టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు వైసీపీ దారుణాలకు పాల్పడుతోందని అన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టి.. ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు, ముస్లిం సంఘాల నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ముస్లింలకు మేలు చేసింది, చేసేదీ తెలుగుదేశం పార్టీనేనని తెలిపారు. అనేక పథకాలను అమలు చేశామన్నారు. రంజాన్ తోఫా, షాదీ ముబారక్ వంటి అనేక కార్యక్రమాలతో మైనారిటీలకు అండగా ఉన్నామన్నారు.
అయితే.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించేందుకు, నరకాసురుడు వంటి సీఎం జగన్ను గద్దె దింపేందుకు.. తాము బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఎన్డీయే కూటమిలో చేరామని తెలిపారు. బీజేపీ కూడా మైనారిటీలకు వ్యతిరేకం కాదన్నారు. బీజేపీని కులం పేరుతో, మతం పేరుతో చూసే రోజులు పోయాయని.. ప్రస్తుతం అందరికీ ఆ పార్టీ చేరువైందని.. దేశవ్యాప్తంగా బీజేపీ పుంజుకోవడానికి పార్టీలో తీసుకువచ్చిన సంస్కరణలేనని చంద్రబాబు చెప్పారు. కానీ, తాము బీజేపీతో పొత్తు పెట్టుకోగానే.. వైసీపీ ఒంట్లో వణుకు పుట్టిందన్నారు.
అందుకే, దారుణాలకు తెగబడేందుకు వైసీపీసిద్ధమైందని చంద్రబాబు చెప్పారు. మతం పరంగా ఓట్లను చీల్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యంగా టీడీపీ ఓటు బ్యాంకును దూరం చేసి.. ప్రజల్లో విచ్ఛిన్నకర రాజకీయాలు చేసేందుకు వైసీపీ తెగబడుతోందన్నారు. అన్ని అస్త్రాలు పోయి జగన్ కుల, మత రాజకీయాలపై పడ్డాడని విమర్శించారు. జగన్ ముఖంలో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. పొత్తుపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
జనసేనతో పొత్తు సమయంలో కుల రాజకీయాలు చేసి జగన్ బోల్తాపడ్డారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. “బీజేపీతో మా పొత్తు అనంతరం వైసీపీ మత రాజకీయానికి తెరలేపింది. పొత్తు వల్ల మైనారిటీలకు నష్టం కలుగుతుందన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. ముస్లిం సంఘాల నేతలు వైసీపీ మత రాజకీయాలను ఎండగట్టాలి. మేం ముస్లింలకు కడుపులో పెట్టుకుని చూసుకున్నాం” అని చంద్రబాబు అన్నారు. మైనారిటీలను ఏకం చేసి.. పార్టీవైపు మళ్లించుకునేందుకు మైనారిటీ సంఘాలు కలిసిరావాలని పిలుపునిచ్చారు.
This post was last modified on March 19, 2024 8:45 am
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…