Political News

ఎన్డీయేలో ఎందుకు చేరామో చెప్పిన చంద్ర‌బాబు

ఏపీలో బీజేపీతో చంద్ర‌బాబు చేతులు క‌లిపారు. జ‌న‌సేన‌+టీడీపీ+బీజేపీ క‌లిసి సంయుక్తంగా ఎన్డీయే కూట‌మిగా ఏర్పడి.. అసెంబ్లీ , పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. ఇప్ప‌టికే సీట్లు కూడా పంచేసుకున్నారు. అయితే.. ఈ పొత్తుపై వైసీపీ నాయ‌కులు తీవ్ర‌స్తాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. గ‌తంలో బీజేపీ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు చంద్ర‌బాబు చేసిన విమ‌ర్శ‌ల‌ను సోష‌ల్ మీడియాలో రోజు కోర‌కంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, న‌రేంద్ర మోడీ చంద్ర‌బాబుపై చేసిన విమ‌ర్శ‌ల‌ను కూడా ప్ర‌చారం చేస్తున్నారు.

తాజాగా ఈ సోషల్ మీడియాలో జ‌రుగుతున్న దుమారంపై చంద్ర‌బాబు స్పందించారు. లోక్ సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను విడుద‌ల చేసిన చంద్ర‌బాబు.. ఈ సంద‌ర్భంగా తాను ఎన్డీయేతో ఎందుకు పొత్తు పెట్టుకున్న‌దీ సంపూర్ణంగా మ‌రోసారి వివ‌రించారు. ఇదే స‌మ‌యంలో త‌మ పొత్తుపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు కూడా ఆయ‌న దీటుగా జ‌వాబు చెప్పారు. తాను విమ‌ర్శ‌ల‌కు ప‌డిపోయే నాయ‌కుడిని కాద‌న్నారు. అలాగని త‌న‌ను పొగిడించుకోవ‌డం కూడా ఇష్టంలేద‌న్నారు.

ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లుచేసినా.. బీజేపీతోనే క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని చెప్పారు. గెలుపుత‌థ్య‌మ‌ని తేలిందికాబ‌ట్టే.. వైసీపీ నాయ‌కులు విష‌ ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీయేలో చేరామని చెప్పారు. పార్లమెంటులో బలమైన గళం వినిపిస్తూ… రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే అభ్యర్థులుగా నిలబెడుతున్నామని తెలిపారు.

పార్లమెంటుకు పోటీ చేసే 13 మంది తెలుగుదేశం అభ్యర్థులను, వీరితో పాటు మరో 11 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నామని చెప్పారు. ‘ప్రజలారా దీవించండి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ కూట‌మి విజ‌యం త‌థ్య‌మ‌ని ప్ర‌జ‌ల ఆశీర్వాదం ఉంద‌ని తేల్చి చెప్పారు. టీడీపీ నాయ‌కులు గతాన్ని మ‌రిచిపోయి.. పోరాట యోధులుగా మారి పార్టీల‌ను గెలిపించాల‌ని పిలుపునిచ్చారు.

This post was last modified on March 22, 2024 2:41 pm

Share

Recent Posts

`అయోధ్య‌`కు రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా?!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత రామ‌జ‌న్మ‌భూమి అయోధ్యలో ఉన్న బాల‌రామ‌య్య ఆల‌యానికి రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా? ఇక‌, ఆల‌యానికి రాజకీయ ప్ర‌భావం,…

41 minutes ago

సూర్య ఛెప్పిన కార్తి ‘పొటాటో చిప్స్’ కథ

సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్‌లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…

1 hour ago

హీరో దర్శకత్వపు కల… అదెప్పుడు నెరవేరునో

టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…

3 hours ago

సాక్షిలో రెండో పేజీకి చేరిన రాజన్న

ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…

4 hours ago

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

5 hours ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

6 hours ago