నిన్న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో సంభాషణలు రాజకీయ ఉద్దేశాలతో ఉన్నాయనే వివాదం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ తాను ఇంకా చూడలేదని, ఒకవేళ ఓటర్లను ప్రేరేపించేలా ఉంటే మాత్రం దర్శక నిర్మాతలకు నోటీసు పంపిస్తామని చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పవన్ పిఠాపురం మీటింగ్ లో కార్యకర్తలతో మాట్లాడుతూ దర్శకుడు హరీష్ శంకర్ పోరు పడలేకే ఆ డైలాగు చెప్పానని, తనకు లేకపోయినా అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సహకరించానని చెప్పడం వీడియో రూపంలో తిరిగింది.
నిజానికి గాజు గ్లాసు గురించి పంచులు గట్టిగానే ఉన్నాయి కానీ వాటిని నేరుగా ప్రతిపక్ష పార్టీలు తమకు తాము అన్వయించుకుంటే ఎలాని అభిమానుల ప్రశ్న. సినిమాలో ఒక పాత్ర విసిరిన సవాల్ కు బదులుగా పోలీస్ దుస్తుల్లో ఉన్న భగత్ సింగ్ చెప్పే సమాధానం తప్పించి దానికి ఇంకే అర్థం లేదని అంటున్నారు. వాళ్ళ వెర్షన్ ఎలా ఉన్నా ఎన్నికల వాతావరణంలో ప్రతి చిన్న అంశం ఎక్కువగా హైలైట్ అవుతుంది. అందులోనూ జనసేన తరఫున యాక్టివ్ గా ఉంటున్న పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేక దృష్టి ఉంది. ఇలాంటి సమయంలో టీజర్ వచ్చి వివాదం తెచ్చింది.
ఇది ఎలాంటి ఇబ్బంది లేకుండా సద్దుమణిగినా లేక నోటీసులు గట్రా వచ్చి వీడియో తీసేయడం దాకా వెళ్లినా దాని వల్ల వచ్చే పబ్లిసిటీ ఉస్తాద్ భగత్ సింగ్ కు మరింత ఉపయోగపడుతుందనే కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ఇంకా పాతిక శాతం కూడా షూటింగ్ పూర్తి కాకుండానే రెండు టీజర్లు కట్ చేయించిన హరీష్ శంకర్ ప్రస్తుతం తాను చేస్తున్న రవితేజ మిస్టర్ బచ్చన్ కంటే ఉస్తాద్ ద్వారానే ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నాడు. తన నుంచి, నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి వివరణ ఇంకా రాలేదు కానీ నోటీసు లాంటిది ఏదైనా వస్తేనే రెస్పాండ్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు టాక్.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…