Political News

“నాకు-డ్ర‌గ్స్ కు లింకా.. 20 కోట్లు ప‌రిహారం క‌ట్టండి”

విశాఖ తీరానికి బ్రెజిల్ నుంచి వ‌చ్చిన కంటెయిన‌ర్ల‌లో మాద‌క ద్ర‌వ్యాలు వెలుగు చూడ‌డం రాజ‌కీయంగా రాష్ట్రాన్ని కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు ఒక‌పార్టీపై మ‌రో పార్టీ నిప్పులు చెరుగుకున్నాయి. ఇంత‌లోనే ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఈ కుంప‌టిలోకి బీజేపీని లాగేశారు. బీజేపీ హ‌స్తం లేకుండా.. ఇది జ‌రుగుతుందా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి కుటుంబం పాత్ర‌ను కూడా లాగేశారు.

ఈ విష‌యాలను వైసీపీ అధికార మీడియా సాక్షిలో ప‌దే ప‌దే ప్ర‌చారం చేశారు. అంతేకాదు.. ప్ర‌త్యేక క‌థ‌నాలు కూడా అల్లారు. మొత్తంగా ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. ఎన్నిక‌ల‌కు ముందు పురందేశ్వ‌రికి ఇబ్బందిగా మార‌డంతో ఆమె ఫైర్ అయ్యారు. అంతేకాదు.. త‌న ప‌రువుకు భంగం క‌లిగించారంటూ.. సాక్షి యాజ‌మాన్యానికి(సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి డైరెక్ట‌ర్‌) పురందేశ్వ‌రి తాజాగా నోటీసులు పంపించారు.

సంధ్యా ఎక్స్ పోర్ట్స్ సంస్థలో తాము భాగస్వాములమంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ సాక్షి మీడియాపై మండిపడ్డారు. ఈ క్రమంలో, తన పరువుకు భంగం కలిగించారంటూ పురందేశ్వరి తన సాక్షి మీడియాకు పరువునష్టం నోటీసులు పంపించారు. రూ.20 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నట్టు తెలిపారు. ఆధార రహిత వార్తలు ప్రచారం చేస్తూ పరువునష్టం కలిగిస్తున్నారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురందేశ్వరి న్యాయవాది సతీశ్ ఈ మేరకు సాక్షి యాజమాన్యానికి నోటీసులు పంపారు.

విశాఖ తీరానికి ఇటీవల బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ రాగా, అందులో 25 వేల కిలోల కొకైన్‌ డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ కంటైనర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ డ్రగ్స్ తెప్పించిన కంపెనీ మీ వాళ్లదేనంటే మీ వాళ్ల‌దేనంటూ.. ఏపీలోని అధికార‌, ప్రతిప‌క్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

This post was last modified on March 24, 2024 8:00 pm

Share

Recent Posts

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

1 minute ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

38 minutes ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

55 minutes ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

12 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

14 hours ago