టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ అభ్యర్థులపై పట్టు బిగించారు. అనేక పర్యాయాలు సర్వేలు.. సంప్రదింపులు జరిపిన చంద్రబాబు పలు కీలక నియోజకవర్గాలకు పెను మార్పులు చేయకుండానే టికెట్లు ఇచ్చేశారు. దీనిలో భాగంగా కొన్నాళ్లుగా తీవ్ర ఉత్కంఠగా ఉన్న పెనమలూరు టికెట్ను మాజీ ఎమ్మెల్యే సిట్టింగ్ నాయకుడు బోడే ప్రసాద్కే చంద్రబాబు కట్టబెట్టారు. దీంతో పెను వివాదానికి తెరదించినట్టయింది.
ఇక, ప్రస్తుతం పెండింగులో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు. అదేవిధంగా పార్లమెంటు స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేశారు. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. దీనిలో భాగంగా ఇదివరకే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు మరో 11 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. కాగా, మరో ఐదు శాసనసభ, నాలుగు ఏంపీ స్థానాలను పెండింగులో పెట్టింది.
11 మంది అసెంబ్లీ అభ్యర్థులు వీరే
పలాస – గౌతు శిరీష
పాతపట్నం – మామిడి గోవింద్ రావు
శ్రీకాకుళం – గొండు శంకర్
శృంగవరపు కోట – కోళ్ల లలితా కుమారి
కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వర రావు
అమలాపురం – అయితాబత్తుల ఆనంద రావు
పెనమలూరు (ఎస్సీ) – బోడె ప్రసాద్
మైలవరం – వసంత వెంకట కృష్ణ ప్రసాద్
నరసరావుపేట – డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు
చీరాల – మద్దులూరి మాలకొండయ్య యాదవ్
సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
పార్లమెంట్ అభ్యర్థుల జాబితా
శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం – మెతుకుమిల్లి భరత్
అమలాపురం – గంటి హరీష్ మాధుర్
ఏలూరు – పుట్ట మహేష్ యాదవ్
విజయవాడ- కేశినేని శివనాధ్ (చిన్ని)
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
బాపట్ల – టీ. కృష్ణ ప్రసాద్
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్ రావు
కర్నూలు – బస్తిపాటి నాగరాజు
నంద్యాల – బైరెడ్డి శబరి
హిందూపూర్ – బీకే పార్థసారధి
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…