Political News

“నాకు-డ్ర‌గ్స్ కు లింకా.. 20 కోట్లు ప‌రిహారం క‌ట్టండి”

విశాఖ తీరానికి బ్రెజిల్ నుంచి వ‌చ్చిన కంటెయిన‌ర్ల‌లో మాద‌క ద్ర‌వ్యాలు వెలుగు చూడ‌డం రాజ‌కీయంగా రాష్ట్రాన్ని కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు ఒక‌పార్టీపై మ‌రో పార్టీ నిప్పులు చెరుగుకున్నాయి. ఇంత‌లోనే ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఈ కుంప‌టిలోకి బీజేపీని లాగేశారు. బీజేపీ హ‌స్తం లేకుండా.. ఇది జ‌రుగుతుందా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి కుటుంబం పాత్ర‌ను కూడా లాగేశారు.

ఈ విష‌యాలను వైసీపీ అధికార మీడియా సాక్షిలో ప‌దే ప‌దే ప్ర‌చారం చేశారు. అంతేకాదు.. ప్ర‌త్యేక క‌థ‌నాలు కూడా అల్లారు. మొత్తంగా ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. ఎన్నిక‌ల‌కు ముందు పురందేశ్వ‌రికి ఇబ్బందిగా మార‌డంతో ఆమె ఫైర్ అయ్యారు. అంతేకాదు.. త‌న ప‌రువుకు భంగం క‌లిగించారంటూ.. సాక్షి యాజ‌మాన్యానికి(సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి డైరెక్ట‌ర్‌) పురందేశ్వ‌రి తాజాగా నోటీసులు పంపించారు.

సంధ్యా ఎక్స్ పోర్ట్స్ సంస్థలో తాము భాగస్వాములమంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ సాక్షి మీడియాపై మండిపడ్డారు. ఈ క్రమంలో, తన పరువుకు భంగం కలిగించారంటూ పురందేశ్వరి తన సాక్షి మీడియాకు పరువునష్టం నోటీసులు పంపించారు. రూ.20 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నట్టు తెలిపారు. ఆధార రహిత వార్తలు ప్రచారం చేస్తూ పరువునష్టం కలిగిస్తున్నారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురందేశ్వరి న్యాయవాది సతీశ్ ఈ మేరకు సాక్షి యాజమాన్యానికి నోటీసులు పంపారు.

విశాఖ తీరానికి ఇటీవల బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ రాగా, అందులో 25 వేల కిలోల కొకైన్‌ డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ కంటైనర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ డ్రగ్స్ తెప్పించిన కంపెనీ మీ వాళ్లదేనంటే మీ వాళ్ల‌దేనంటూ.. ఏపీలోని అధికార‌, ప్రతిప‌క్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

5 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

7 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

9 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

10 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

10 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

10 hours ago