Political News

రూ.500,200 నోట్ల రద్దుతోనే వైసీపీకి చెక్ : చంద్రబాబు

రాబోయే ఎన్నికల్లో వైసీపీని కట్టడి చేసేందుకు డిజిటల్ కరెన్సీ రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, పెద్దనోట్ల రద్దు మాదిరిగా రూ.200, రూ.500 నోట్లను రద్దు చేయాలని అన్నారు. రాష్ట్ర సంపదనంతా హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. తమ అక్రమాలను వైసీపీ నేతలు అంతర్జాతీయ స్థాయికి విస్తరించారని ఎద్దేవా చేశారు. జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేశారని, జగన్ వంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని చెప్పారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలేనని దుయ్యబట్టారు.

ఏపీ భవిష్యత్తు కోసం, ఓట్లు చీలవద్దనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నామని, పొత్తుల వల్ల కొందరు నేతలకు టికెట్ ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కోసం పనిచేసిన 31 మందికి టికెట్ ఇవ్వలేకపోయానని, వారి సేవలను మర్చిపోనని చెప్పారు. కూటమి తరఫున బరిలో దిగే ప్రతి అభ్యర్థి గెలవాలన్న లక్ష్యంతో అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. అభ్యర్థి ఏ పార్టీ వారైనా ఎన్డీయే అభ్యర్థిగానే చూడాలని, ఈ మూడు పార్టీలు వేసే పునాది 30 ఏళ్ల భవితకు నాంది అని అన్నారు. ఏపీలో కూటమి 160కి పైగా సీట్లు గెలుస్తుందని, కేంద్రంలో ఎన్డీయే కూటమి 400కి పైగా స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజీనామా ఫేక్ లెటర్ పై చంద్రబాబు స్పందించారు. వైసీపీ చేసే ప్రతి పని ఫేక్ అని, టెంపరరీ పొత్తు అని తన పేరుతోనూ ఫేక్ లెటర్లు వదిలారని చంద్రబాబు మండిపడ్డారు.
“దగ్గుబాటి పురందేశ్వరి నా కుటుంబానికి చెందిన వ్యక్తే కావొచ్చు… కానీ ఆమె 30 ఏళ్లుగా ఇతర పార్టీల్లో ఉన్నారు. ఆమె విషయంలో అనేక ఫేక్ వార్తలు తీసుకువచ్చారు. జనసేన, పవన్ కల్యాణ్ పైనా ఫేక్ వార్తలు వచ్చాయి” అని చంద్రబాబు అన్నారు.

This post was last modified on March 23, 2024 6:33 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

చంద్ర‌బాబు పేరిట త‌ప్పుడు ప్ర‌చారం.. స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ‌కు మ‌రికొన్ని గంట‌ల ముందు.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల ముఖ్య నేత‌, టీడీపీ అధినేత…

13 hours ago

జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని.. బాబు చేస్తున్నారు..

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ‌నివారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోవ‌డంతో నాయ‌కులు, పార్టీల అధినే త‌లు ఎక్క‌డిక‌క్క‌డ సేద…

14 hours ago

బెట్టింగ్ లో రూ.2 కోట్లు .. కొట్టిచంపిన తండ్రి

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది.…

14 hours ago

పవన్‌కు ప్రాణం, జగన్‌కు ఓటు.. మారుతుందా?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్‌లో పవన్‌కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…

15 hours ago

జగన్‌ సీట్లపై పీకే లేటెస్ట్ అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…

16 hours ago

ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్‌

దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారం చేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…

17 hours ago