విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల రాజకీయాలు వేడెక్కాయి. ఈ టికెట్ను ఆశించిన టీడీపీ నేతలకు ఇంతకు ముందే లేదని తేల్చేశారు. దీంతో టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు. ఇక, ఇప్పు డు జనసేన వంతు వచ్చింది. ఈపార్టీ నాయకుడు.. పోతిన వెంకట మహేష్ ఈ నియోజకవర్గంపై ఆది నుంచి కొంత ఆశలు పెట్టుకున్నారు. దీనికి పవన్ హామీ కూడా తోడవడంతో ఆయనదే ఈ నియోజకవర్గం అనుకున్నారు. ఒకవైపు అభ్యర్థులను ప్రకటిస్తున్నా.. మరోవైపు ఈ నియోజకవర్గంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
దీంతో టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఎవరికి వెళ్తుందనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సీటును బీజేపీకి ఇచ్చారని.. ఆ పార్టీ తరఫున సుజనా చౌదరి పోటీ చేయడం ఖాయమని ఒకవైపు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న పోతిన.. విజయవాడ వెస్ట్ టికెట్ తనకే అంటూ ఆందోళనకు దిగుతున్నారు. అయితే.. దీనిపై జనసేన పెద్దల నుంచి ఎలాంటి సమాచారం లేదు.
రెండు రోజుల కిందట పవన్ నేరుగా పోతినను పిలిచి.. మాట్లాడి, ఈ సారి తప్పుకోవాలని సూచించారు. కానీ, తన పరిస్థితిని పోతిన పవన్కు వివరించారు. అయినప్పటికీ.. పవన్ కాదనే చెప్పారు. దీంతో పోతిన మహేష్ తాజాగా నిరాహార దీక్ష చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను లోకల్ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
“కూటమి లో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేశాం. నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఆణువణువూ నాకు తెలుసు. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైసీపీతో పోటీ పడలేరు. ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ను వేరే నియోజకవర్గానికి పంపించిది మా పోరాటం వల్లే. నాకు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది. రెండవ లిస్ట్లో నా పేరు ఉంటుంది” అని చెప్పడం గమనార్హం. అయితే.. ఆయన నిరాహార దీక్ష చేపట్టడం మాత్రం కలకలం రేపుతోంది. మరి పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…