అన్ని పార్టీలూ పొమ్మన్నాయి. ఏ పార్టీ కూడా కనీసం నీడనిచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో సొంతగా పార్టీ పెట్టుకుని.. దానిని డెవలప్ చేసిన గనుల వ్యాపారి, కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి.. తాజాగా పాత గూటికే చేరారు. బీజేపీ నుంచి వచ్చి.. మళ్లీ బీజేపీలోనే తన సొంత పార్టీని ఆయన విలీనం చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజీకీయాల్లో ఇదొక కీలక పరిణామమనే చెప్పాలి. మొత్తం 28 పార్లమెంటు స్థానాలున్న ఈ రాష్ట్రంలో మరోసారి బీజేపీ తన హవా నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
గత ఎన్నికల్లో 28 సీట్లకు 25 చోట్ల బీజేపీ ఒంటరిగా విజయం దక్కించుకుంది. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిన దరిమిలా.. ఇతర పార్టీలను కూడా కలుపుకొని ముందుకు పోతోంది. దక్షిణ కన్నడ జిల్లాలో బలమైన పట్టున్న గాలి జనార్దన్రెడ్డిని కూడా కేసుల బూచి చూపి.. తనవైపు వశపరుచుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తన పార్టీ ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష'(కేఆర్పీపీ)ని ఆయన బీజేపీలో విలీనం చేశారంటే ఏం రేంజ్లో తెరవెనుక రాజకీయం నడిచి ఉంటుందనేది అందరికీ తెలిసిందే.
మాజీ ముఖ్యమత్రి యడియూరప్ప సమక్షంలో తన పార్టీని గాలి జనార్దన్రెడ్డి బీజేపీలో కలిపేశారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా బీజేపీ కండువా కప్పుకొన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ… తన పార్టీని బీజేపీలో విలీనం చేశానని, బీజేపీలో చేరానని తెలిపారు. నరేంద్ర మోడీని మూడో సారి ప్రధానిని చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరానని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదన్నారు.
కట్ చేస్తే.. ఏడాది కిందట.. అంటే.. గత ఏడాది మేలో కర్ణాటక ఎన్నికలు జరినప్పుడు ఇదే గాలి జనార్ద న్రెడ్డి.. అదే మోడీకి వ్యతిరేకంగా.. బీజేపీకి వ్యతిరేకంగా సొంత పార్టీ పెట్టుకున్నారు. తనను రాజకీయంగా తొక్కేస్తున్నారని.. అందుకే విధిలేని పరిస్థితిలో తాను సొంత పార్టీ పెట్టుకున్నానని ఆయన చెప్పారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆయనే తన పార్టీని బీజేపీలో విలీనం చేయడం గమనార్హం. కాగా, గాలి జనార్దన్ రెడ్డిపై 18కి పైగా సీబీఐ, 12కుపైగా ఈడీ కేసులు ఉన్నాయి. ఆయనప ఇప్పటికీ.. హైకోర్టు ఆంక్షలు కొనసాగుతున్నాయి.
This post was last modified on March 25, 2024 12:05 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…