రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. తాజాగా బీజేపీ ప్రకటించిన జాబితాలో ఆమెకు రాజమండ్రి టికెట్ను ఖరారు చేశారు. వాస్తవానికి ఆమె విశాఖను పట్టుబట్టారు. కానీ, టీడీపీ అధినేత ఈ సీటును వదులుకునేందుకు ముందుకు రాకపోవడంతో ఆమె మనసుతోపాటు సీటును కూడా రాజమండ్రికి మార్చుకున్నారు. అయితే.. ఇంత జరిగినా.. పురందేశ్వరి ఉరఫ్ చిన్నమ్మకు కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి.
అదే.. పార్టీ మాజీ చీఫ్, కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు రూపంలో పురందేశ్వరికి రాజకీయ సవాల్ ఎదురుకానుంది. ఎలాగంటే.. ఇదే రాజమండ్రి టికెట్ను సోము కూడా ఆశించారు. ఇక్కడ నుంచి గెలుపు గుర్రం ఎక్కుతానని ఆయన పార్టీ అధిష్టానం దగ్గర కూడా చెప్పారు. కానీ, అధిష్టానం మాత్రం పురందేశ్వరి వైపే మొగ్గు చూపింది. తొలినుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సోము వీర్రాజును కాదని పురందేశ్వరికి టికెట్ ఇచ్చింది. ఇదే.. సోము వర్గంలో మంటలు రేపుతోంది.
మరోవైపు టిడిపి శ్రేణులు.. పురందేశ్వరి కోసం తమను బలి చేస్తారా ? అంటూ ప్రశ్నిస్తున్నాయి. దీనికి కారణం.. రాజమండ్రి పార్లమెంట్ సీటును టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి ఆశించారు. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన కోసం ఇప్పటికే రాజానగరం అసెంబ్లీ సీటును బొడ్డు త్యాగం చేశారు. ఎంపీ టికెట్ అయినా వస్తుందనుకుంటే… అదీ దక్కలేదు. పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచారని బొడ్డు వెంకట రమణ వాపోతున్నారు.
పురందేరేశ్వరికి రాజమండ్రి టికెట్ కన్ఫామ్ కావడంతో సొంత పార్టీలోనే అసమ్మతి మొదలైంది. సోము వీర్రాజు వర్గం… పురందేశ్వరికి ఎంత వరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. టిడిపిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బిజెపికి టిక్కెట్ కేటాయింపుపై పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి, గన్ని కృష్ణ వంటి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఐదు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు, రెండు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులను కలుపుకుని బిజెపి ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on March 25, 2024 4:35 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…