కీలకమైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు ఏపీ పరిస్థితి ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది. ఇటీవల ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించి.. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట శివారులో ఉన్న బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు హాజరయ్యారు. అయితే.. ఈ సభలో ఉద్దేశ పూర్వక నిర్లక్ష్యం కారణంగా.. ఇబ్బందులు తలెత్తాయనేది టీడీపీ నేతల ఆరోపణ. ప్రధాన మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో మైకులు పనిచేయకపోవడం.. సభకు వస్తున్నవారు రాకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించకపోవడంతో ఏపీ ప్రభుత్వంపై అనుమానాలు పెరుగుతున్నాయి.
ఈ క్రమంలో టీడీపీ, జనసేన నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారులకు 240 పైకిగా ఫిర్యాదులు అందించారు. వీటిని రాష్ట్ర ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. దీనిని సీరియస్గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.. వివరణ ఇవ్వాలంటూ.. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్మీనాను ఆదేశించారు. ప్రధాని పాల్గొన్న సభలో పోలీసులు వ్యవహరించిన తీరును డీజీపీ నుంచి వివరణ తీసుకుని తమకు ఇవ్వాలని కోరారు.
ఈ సభలో మైక్ సరిగా పనిచేయకపోవడం, మైక్ సెట్టింగ్ కంట్రోల్ వద్ద తోపులాట, లైటింగ్ టవర్లపైకి జనం ఎక్కడం, వారిని నియంత్రించాల్సిన పోలీసులు దరిదాపుల్లో లేకపోవడం వంటి అంశాలపై కూటమి నేతలు రెండ్రోజుల కిందట ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
తాజాగా ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించింది. ప్రధాని మోడీ హాజరైన ప్రజాగళం సభలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలపై నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సీఈవోను కోరింది. త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీఈవోను ఈసీ ఆదేశించింది. దీంతో ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని ఇటు పోలీసులు, అటు వైసీపీ నాయకులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ విషయంలో పోలీసుల వైఫల్యం రుజువైతే.. డీజీపీ సహా.. గుంటూరు ఎస్పీ, ఐజీలపై వేటు పడడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…