Political News

మైనారిటీ స్థానంలో బీసీల‌కు చోటు.. కేసీఆర్ వ్యూహమేంటి?

ప‌క్కా మైనారిటీ స్థానంగా పేరొందిన హైద‌రాబాద్ పార్ల‌మెంటు స్థానానికి బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ బీసీ నేత‌ను ప్ర‌క‌టించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వెనుక‌.. అనేక చ‌ర్చ‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా మిగిలిన ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ఫైనల్ చేశారు. హైదరాబాద్ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ పేరును ప్రకటించారు.

కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే.. బీజేపీ మాత్రం హైద‌రాబాద్ సీటును మాధ‌వీల‌త కు కేటాయించింది. ఆమె ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉన్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ లో ఆమె దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మ‌రికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇదిలావుంటే.. అనూహ్యంగా కేసీఆర్ హైద‌ర‌బాద్‌కు బీసీకి చెందిన శ్రీనివాస్ యాద‌వ్‌ను ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. వాస్త‌వానికి మైనారిటీ నాయ‌కులు చాలా మందే ఉన్నారు.

కానీ, వారెవరినీ.. కేసీఆర్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. క‌నీసం ఎవ‌రిని సంప్ర‌దించారో కూడా తెలియ‌దు కానీ.. అనూహ్యంగా శ్రీనివాస్ య‌ద‌వ్ పేరును మాత్రం ప్ర‌క‌టించారు. అయితే.. ముస్లిం మైనారిటీ పార్టీ ఎంఐఎంతో కేసీఆర్ త‌న బంధాన్నికొన‌సాగిస్తున్నారు. ఈ పార్టికి హైద‌రాబాద్ కంచుకోట‌. గ‌తం నుంచి ఈ పార్టీనే ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంటోంది. ఈ నేప‌థ్యంలో మైనారిటీ నేత‌కు కాకుండా.. బీసీ కి ఇవ్వ‌డం ద్వారా కేసీఆర్ ఎంఐఎంకు ప‌రోక్ష స‌హ‌కారం అందిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఎంఐఎంపై అసంతృప్తి ఉన్న‌వారు.. బీసీలు.. ఓట్లు చీలిపోయి.. ఎంఐఎంకి మేలు చేయాల‌న్న వ్యూహంతో నే కేసీఆర్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌నే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. నేరుగా ఎంఐఎంతో పొత్తు పెట్టుకోకుండా.. చేతులు మాత్ర‌మే క‌లిపిన బీఆర్ఎస్‌.. ఆ పార్టీ కోసం..ఈ టికెట్‌ను ఇలా ప‌రోక్షంగా త్యాగం చేసింద‌ని చెబుతున్నారు. బీసీ నేత‌కు ఇక్క‌డ అవ‌కాశం ఇచ్చి.. ఎంఐఎం వ్య‌తిరేక ఓటును బీజేపీకి ప‌డ‌కుండా చేయ‌డమే దీని వెనుక వ్యూహంగా ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

4 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

5 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

6 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

6 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

6 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

7 hours ago