నగిరి ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి, సినీ నటి, వైసీపీ నేత ఆర్కే రోజా, ఈసారి హ్యాట్రిక్ కొడతానంటున్నారు. ముచ్చటగా మూడోసారి నగిరి ఎమ్మెల్యేగా విజయ కేతనం ఎగరవేస్తానంటున్నారామె. అయితే, నగిరి సీటు మూడోస్సారి రోజాకి దక్కడానికి సంబంధించి చాలా హైడ్రామా నడిచింది.
అసలంటూ రోజాకి నగిరి ఎమ్మెల్యే టిక్కెట్ ఇంకోసారి ఇస్తే, ఆమెను ఓడించి తీరతామని స్థానిక వైసీపీ నేతలు, వైసీపీ అధినాయకత్వానికి వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చారు. అదేంటో, ఏ పార్టీలో వున్నా ఆమెకు సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత ఎదురవుతూ వస్తుంటుంది.
గతంలో పరిస్థితులు వేరు. ఈసారి పరిస్థితులు ఇంకా వేరు.! ఈసారి రోజా గెలవడం దాదాపు అసాధ్యమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే, నగిరిలో రోజాని కాదని ఇంకొకరికి సీటు ఇచ్చేంత రిస్క్ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయలేకపోయారు.
టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ మారేందుకు రోజా సిద్ధంగా వున్నారన్న అంతర్గత సమాచారం నేపథ్యంలో, వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులేశారు. మరోపక్క, స్థానిక వైసీపీ నేతల అసంతృప్తిని చల్లార్చేందుకు తెరవెనుకాల పెద్ద కథే నడిపారట రోజా.
ఈ క్రమంలో ప్రస్తుతానికి కాస్త స్తబ్దుగా వుంది, రోజా పట్ల నగిరి వైకాపాలోని అసమ్మతి వర్గం. ఎన్నికల ప్రచారం సందర్భంగా రోజా వెంట, ఆ అసమ్మతి వర్గం అస్సలు కనిపించే అవకాశం లేదట. అయినాగానీ, రోజా తరఫున ఆమె భర్త సెల్వమణి సహా, సోదరులు, ఇతర కుటుంబ సభ్యులంతా తెరవెనుక వ్యవహారాల్ని చక్కబెట్టేస్తున్నారు.
సామాజిక వర్గ సమీకరణాలు, సినీ గ్లామర్.. ఇవన్నీ రోజాకి కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం లేకపోలేదు. అయితే, సొంత పార్టీలో వ్యతిరేకత నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు రోజాకి. కానీ, ఏదో మ్యాజిక్ జరుగుతుందన్న ధీమా అయితే రోజాలో కనిపిస్తోంది. ఆ మ్యాజిక్ వర్కవుట్ అయితే, రోజా హ్యాట్రిక్ కొట్టినట్లే.!
This post was last modified on March 19, 2024 3:08 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…