టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఉదయాన్నే 7 గంటలకల్లా ఉండవల్లిలోని నివాసం నుంచి మంగళగిరిలోని నిర్ణీత ప్రాంతానికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కూడా ఆయన తన కాన్వాయ్(మూడు కార్లు)తో ఉండవల్లి నుంచి బయలు దేరి.. మంగళగిరికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే.. ఆయన కాన్వాయ్ మంగళగిరి హైవే ఎక్కగానే పోలీసులు నిలువరించారు.
దీంతో నారా లోకేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సహజంగ తన పర్యటనలను పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా తన పర్యటనలను వారు అడ్డుకుంటారని భావించారు. అయితే.. ఎన్నికల విధుల్లో భాగంగానే తాము వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో నారా లోకేష్ వారికి సహకరించారు. మొత్తం మూడు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులకు వాహనాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువులు లభించలేదు.
సుమారు 20 నిమిషాల పాటు మూడు కార్లను పోలీసులు తనిఖీ చేయడం గమనార్హం. తనిఖీలు జరుగున్నంత సేపు.. నారా లోకేష్ కారు బయటకు దిగి పోలీసులకు సహకరించడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రేయింబవళ్లు పోలీసులు, ఎన్నికల అధికారులు కూడా.. తనిఖీలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. మంగళగిరిలో ఈ దఫా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న నారా లోకేష్ వివిధ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.
మంగళగిరిలోని పలు అపార్ట్మెంట్ల వాసులతో గత నాలుగు రోజులుగా లోకేశ్ రోజూ ఉదయాన్నే ‘బ్రేక్ఫాస్ట్ విత్ లోకేశ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోజుకో అపార్ట్మెంట్ సముదాయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పటి వరకు తాము ఏం చేశామో కూడా చెబుతున్నారు.
This post was last modified on March 20, 2024 2:46 pm
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది.…
ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…
ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…