Political News

ఆ రోజు ఏం జ‌రిగింది ? ఏపీని కోరిన ఎన్నికల సంఘం

కీల‌కమైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లకు ముందు ఏపీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డేలా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ప్ర‌దాన మంత్రి న‌రేంద్ర మోడీ ఏపీలో ప‌ర్య‌టించి.. గుంటూరు జిల్లాలోని చిల‌క‌లూరిపేట శివారులో ఉన్న బొప్పూడిలో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ స‌భ‌లో ఉద్దేశ పూర్వ‌క నిర్ల‌క్ష్యం కార‌ణంగా.. ఇబ్బందులు త‌లెత్తాయ‌నేది టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌. ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తున్న‌ స‌మ‌యంలో మైకులు ప‌నిచేయ‌క‌పోవ‌డం.. స‌భ‌కు వ‌స్తున్న‌వారు రాకుండా ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌క‌పోవ‌డంతో ఏపీ ప్ర‌భుత్వంపై అనుమానాలు పెరుగుతున్నాయి.

ఈ క్ర‌మంలో టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారుల‌కు 240 పైకిగా ఫిర్యాదులు అందించారు. వీటిని రాష్ట్ర ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించారు. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారులు.. వివ‌ర‌ణ ఇవ్వాలంటూ.. ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ముఖేష్ కుమార్‌మీనాను ఆదేశించారు. ప్రధాని పాల్గొన్న సభలో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును డీజీపీ నుంచి వివ‌ర‌ణ తీసుకుని త‌మ‌కు ఇవ్వాల‌ని కోరారు.

ఈ సభలో మైక్ సరిగా పనిచేయకపోవడం, మైక్ సెట్టింగ్ కంట్రోల్ వద్ద తోపులాట, లైటింగ్ టవర్లపైకి జనం ఎక్కడం, వారిని నియంత్రించాల్సిన పోలీసులు దరిదాపుల్లో లేకపోవడం వంటి అంశాలపై కూటమి నేతలు రెండ్రోజుల కిందట ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.

తాజాగా ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించింది. ప్రధాని మోడీ హాజరైన ప్రజాగళం సభలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలపై నివేదిక ఇవ్వాలంటూ ఏపీ సీఈవోను కోరింది. త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీఈవోను ఈసీ ఆదేశించింది. దీంతో ఎలాంటి ఆదేశాలు వ‌స్తాయోన‌ని ఇటు పోలీసులు, అటు వైసీపీ నాయ‌కులు కూడా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఈ విష‌యంలో పోలీసుల వైఫ‌ల్యం రుజువైతే.. డీజీపీ స‌హా.. గుంటూరు ఎస్పీ, ఐజీల‌పై వేటు ప‌డ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

This post was last modified on March 22, 2024 7:30 am

Share

Recent Posts

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

50 seconds ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

1 hour ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

1 hour ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

2 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

3 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

3 hours ago