ఏపీలో బీజేపీతో చంద్రబాబు చేతులు కలిపారు. జనసేన+టీడీపీ+బీజేపీ కలిసి సంయుక్తంగా ఎన్డీయే కూటమిగా ఏర్పడి.. అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే సీట్లు కూడా పంచేసుకున్నారు. అయితే.. ఈ పొత్తుపై వైసీపీ నాయకులు తీవ్రస్తాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన విమర్శలను సోషల్ మీడియాలో రోజు కోరకంగా ప్రచారం చేస్తున్నారు. ఇక, నరేంద్ర మోడీ చంద్రబాబుపై చేసిన విమర్శలను కూడా ప్రచారం చేస్తున్నారు.
తాజాగా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న దుమారంపై చంద్రబాబు స్పందించారు. లోక్ సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. ఈ సందర్భంగా తాను ఎన్డీయేతో ఎందుకు పొత్తు పెట్టుకున్నదీ సంపూర్ణంగా మరోసారి వివరించారు. ఇదే సమయంలో తమ పొత్తుపై వస్తున్న విమర్శలకు కూడా ఆయన దీటుగా జవాబు చెప్పారు. తాను విమర్శలకు పడిపోయే నాయకుడిని కాదన్నారు. అలాగని తనను పొగిడించుకోవడం కూడా ఇష్టంలేదన్నారు.
ఎవరు ఎన్ని విమర్శలుచేసినా.. బీజేపీతోనే కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. గెలుపుతథ్యమని తేలిందికాబట్టే.. వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీయేలో చేరామని చెప్పారు. పార్లమెంటులో బలమైన గళం వినిపిస్తూ… రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే అభ్యర్థులుగా నిలబెడుతున్నామని తెలిపారు.
పార్లమెంటుకు పోటీ చేసే 13 మంది తెలుగుదేశం అభ్యర్థులను, వీరితో పాటు మరో 11 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నామని చెప్పారు. ‘ప్రజలారా దీవించండి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ కూటమి విజయం తథ్యమని ప్రజల ఆశీర్వాదం ఉందని తేల్చి చెప్పారు. టీడీపీ నాయకులు గతాన్ని మరిచిపోయి.. పోరాట యోధులుగా మారి పార్టీలను గెలిపించాలని పిలుపునిచ్చారు.
This post was last modified on March 22, 2024 2:41 pm
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. లండన్కు…
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…