ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తిరిగి ఆ పార్టీ గూటికి చేరుతున్నారా? రేపోమాపో ఆమె కండువా కప్పుకోవడం ఖాయమా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం పనబాక టీడీపీలో ఉన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత.. అనూహ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. ఈ క్రమంలో పనబాక లక్ష్మి.. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అప్పటికే ఆమె కేంద్రంలోనూ చక్రం తిప్పారు.
తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకుని.. తిరుపతి పార్లమెంటుస్థానం నుంచి ఎన్నికల్లో పోటీకి దిగారు. అయితే.. 2019లో పనబాక ఓటమి పాలయ్యారు. మరోసారి ఆమెకు చంద్రబాబు ఉప ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణంతో వచ్చిన ఉప పోరులో పనబాక పోటీ చేసినా.. మళ్లీ ఆమె ఓడి పోయారు. కట్ చేస్తే.. ప్రస్తుతం మరోసారి సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. షెడ్యూల్ కూడా వచ్చేసిం ది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
అయితే.. ప్రస్తుతం ఉన్న పోటీలో పనబాక నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్థికంగా బలంగానే ఉన్నారా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం ఒక తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొంది. దీంతో ఆమె ఆ పోటీని తట్టుకుని గెలుచుకుని రాగలరా? అనేది ప్రధాన ప్రశ్న. ఈ క్రమంలో టీడీపీ అధినేత రెండు నియోజకవర్గాల్లో పనబాక గురించి.. సర్వే నిర్వహించారు. ఈ రెండు చోట్లా కూడా.. పనబాకకు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది.
దీంతో పనబాకకు టికెట్ నిరాకరణ తప్పలేదు. అయితే.. పార్టీకోసం సేవ చేస్తే.. ఆమేరకు గుర్తింపు ఉం టుందని మాత్రం హామీ ఇచ్చారు. కానీ, ఇదే తనకు లాస్ట్ ఛాన్స్ అని భావిస్తున్న పనబాక.. పోటీ నుంచి తప్పుకొనేందుకు ఏ మాత్రం కూడా ఇష్టపడడం లేదు. ఈ క్రమంలో తిరిగి పాతగూటికే చేరుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వైఎస్ షర్మిల నేతృత్వంలో ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని సమాచారం. ఈ క్రమంలో పనబాక బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
This post was last modified on March 20, 2024 12:51 pm
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో నాయకులు, పార్టీల అధినే తలు ఎక్కడికక్కడ సేద…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…