Political News

ద‌ళిత బంధు దెబ్బేసింది.. బేఫిక‌ర్‌: కేసీఆర్‌

గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ ఓడిపోతుంద‌ని తాను భావించ‌లేద‌ని ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ద‌ళిత బంధు ద్వారాఇచ్చిన రూ.10 ల‌క్ష‌లు పార్టీని గెలిపిస్తాయ‌ని అనుకున్న‌ట్టు తెలిపారు. అయితే.. అదే త‌మ పార్టీని ఓడించింద‌ని చాలా మంది త‌న‌కు చెప్పిన‌ట్టు వ్యాఖ్యానించారు. “ఓడితే ఓడినం.. కానీ, మ‌నం అమ‌లు చేసిన ద‌ళిత బంధు అనేక కుటుంబాల్లో వెలుగులు నింపింది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కూడా దీనిని ప్ర‌చారం చేసుకుని.. కాంగ్రెస్ ను దెబ్బ‌తీయాలి” అని పార్టీ నాయ‌కుల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ ప్రజల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడానన్నారు. వందలాది సంఘటనలను ఉద్యమంలో చూశానని కేసీఆర్ చెప్పారు. ఉద్యమం అంటే నినాదాలు చేస్తూ చేతిలో రాళ్లు పట్టుకోవడం కాదని.. ఉద్యమానికి ఒక పద్ధతి , సిద్దాంతం ఉంటుందని, ఆ ప్ర‌కార‌మే తాను ముందుకు సాగాన‌ని వివ‌రించారు. వ్యవసాయం స్థిరీకరణ జరగాలని రైతు బంధు తీసుకువచ్చినట్లు చెప్పారు. దళితబంధు తెచ్చినా దళిత సమాజం ఎందుకు ఈ పథకాన్ని అభినందించలేదని వాపోయారు.

తాజాగా పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్న‌ట్టు కేసీఆర్ చెప్పారు. “ప్రవీణ్ కుమార్ నేడు బీఆర్ఎస్ లో చేరిన సందర్భం బాగుంది. భవిష్యత్తులో ప్రవీణ్ కుమార్‌కు మరిన్ని ఉన్నత పదవులలో అవకాశాలు కల్పిస్తా. పార్టీని నిర్మాణం చేసుకుందాం. కమిటీలు వేసుకుందాం. ఇక్కడే నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహించుకుందాం. రానున్న రోజుల్లో మనం అద్భుతమైన విజయం సాధించడం ఖాయం” అని పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి, కేంద్రంలో ఒక పదవి ఇస్తామని తనకు కొందరు ఆఫర్ చేశారని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో దళిత బంధు ఇస్తే అంబేడ్కర్ మనవడు ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పేట్టి, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి అంబేద్కర్ ఇల్లు అని అభినందించారన్నారు. అయినా.. ఎందుకు ఓడిపోయామ‌నే అంద‌రూ ఆలోచించుకోవాల‌న్నారు.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

5 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

8 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago