‘యూట్యూబ్’ చానెళ్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తన పార్టీపైనా తనపైనా వ్యక్తిగత విమర్శలు చేసేవారిని ప్రోత్సహిస్తున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ చానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను ప్రసారం చేస్తున్నాయని అన్నారు.
డబ్బులకు ఆశ పడుతున్నారు!
అధికార పార్టీ ఇస్తున్న డబ్బులకు యూట్యూబ్ చానెళ్లు ఆశ పడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నా యని ఘాటుగా విమర్శించారు. చట్ట విరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఇది వ్యక్తిగతంగా తనతో పాటు, తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతోందని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రజలను అయోమయానికి గురిచేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగానే భావిస్తున్నట్టు చెప్పారు.
కుట్రపూరిత చర్యలు..
యూట్యూబ్ చానళ్లు చేస్తున్న దుర్మార్గమైన, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని కేటీఆర్ చెప్పారు. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన థంబ్ నెయిల్స్ తో వార్తల పేరిట దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై పరువు నష్టం కేసులతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ చానళ్లు చట్టప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
This post was last modified on March 24, 2024 10:14 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…