Political News

ఒక్క క్ష‌ణం కూడా వేస్ట్ చేయ‌ట్లేదు..

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల షెడ్యూల్‌కు-పోలింగ్‌కు మ‌ధ్య భారీ గ్యాప్ వ‌చ్చింది. దీంతో నాయ కులు ఎక్క‌డికక్క‌డ తొంగుంటున్నారు. ఇప్పుడే ప్ర‌చారం చేస్తే జేబులు ఖాళీ అవుతాయ‌ని అనుకుంటు న్నారో.. లేక‌.. ఇప్ప‌టి నుంచి అన్నిరోజులు ఎండ‌లో తిర‌గలేమ‌ని బావిస్తున్నారో.. తెలియ‌దు కానీ.. అన్ని పార్టీల నాయ‌కులు, టికెట్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా పెద్ద‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం లేదు. అయితే.. ఈ స‌మ యాన్నే టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు స‌ద్వినియోగం చేసుకుంటున్నారు.

ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు ఆయ‌న వ‌ర్క్‌షాపు నిర్వ‌హిస్తున్నారు. ఒక్క క్ష‌ణం కూడా వేస్ట్ చేయకుండా.. స‌మ‌యాన్ని ఎలా స‌ద్వినియోగం చేసుకోవాల‌నే విష‌యంపై వారిని దిశానిర్దేశం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉన్నారు. గెలుపు కోసం అనేక‌ వ్యూహాలను రచిస్తున్నారు. చిన్న‌ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు సాగుతున్నారు.

ఇప్పటికే టీడీపీ అభ్యర్థులకు సంబంధించి మూడు జాబితాలను టీడీపీ విడుదల చేసింది. మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్ఛార్జీలకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ కు చంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

ఈ వర్క్ షాప్ కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు… వారు ప్రత్యేకంగా నియమించుకున్న నలుగురు మేనేజర్లు కూడా హాజరుకానున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అధికార వైసీపీ పార్టీ కుట్రలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో ఎలా ప్రచారం నిర్వహించాలి, అభ్యర్థులు ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, వ్యూహాలను ఎలా అమలు చేయాలి అనే దానిపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

This post was last modified on March 23, 2024 1:29 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

1 hour ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago