ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్కు-పోలింగ్కు మధ్య భారీ గ్యాప్ వచ్చింది. దీంతో నాయ కులు ఎక్కడికక్కడ తొంగుంటున్నారు. ఇప్పుడే ప్రచారం చేస్తే జేబులు ఖాళీ అవుతాయని అనుకుంటు న్నారో.. లేక.. ఇప్పటి నుంచి అన్నిరోజులు ఎండలో తిరగలేమని బావిస్తున్నారో.. తెలియదు కానీ.. అన్ని పార్టీల నాయకులు, టికెట్లు ప్రకటించిన తర్వాత కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. అయితే.. ఈ సమ యాన్నే టీడీపీ అధినేత చంద్రబాబు సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఇప్పటికే ప్రకటించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆయన వర్క్షాపు నిర్వహిస్తున్నారు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా.. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయంపై వారిని దిశానిర్దేశం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. గెలుపు కోసం అనేక వ్యూహాలను రచిస్తున్నారు. చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు సాగుతున్నారు.
ఇప్పటికే టీడీపీ అభ్యర్థులకు సంబంధించి మూడు జాబితాలను టీడీపీ విడుదల చేసింది. మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్ఛార్జీలకు టీడీపీ అధినేత చంద్రబాబు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ కు చంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
ఈ వర్క్ షాప్ కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు… వారు ప్రత్యేకంగా నియమించుకున్న నలుగురు మేనేజర్లు కూడా హాజరుకానున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అధికార వైసీపీ పార్టీ కుట్రలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో ఎలా ప్రచారం నిర్వహించాలి, అభ్యర్థులు ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, వ్యూహాలను ఎలా అమలు చేయాలి అనే దానిపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
This post was last modified on March 23, 2024 1:29 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…