Political News

వన్ ప్లస్ త్రీ పెండింగ్.! జనసేన త్యాగమా.? లాభమా.?

జనసేన పార్టీ నుంచి 18 మంది అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంకో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు కావాల్సి వుంది. ఓ ఎంపీ అభ్యర్థి పేరు మాత్రమే ఖరారైంది. ఇంకో ఎంపీ సీటుకు అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి వుంది.

38 అసెంబ్లీ ప్లస్ 6 లోక్ సభ నియోజకవర్గాలు పొత్తులో భాగంగా జనసేనకు వస్తాయని తొలుత ప్రచారం జరిగింది. 24 అసెంబ్లీ 3 లోక్ సభ సీట్లకు లెక్క తేలింది. అందులోంచి, మళ్ళీ మూడు అసెంబ్లీ, ఒక లోక్ సభ నియోజకవర్గాన్ని జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు ఇంకో సారి జనసేన త్యాగం చేయక తప్పదా.? ప్రకటించిన 18 అసెంబ్లీ నియోజకవర్గాలతో సరిపెట్టుకోవాల్సిందేనా.? ఓ ఎంపీ సీటుతోనే జనసేన సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోందా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే, మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం విషయమై జనసేనలో మల్లగుల్లాలు నడుస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి (వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు) బాగా సౌండ్. అయితే, ఆయన్ని అసెంబ్లీకి పంపాలని జనసేన భావిస్తోందిట. బాలశౌరి కూడా అదే అభిప్రాయంతో వున్నారని అంటున్నారు.

ఇంకోపక్క, నాగబాబు మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం వున్నా, అది నిజం కాదని జనసేన పార్టీ నుంచి స్పష్టంగా అందుతున్న సమాచారం. ఆ సీటు, రఘురామకృష్ణరాజుకి ఇచ్చేయొచ్చు కదా.? అంటూ, టీడీపీ – బీజేపీ నుంచి జనసేనపై ఒత్తిడి పెరుగుతోందిట.

21 అసెంబ్లీ, రెండు లోక్ సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందనీ, అదనంగా ఒకటో రెండో అసెంబ్లీ సీట్లు జనసేనకు రావొచ్చన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో ఒకటి పోతిన మహేష్ లేదా సందీప్ పంచకర్ల కోసం అవుతుందని అంటున్నారు.

Satya

Recent Posts

అమ్మ సెంటిమెంట్ జాన్వీకి కలిసొస్తుందా

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…

38 minutes ago

ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…

1 hour ago

బాబు స్పందించారు… మిగిలింది ఇక రేవంతే!

పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…

2 hours ago

అమెరికాలో భారత జెండా చించివేత… కౌంటరిస్తున్న ఎన్నారైలు!

టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…

2 hours ago

అల్లు అర్జున్ 23… ఇబ్బందేం లేదు!

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ప్రచారం అల్లు అర్జున్ 23 క్యాన్సిల్ కావొచ్చని. దానికి తగ్గట్టే…

3 hours ago

ఔను… ర‌జినీ సినిమాకు మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు మారాడు

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ఒక సినిమా తీయాల‌ని ఏడాది కింద‌ట్నుంచి ప్ర‌య‌త్నాలు…

3 hours ago