టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వెంట నడిచిన నాయకులకు న్యాయం జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది.. నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. ఈ యా త్ర ద్వారా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఇక, ఈ యాత్రకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఇలానే అనేక మంది యాత్రకు సహకరించారు. ఆర్థిక సాయం చేయడంతోపాటు.. జనాలను తరలించ డం వరకు కూడా.. అనేక రూపాల్లో సాయం చేశారు.
ఇలాంటి వారిలో కొందరు.. నారా లోకేష్ మనసు చూరగొన్నారు. యువగళానికి సంబంధించి పక్కా ప్లాన్తో ముందుకు సాగడం దగ్గర నుంచి కార్యకర్తలను మొబిలైజ్ చేయడం.. ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు అవస రం వంటి అనేక విషయాలను వారు చూసుకున్నారు. ఇలాంటి వారికి నారా లోకేష్ చాలా చేరువయ్యారు. ఈ క్రమంలో కొందరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని తమ మనసులో కోరికను వెల్లడించారు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నన్నారు.
అయితే, వీరిలో ముగ్గురు నుంచి నలుగురి వరకు టికెట్లు ఇప్పించేందుకు నారా లోకేష్ ఎంతో కృషి చేశారు. వీరిలో ఇప్పటికే టికెట్ సొంతం చేసుకున్న భాష్య ప్రవీణ్ కూడా ఒకరు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపా రి, భాష్యం విద్యాసంస్థల్లో ఒక భాగస్వామి. అదేవిధంగా.. ప్రస్తుతం పెనమలూరు టికెట్ రేసులో ఉన్న దేవినేని చంద్రశేఖర్ కూడా నారా లోకేష్కు అత్యంత ప్రియమైన నాయకుడు. ఇక, సీనియర్ నేత కుమా రుడు, యువ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ రావడం వెనుక కూడా నారా లోకేష్ ఉన్నారు.
వాస్తవానికి ఎన్డీయే పక్షాల పొత్తులో భాగంగా.. శ్రీకాళహస్తి టికెట్ను బీజేపీ కోరుకుంది. దీంతో బీజేపీకి ఇచ్చేందుకు కూడా పార్టీలో చర్చలు జరిగాయి. అయితే.. నారా లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా సుధీర్కు ఇచ్చిన హామీ మేరకు టికెట్ దక్కడం విశేషం. ఇక, కొందరికి పార్టీలోనూ పదవులు ఇప్పించారు. టికెట్ ఇవ్వలేని వారికి ఈ అవకాశం కల్పించారు. మొత్తంగా చూస్తే.. నారా లోకేష్ బృందానికి మేలు జరిగిందనేది టీడీపీ నేతల మాట.
This post was last modified on March 23, 2024 4:40 pm
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…
పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గ ధామంగా మారుతుందని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి.. పెట్టుబడి దారులతో…
డిసెంబరు 5 నుంచి వాయిదా పడ్డ నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ-2’ను మరీ ఆలస్యం చేయకుండా వారం వ్యవధిలోనే…