నిన్న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో సంభాషణలు రాజకీయ ఉద్దేశాలతో ఉన్నాయనే వివాదం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ తాను ఇంకా చూడలేదని, ఒకవేళ ఓటర్లను ప్రేరేపించేలా ఉంటే మాత్రం దర్శక నిర్మాతలకు నోటీసు పంపిస్తామని చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పవన్ పిఠాపురం మీటింగ్ లో కార్యకర్తలతో మాట్లాడుతూ దర్శకుడు హరీష్ శంకర్ పోరు పడలేకే ఆ డైలాగు చెప్పానని, తనకు లేకపోయినా అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సహకరించానని చెప్పడం వీడియో రూపంలో తిరిగింది.
నిజానికి గాజు గ్లాసు గురించి పంచులు గట్టిగానే ఉన్నాయి కానీ వాటిని నేరుగా ప్రతిపక్ష పార్టీలు తమకు తాము అన్వయించుకుంటే ఎలాని అభిమానుల ప్రశ్న. సినిమాలో ఒక పాత్ర విసిరిన సవాల్ కు బదులుగా పోలీస్ దుస్తుల్లో ఉన్న భగత్ సింగ్ చెప్పే సమాధానం తప్పించి దానికి ఇంకే అర్థం లేదని అంటున్నారు. వాళ్ళ వెర్షన్ ఎలా ఉన్నా ఎన్నికల వాతావరణంలో ప్రతి చిన్న అంశం ఎక్కువగా హైలైట్ అవుతుంది. అందులోనూ జనసేన తరఫున యాక్టివ్ గా ఉంటున్న పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేక దృష్టి ఉంది. ఇలాంటి సమయంలో టీజర్ వచ్చి వివాదం తెచ్చింది.
ఇది ఎలాంటి ఇబ్బంది లేకుండా సద్దుమణిగినా లేక నోటీసులు గట్రా వచ్చి వీడియో తీసేయడం దాకా వెళ్లినా దాని వల్ల వచ్చే పబ్లిసిటీ ఉస్తాద్ భగత్ సింగ్ కు మరింత ఉపయోగపడుతుందనే కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ఇంకా పాతిక శాతం కూడా షూటింగ్ పూర్తి కాకుండానే రెండు టీజర్లు కట్ చేయించిన హరీష్ శంకర్ ప్రస్తుతం తాను చేస్తున్న రవితేజ మిస్టర్ బచ్చన్ కంటే ఉస్తాద్ ద్వారానే ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నాడు. తన నుంచి, నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి వివరణ ఇంకా రాలేదు కానీ నోటీసు లాంటిది ఏదైనా వస్తేనే రెస్పాండ్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు టాక్.
This post was last modified on March 20, 2024 9:53 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…