Political News

కాకినాడ జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్థి ఈయ‌నే: ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రెండు పార్ల‌మెంటు స్థానాలు జ‌న‌సేన‌కు ద‌క్కాయి . దీనిలో ఒక‌టి మ‌చిలీప‌ట్నం. రెండు కాకినాడ‌. ఈ రెండు చోట్ల కూడా కాపులు ఎక్కువ‌గా ఉన్నారు. ఇక‌, మ‌చిలీప‌ట్నం టికెట్‌కు సిట్టింగ్ ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరినే రంగంలోకి దింప‌నున్నారు. ఈయ‌న కాపు నాయ‌కుడు. వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నికల్లో పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గం మార్చ‌డంతో ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌న‌సేన‌కు జై కొట్టారు. ఇక‌, ఆయ‌న‌కు మ‌చిలీప‌ట్నం టికెట్ ఇవ్వ‌నున్నారు.

ఇక‌, మిగిలిన కాకినాడ టికెట్‌ను తాజాగా ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ కుమార్ పేరును పవన్ ప్రకటించారు. ఉదయ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం జ‌న‌సేన పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆ స్థానంలో పవన్ బరిలోకి దిగడంతో ఉదయ్ కుమార్ కు కాకినాడ ఎంపీ సీటు ఖరారు చేశారు. ఉదయ్ తనకు తమ్ముడి లాంటి వాడని, తన విజయం కోసం కూటమి శ్రేణులు సహకారం అందించాలని పవన్ కోరారు. ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ పేరు ప్రకటిస్తూ.. భవిష్యత్తులో నాకు ఎసరు పెట్టవు కదా అంటూ సరదాగా ప‌వ‌న్‌ వ్యాఖ్యానించారు.

ఉదయ్ తన కోసం త్యాగం చేశాడని, భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు ప‌వ‌న్‌ సూచించారు. తాను అందర్నీ కలుపుకొని వెళ్లే రకమ‌ని ప‌వ‌న్ చెప్పారు. తప్పదు అనుకుంటే తప్ప నేను ఎవ‌రితోనూ గొడవకు వెళ్లను అని జనసేన అధినేత పవన్ అన్నారు. పిఠాపురాన్ని ఎవరైనా భయపెడతా అంటే.. వారికి వ్యతిరేకంగా తాను అడ్డుగోడగా నిలబడతానని చెప్పారు. తనను కట్టడి చేసే బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మిథున్‌ను కలిసిన సందర్భంగా ఎన్ని కష్టాలు ఎదురైనా తమ నియోజకవర్గాన్ని కాపాడుకుంటామని చెప్పినట్లు తెలిపారు.

This post was last modified on March 19, 2024 10:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

48 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

51 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

1 hour ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago