Political News

ఎన్డీయేలో ఎందుకు చేరామో చెప్పిన చంద్ర‌బాబు

ఏపీలో బీజేపీతో చంద్ర‌బాబు చేతులు క‌లిపారు. జ‌న‌సేన‌+టీడీపీ+బీజేపీ క‌లిసి సంయుక్తంగా ఎన్డీయే కూట‌మిగా ఏర్పడి.. అసెంబ్లీ , పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. ఇప్ప‌టికే సీట్లు కూడా పంచేసుకున్నారు. అయితే.. ఈ పొత్తుపై వైసీపీ నాయ‌కులు తీవ్ర‌స్తాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. గ‌తంలో బీజేపీ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు చంద్ర‌బాబు చేసిన విమ‌ర్శ‌ల‌ను సోష‌ల్ మీడియాలో రోజు కోర‌కంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, న‌రేంద్ర మోడీ చంద్ర‌బాబుపై చేసిన విమ‌ర్శ‌ల‌ను కూడా ప్ర‌చారం చేస్తున్నారు.

తాజాగా ఈ సోషల్ మీడియాలో జ‌రుగుతున్న దుమారంపై చంద్ర‌బాబు స్పందించారు. లోక్ సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను విడుద‌ల చేసిన చంద్ర‌బాబు.. ఈ సంద‌ర్భంగా తాను ఎన్డీయేతో ఎందుకు పొత్తు పెట్టుకున్న‌దీ సంపూర్ణంగా మ‌రోసారి వివ‌రించారు. ఇదే స‌మ‌యంలో త‌మ పొత్తుపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు కూడా ఆయ‌న దీటుగా జ‌వాబు చెప్పారు. తాను విమ‌ర్శ‌ల‌కు ప‌డిపోయే నాయ‌కుడిని కాద‌న్నారు. అలాగని త‌న‌ను పొగిడించుకోవ‌డం కూడా ఇష్టంలేద‌న్నారు.

ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లుచేసినా.. బీజేపీతోనే క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని చెప్పారు. గెలుపుత‌థ్య‌మ‌ని తేలిందికాబ‌ట్టే.. వైసీపీ నాయ‌కులు విష‌ ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీయేలో చేరామని చెప్పారు. పార్లమెంటులో బలమైన గళం వినిపిస్తూ… రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే అభ్యర్థులుగా నిలబెడుతున్నామని తెలిపారు.

పార్లమెంటుకు పోటీ చేసే 13 మంది తెలుగుదేశం అభ్యర్థులను, వీరితో పాటు మరో 11 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నామని చెప్పారు. ‘ప్రజలారా దీవించండి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ కూట‌మి విజ‌యం త‌థ్య‌మ‌ని ప్ర‌జ‌ల ఆశీర్వాదం ఉంద‌ని తేల్చి చెప్పారు. టీడీపీ నాయ‌కులు గతాన్ని మ‌రిచిపోయి.. పోరాట యోధులుగా మారి పార్టీల‌ను గెలిపించాల‌ని పిలుపునిచ్చారు.

This post was last modified on March 22, 2024 2:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

46 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago