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇదిలావుంటే.. అనూహ్యంగా కేసీఆర్ హైదరబాద్కు బీసీకి చెందిన శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. వాస్తవానికి మైనారిటీ నాయకులు చాలా మందే ఉన్నారు.
కానీ, వారెవరినీ.. కేసీఆర్ పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం ఎవరిని సంప్రదించారో కూడా తెలియదు కానీ.. అనూహ్యంగా శ్రీనివాస్ యదవ్ పేరును మాత్రం ప్రకటించారు. అయితే.. ముస్లిం మైనారిటీ పార్టీ ఎంఐఎంతో కేసీఆర్ తన బంధాన్నికొనసాగిస్తున్నారు. ఈ పార్టికి హైదరాబాద్ కంచుకోట. గతం నుంచి ఈ పార్టీనే ఇక్కడ విజయం దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో మైనారిటీ నేతకు కాకుండా.. బీసీ కి ఇవ్వడం ద్వారా కేసీఆర్ ఎంఐఎంకు పరోక్ష సహకారం అందిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
ఎంఐఎంపై అసంతృప్తి ఉన్నవారు.. బీసీలు.. ఓట్లు చీలిపోయి.. ఎంఐఎంకి మేలు చేయాలన్న వ్యూహంతో నే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే చర్చ సాగుతుండడం గమనార్హం. నేరుగా ఎంఐఎంతో పొత్తు పెట్టుకోకుండా.. చేతులు మాత్రమే కలిపిన బీఆర్ఎస్.. ఆ పార్టీ కోసం..ఈ టికెట్ను ఇలా పరోక్షంగా త్యాగం చేసిందని చెబుతున్నారు. బీసీ నేతకు ఇక్కడ అవకాశం ఇచ్చి.. ఎంఐఎం వ్యతిరేక ఓటును బీజేపీకి పడకుండా చేయడమే దీని వెనుక వ్యూహంగా ఉందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 25, 2024 5:40 pm
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…