Political News

కాకినాడ జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్థి ఈయ‌నే: ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రెండు పార్ల‌మెంటు స్థానాలు జ‌న‌సేన‌కు ద‌క్కాయి . దీనిలో ఒక‌టి మ‌చిలీప‌ట్నం. రెండు కాకినాడ‌. ఈ రెండు చోట్ల కూడా కాపులు ఎక్కువ‌గా ఉన్నారు. ఇక‌, మ‌చిలీప‌ట్నం టికెట్‌కు సిట్టింగ్ ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరినే రంగంలోకి దింప‌నున్నారు. ఈయ‌న కాపు నాయ‌కుడు. వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నికల్లో పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గం మార్చ‌డంతో ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌న‌సేన‌కు జై కొట్టారు. ఇక‌, ఆయ‌న‌కు మ‌చిలీప‌ట్నం టికెట్ ఇవ్వ‌నున్నారు.

ఇక‌, మిగిలిన కాకినాడ టికెట్‌ను తాజాగా ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ కుమార్ పేరును పవన్ ప్రకటించారు. ఉదయ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం జ‌న‌సేన పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆ స్థానంలో పవన్ బరిలోకి దిగడంతో ఉదయ్ కుమార్ కు కాకినాడ ఎంపీ సీటు ఖరారు చేశారు. ఉదయ్ తనకు తమ్ముడి లాంటి వాడని, తన విజయం కోసం కూటమి శ్రేణులు సహకారం అందించాలని పవన్ కోరారు. ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ పేరు ప్రకటిస్తూ.. భవిష్యత్తులో నాకు ఎసరు పెట్టవు కదా అంటూ సరదాగా ప‌వ‌న్‌ వ్యాఖ్యానించారు.

ఉదయ్ తన కోసం త్యాగం చేశాడని, భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు ప‌వ‌న్‌ సూచించారు. తాను అందర్నీ కలుపుకొని వెళ్లే రకమ‌ని ప‌వ‌న్ చెప్పారు. తప్పదు అనుకుంటే తప్ప నేను ఎవ‌రితోనూ గొడవకు వెళ్లను అని జనసేన అధినేత పవన్ అన్నారు. పిఠాపురాన్ని ఎవరైనా భయపెడతా అంటే.. వారికి వ్యతిరేకంగా తాను అడ్డుగోడగా నిలబడతానని చెప్పారు. తనను కట్టడి చేసే బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మిథున్‌ను కలిసిన సందర్భంగా ఎన్ని కష్టాలు ఎదురైనా తమ నియోజకవర్గాన్ని కాపాడుకుంటామని చెప్పినట్లు తెలిపారు.

This post was last modified on March 19, 2024 10:12 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

2 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

2 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

3 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

3 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

4 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

6 hours ago