Political News

వన్ ప్లస్ త్రీ పెండింగ్.! జనసేన త్యాగమా.? లాభమా.?

జనసేన పార్టీ నుంచి 18 మంది అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంకో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు కావాల్సి వుంది. ఓ ఎంపీ అభ్యర్థి పేరు మాత్రమే ఖరారైంది. ఇంకో ఎంపీ సీటుకు అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి వుంది.

38 అసెంబ్లీ ప్లస్ 6 లోక్ సభ నియోజకవర్గాలు పొత్తులో భాగంగా జనసేనకు వస్తాయని తొలుత ప్రచారం జరిగింది. 24 అసెంబ్లీ 3 లోక్ సభ సీట్లకు లెక్క తేలింది. అందులోంచి, మళ్ళీ మూడు అసెంబ్లీ, ఒక లోక్ సభ నియోజకవర్గాన్ని జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు ఇంకో సారి జనసేన త్యాగం చేయక తప్పదా.? ప్రకటించిన 18 అసెంబ్లీ నియోజకవర్గాలతో సరిపెట్టుకోవాల్సిందేనా.? ఓ ఎంపీ సీటుతోనే జనసేన సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోందా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే, మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం విషయమై జనసేనలో మల్లగుల్లాలు నడుస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి (వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు) బాగా సౌండ్. అయితే, ఆయన్ని అసెంబ్లీకి పంపాలని జనసేన భావిస్తోందిట. బాలశౌరి కూడా అదే అభిప్రాయంతో వున్నారని అంటున్నారు.

ఇంకోపక్క, నాగబాబు మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం వున్నా, అది నిజం కాదని జనసేన పార్టీ నుంచి స్పష్టంగా అందుతున్న సమాచారం. ఆ సీటు, రఘురామకృష్ణరాజుకి ఇచ్చేయొచ్చు కదా.? అంటూ, టీడీపీ – బీజేపీ నుంచి జనసేనపై ఒత్తిడి పెరుగుతోందిట.

21 అసెంబ్లీ, రెండు లోక్ సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందనీ, అదనంగా ఒకటో రెండో అసెంబ్లీ సీట్లు జనసేనకు రావొచ్చన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో ఒకటి పోతిన మహేష్ లేదా సందీప్ పంచకర్ల కోసం అవుతుందని అంటున్నారు.

This post was last modified on March 25, 2024 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago