Political News

కేసుల ఎఫెక్ట్‌.. పార్టీని విలీనం చేసిన జ‌నార్ద‌న్‌రెడ్డి

అన్ని పార్టీలూ పొమ్మ‌న్నాయి. ఏ పార్టీ కూడా క‌నీసం నీడ‌నిచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో సొంత‌గా పార్టీ పెట్టుకుని.. దానిని డెవ‌ల‌ప్ చేసిన గ‌నుల వ్యాపారి, క‌ర్ణాట‌క‌కు చెందిన మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి.. తాజాగా పాత గూటికే చేరారు. బీజేపీ నుంచి వ‌చ్చి.. మ‌ళ్లీ బీజేపీలోనే త‌న సొంత పార్టీని ఆయ‌న విలీనం చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజీకీయాల్లో ఇదొక కీలక పరిణామమనే చెప్పాలి. మొత్తం 28 పార్లమెంటు స్థానాలున్న ఈ రాష్ట్రంలో మ‌రోసారి బీజేపీ త‌న హ‌వా నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

గత ఎన్నిక‌ల్లో 28 సీట్ల‌కు 25 చోట్ల బీజేపీ ఒంట‌రిగా విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిన ద‌రిమిలా.. ఇత‌ర పార్టీల‌ను కూడా క‌లుపుకొని ముందుకు పోతోంది. ద‌క్షిణ క‌న్న‌డ జిల్లాలో బ‌లమైన ప‌ట్టున్న గాలి జ‌నార్ద‌న్‌రెడ్డిని కూడా కేసుల బూచి చూపి.. త‌న‌వైపు వ‌శ‌ప‌రుచుకున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ సాగుతోంది. తన పార్టీ ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష'(కేఆర్పీపీ)ని ఆయ‌న బీజేపీలో విలీనం చేశారంటే ఏం రేంజ్‌లో తెర‌వెనుక రాజ‌కీయం న‌డిచి ఉంటుంద‌నేది అంద‌రికీ తెలిసిందే.

మాజీ ముఖ్యమత్రి య‌డియూరప్ప సమక్షంలో తన పార్టీని గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి బీజేపీలో కలిపేశారు. ఆయన‌తో పాటు ఆయన భార్య కూడా బీజేపీ కండువా కప్పుకొన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ… తన పార్టీని బీజేపీలో విలీనం చేశానని, బీజేపీలో చేరానని తెలిపారు. నరేంద్ర మోడీని మూడో సారి ప్రధానిని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరానని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదన్నారు.

క‌ట్ చేస్తే.. ఏడాది కింద‌ట‌.. అంటే.. గ‌త ఏడాది మేలో క‌ర్ణాట‌క ఎన్నిక‌లు జ‌రినప్పుడు ఇదే గాలి జ‌నార్ద న్‌రెడ్డి.. అదే మోడీకి వ్య‌తిరేకంగా.. బీజేపీకి వ్య‌తిరేకంగా సొంత పార్టీ పెట్టుకున్నారు. త‌న‌ను రాజ‌కీయంగా తొక్కేస్తున్నార‌ని.. అందుకే విధిలేని ప‌రిస్థితిలో తాను సొంత పార్టీ పెట్టుకున్నాన‌ని ఆయ‌న చెప్పారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆయ‌నే త‌న పార్టీని బీజేపీలో విలీనం చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా, గాలి జ‌నార్ద‌న్ రెడ్డిపై 18కి పైగా సీబీఐ, 12కుపైగా ఈడీ కేసులు ఉన్నాయి. ఆయ‌న‌ప ఇప్ప‌టికీ.. హైకోర్టు ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.

This post was last modified on March 25, 2024 12:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

9 minutes ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

16 minutes ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

43 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

2 hours ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

2 hours ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago