నిన్న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో సంభాషణలు రాజకీయ ఉద్దేశాలతో ఉన్నాయనే వివాదం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ తాను ఇంకా చూడలేదని, ఒకవేళ ఓటర్లను ప్రేరేపించేలా ఉంటే మాత్రం దర్శక నిర్మాతలకు నోటీసు పంపిస్తామని చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పవన్ పిఠాపురం మీటింగ్ లో కార్యకర్తలతో మాట్లాడుతూ దర్శకుడు హరీష్ శంకర్ పోరు పడలేకే ఆ డైలాగు చెప్పానని, తనకు లేకపోయినా అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సహకరించానని చెప్పడం వీడియో రూపంలో తిరిగింది.
నిజానికి గాజు గ్లాసు గురించి పంచులు గట్టిగానే ఉన్నాయి కానీ వాటిని నేరుగా ప్రతిపక్ష పార్టీలు తమకు తాము అన్వయించుకుంటే ఎలాని అభిమానుల ప్రశ్న. సినిమాలో ఒక పాత్ర విసిరిన సవాల్ కు బదులుగా పోలీస్ దుస్తుల్లో ఉన్న భగత్ సింగ్ చెప్పే సమాధానం తప్పించి దానికి ఇంకే అర్థం లేదని అంటున్నారు. వాళ్ళ వెర్షన్ ఎలా ఉన్నా ఎన్నికల వాతావరణంలో ప్రతి చిన్న అంశం ఎక్కువగా హైలైట్ అవుతుంది. అందులోనూ జనసేన తరఫున యాక్టివ్ గా ఉంటున్న పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేక దృష్టి ఉంది. ఇలాంటి సమయంలో టీజర్ వచ్చి వివాదం తెచ్చింది.
ఇది ఎలాంటి ఇబ్బంది లేకుండా సద్దుమణిగినా లేక నోటీసులు గట్రా వచ్చి వీడియో తీసేయడం దాకా వెళ్లినా దాని వల్ల వచ్చే పబ్లిసిటీ ఉస్తాద్ భగత్ సింగ్ కు మరింత ఉపయోగపడుతుందనే కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ఇంకా పాతిక శాతం కూడా షూటింగ్ పూర్తి కాకుండానే రెండు టీజర్లు కట్ చేయించిన హరీష్ శంకర్ ప్రస్తుతం తాను చేస్తున్న రవితేజ మిస్టర్ బచ్చన్ కంటే ఉస్తాద్ ద్వారానే ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నాడు. తన నుంచి, నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి వివరణ ఇంకా రాలేదు కానీ నోటీసు లాంటిది ఏదైనా వస్తేనే రెస్పాండ్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు టాక్.
This post was last modified on March 20, 2024 9:53 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…