Political News

ఒక్క క్ష‌ణం కూడా వేస్ట్ చేయ‌ట్లేదు..

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల షెడ్యూల్‌కు-పోలింగ్‌కు మ‌ధ్య భారీ గ్యాప్ వ‌చ్చింది. దీంతో నాయ కులు ఎక్క‌డికక్క‌డ తొంగుంటున్నారు. ఇప్పుడే ప్ర‌చారం చేస్తే జేబులు ఖాళీ అవుతాయ‌ని అనుకుంటు న్నారో.. లేక‌.. ఇప్ప‌టి నుంచి అన్నిరోజులు ఎండ‌లో తిర‌గలేమ‌ని బావిస్తున్నారో.. తెలియ‌దు కానీ.. అన్ని పార్టీల నాయ‌కులు, టికెట్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా పెద్ద‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం లేదు. అయితే.. ఈ స‌మ యాన్నే టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు స‌ద్వినియోగం చేసుకుంటున్నారు.

ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు ఆయ‌న వ‌ర్క్‌షాపు నిర్వ‌హిస్తున్నారు. ఒక్క క్ష‌ణం కూడా వేస్ట్ చేయకుండా.. స‌మ‌యాన్ని ఎలా స‌ద్వినియోగం చేసుకోవాల‌నే విష‌యంపై వారిని దిశానిర్దేశం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉన్నారు. గెలుపు కోసం అనేక‌ వ్యూహాలను రచిస్తున్నారు. చిన్న‌ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు సాగుతున్నారు.

ఇప్పటికే టీడీపీ అభ్యర్థులకు సంబంధించి మూడు జాబితాలను టీడీపీ విడుదల చేసింది. మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్ఛార్జీలకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ కు చంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

ఈ వర్క్ షాప్ కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు… వారు ప్రత్యేకంగా నియమించుకున్న నలుగురు మేనేజర్లు కూడా హాజరుకానున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అధికార వైసీపీ పార్టీ కుట్రలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో ఎలా ప్రచారం నిర్వహించాలి, అభ్యర్థులు ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, వ్యూహాలను ఎలా అమలు చేయాలి అనే దానిపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

This post was last modified on March 23, 2024 1:29 pm

Share

Recent Posts

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

1 minute ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

2 minutes ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

4 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

4 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

4 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

5 hours ago