వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన్ని రాజకీయంగా ఢీ కొట్టే సత్తా ఎవరికైనా వుందా.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇలా వైఎస్ కుటుంబీకులే చాలాకాలంగా పులివెందుల నియోజకవర్గాన్ని ఏలుతున్నారు.! ఔను, ఏలుతున్నారనడమే కరెక్ట్.!
పులివెందులలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడటమంటే చిన్న విషయం కాదు.. శాల్తీలు లేచిపోతాయ్.. అనే భావన ఒకటుంది. వైసీపీ శ్రేణులు ఇదే మాట చెబుతుంటాయ్ కూడా.! రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించే క్రమంలో, వైసీపీ మద్దతుదారులు పులివెందుల గురించి ఇచ్చే ఎలివేషన్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
ప్రత్యర్థి ఎవరు.? అన్న విషయం అనవసరం.. వైఎస్ కుటుంబం ఎలక్షనీరింగ్ ముందు ఎవరైనా బొక్కబోర్లా పడాల్సిందే. ఈసారి ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అదే వైఎస్ కుటుంబం నుంచి షాక్ తగలొచ్చు. షర్మిల పోటీ చేస్తారా.? సునీతారెడ్డిని బరిలోకి దింపుతారా.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్.
వైఎస్ షర్మిల అయితే కడప ఎంపీ సీటుకు పోటీ చేసే అవకాశాలున్నాయి. సునీతా రెడ్డి, ఆమె తల్లి.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు కాంగ్రెస్ నుంచి బరిలో వుంటారేమో. టీడీపీ నుంచి బీటెక్ రవి రంగంలోకి దిగారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆయన.
అవన్నీ పక్కన పెడితే, పులివెందులలో ఈసారి రాజకీయం ఒకింత ఆసక్తికరంగా మారింది.. అదీ మునుపెన్నడూ లేనంత ఆసక్తికరంగా. వైఎస్ జగన్కి తిరుగే లేదు.. అనే స్థాయి నుంచి, రాజకీయ ప్రత్యర్థులు ‘వై నాట్ పులివెందుల’ అనేదాకా వెళ్ళింది పరిస్థితి.
‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పులివెందులలో ఓడిపోతారు..’ అనే ప్రచారాన్ని గట్టిగా విపక్ష పార్టీలు చేయగలుగుతున్నాయి. ఆ వాదనకు పులివెందులలోనూ కొన్ని గొంతుకలు వంత పాడుతుండడం గమనార్హం.
విపక్షాలు ఎంత కష్టపడ్డా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాకపోవచ్చుగానీ, జగన్ రాజకీయంగా కుదులయ్యేలా బొటాబొటి మెజార్టీతో మాత్రమే గెలుపు దక్కొచ్చన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. వైఎస్ వివేకానంద రెడ్డి డెత్ మిస్టరీ ఫ్యాక్టర్ ఏమైనా వర్కవుట్ అయితే, వైఎస్ జగన్
ఓటమి కూడా జరగొచ్చేమోనన్నది ఇంకొందరి అభిప్రాయం.
This post was last modified on March 23, 2024 6:34 pm
టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి.. పార్టీ నాయకులకు బాగా కలిసి వస్తోందన్నవాదన వినిపిస్తోంది. ఇప్పటికి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు.. తమ్ముళ్లకు…
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…