ఎప్పుడెప్పుడా అని చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన ఏపీకి సంబంధించిన బీజేపీ అభ్యర్థుల జాబితాను తాజాగా కేంద్ర నాయకత్వం విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీట్లు కూడా పంచుకున్నాయి. బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలను ఇచ్చారు. అదేవిధంగా 6 పార్లమెంటు స్థానాలను కూడా కమలం పార్టీ తీసుకుంది. వీటిలో తాజాగా 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. వీరిలో ఇద్దరు మహిళా అబ్యర్థులు కూడా ఉన్నారు. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి, ఎస్టీ మహిళ, మాజీ ఎంపీ కొత్త పల్లి గీతలకు అవకాశం ఇచ్చారు.
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన ఐదో జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి సంబంధించి రాజమండ్రి – పురంధేశ్వరి, అనకాపల్లి – సీఎం రమేశ్, అరకు – కొత్తపల్లి గీత, రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి – వరప్రసాద్, నరసాపురం – శ్రీనివాస్ వర్మకు టికెట్లు కేటాయించారు. ఇక, తెలంగాణలోని ఖమ్మం ఎంపీ స్థానాన్ని తాండ్ర వినోద్ రావు, వరంగల్ సీటును ఆరూరి రమేశ్ కు కేటాయించారు. ఇక్కడ టికెట్ ఆశించిన తన్నేటి కృష్ణ ప్రసాద్ను ఏపీకి పంపించి.. అక్కడ బాపట్ల టికెట్ను ఇప్పించారు. ఈయన బాపట్లలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు.
రాజు పరిస్థితి ఏంటి?
వైసీపీతో విభేదించి.. ఆ పార్టీపైనా, ఆ పార్టీ అధినేత, సీఎం జగన్పై నిత్యంకారాలు మిరియాలు నూరిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆయన ఆశించిన.. పోటీ చేయడం ఖాయమని భావించిన నరసాపురం ఎంపీసీటును బీజేపీ.. శ్రీనివాస్ వర్మకు కేటాయించేసింది. దీంతో ఎంపీ స్థానానికి రాజును పరిశీలించలేదని తెలిసింది. మరి ఆయన పరిస్థితి ఏంటి? అనేది చూడాలి. ప్రస్తుతం ఆయన టీడీపీలోనూ, జనసేనలోనూ చేరలేదు. వైసీపీకి మాత్రమే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయనను అసెంబ్లీకి పంపించనున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది. అసెంబ్లీ టికెట్లను బీజేపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
This post was last modified on March 25, 2024 7:25 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…