Political News

రాజుకు దారేదీ.. బీజేపీ అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల‌

ఎప్పుడెప్పుడా అని చాలా ఉత్కంఠ‌గా ఎదురు చూసిన ఏపీకి సంబంధించిన‌ బీజేపీ అభ్య‌ర్థుల జాబితాను తాజాగా కేంద్ర నాయ‌కత్వం విడుద‌ల చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ ఉమ్మ‌డిగా బ‌రిలోకి దిగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సీట్లు కూడా పంచుకున్నాయి. బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాల‌ను ఇచ్చారు. అదేవిధంగా 6 పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా క‌మ‌లం పార్టీ తీసుకుంది. వీటిలో తాజాగా 6 పార్ల‌మెంటు స్థానాల‌కు సంబంధించిన అభ్య‌ర్థుల జాబితాను బీజేపీ విడుద‌ల చేసింది. వీరిలో ఇద్ద‌రు మ‌హిళా అబ్య‌ర్థులు కూడా ఉన్నారు. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి, ఎస్టీ మ‌హిళ‌, మాజీ ఎంపీ కొత్త ప‌ల్లి గీత‌ల‌కు అవ‌కాశం ఇచ్చారు.

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుద‌ల చేసిన ఐదో జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి సంబంధించి రాజమండ్రి – పురంధేశ్వరి, అనకాపల్లి – సీఎం రమేశ్, అరకు – కొత్తపల్లి గీత, రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి – వరప్రసాద్, నరసాపురం – శ్రీనివాస్ వర్మకు టికెట్లు కేటాయించారు. ఇక‌, తెలంగాణలోని ఖమ్మం ఎంపీ స్థానాన్ని తాండ్ర వినోద్ రావు, వరంగల్ సీటును ఆరూరి రమేశ్ కు కేటాయించారు. ఇక్క‌డ టికెట్ ఆశించిన త‌న్నేటి కృష్ణ ప్ర‌సాద్‌ను ఏపీకి పంపించి.. అక్క‌డ బాప‌ట్ల టికెట్‌ను ఇప్పించారు. ఈయ‌న బాప‌ట్ల‌లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నారు.

రాజు ప‌రిస్థితి ఏంటి?

వైసీపీతో విభేదించి.. ఆ పార్టీపైనా, ఆ పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌పై నిత్యంకారాలు మిరియాలు నూరిన న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఆయ‌న ఆశించిన‌.. పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని భావించిన న‌ర‌సాపురం ఎంపీసీటును బీజేపీ.. శ్రీనివాస్ వ‌ర్మ‌కు కేటాయించేసింది. దీంతో ఎంపీ స్థానానికి రాజును ప‌రిశీలించ‌లేద‌ని తెలిసింది. మ‌రి ఆయ‌న ప‌రిస్థితి ఏంటి? అనేది చూడాలి. ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీలోనూ, జ‌న‌సేన‌లోనూ చేరలేదు. వైసీపీకి మాత్ర‌మే రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న‌ను అసెంబ్లీకి పంపించ‌నున్నారా? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. అసెంబ్లీ టికెట్ల‌ను బీజేపీ ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

47 minutes ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

1 hour ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

1 hour ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

12 hours ago