Political News

వైసీపీ ఖాతాలో 442 కోట్లు.. బాండ్ల ఎఫెక్ట్‌

ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ్య‌వ‌హారం దేశాన్ని కుదిపేస్తున్న విష‌యం తెలిసిందే. ఎవ‌రు ఇచ్చారో.. తెలియ‌ని ఈ బాండ్ల నిధులు కోట్ల కు కోట్ల రూపంలో పార్టీల‌కు చేరిపోయాయి. సుదీర్ఘంగా 2019 నుంచి సాగిన ఈ బాండ్ల వ్య‌వ‌హారం.. తాజాగా సుప్రీం కోర్టు జోక్యంతో బ‌ట్ట‌బ‌య‌లైంది. ఈ క్ర‌మంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన తాజా సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచింది. సీల్ట్‌ కవరులో కోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ క్రమంలోనే కొత్త సమాచారాన్ని ఈసీ అందుబాటులో ఉంచింది. ఈసీ వెల్లడించిన డేటా ప్రకారం.. ఏపీ అధికార పార్టీకి ఏకంగా 442 కోట్ల రూపాయ‌లు ముట్టాయి. దీనిని ఎవ‌రు ఇచ్చారు? ఎంత మంది ఇచ్చారు? అనేది ప్ర‌స్తుతానికి గోప్యంగా ఉంచారు. మ‌రోసారి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే ఆ వివ‌రాలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, మ‌రో ప్రాంతీయ పార్టీ, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి 181 కోట్ల రూపాయ‌ల సొమ్ము ద‌క్కింది. ప‌లువురు టీడీపీకి అనుకూలంగా ఎస్‌బీఐలో బాండ్లు కొనుగోలు చేశారు.

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకీ ద‌క్క‌నంత సొమ్ము ద‌క్కింది. ఏకంగా రూ.1322 కోట్ల రూపాయ‌ల‌ను ఈ పార్టీ త‌న ఖాతాలో వేసుకుంది. ఒడిశాలో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న న‌వీన్ ప‌ట్నాయ‌క్ నేతృత్వం లోని బిజు జ‌న‌తాద‌ళ్‌ కూడా ఏమీ త‌క్కువ తిన‌లేదు. ఈ పార్టీకి కూడా 944 కోట్ల రూపాయ‌లు బాండ్ల రూపంలో అందాయి.

జాతీయ పార్టీల్లో బీజేపీ అత్యధికంగా రూ.6,986.5 కోట్లు విరాళాలను ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో పొందింది. కాంగ్రెస్ పార్టీకి 1334 కోట్లు, ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ – రూ.1,397 కోట్లు, త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే – రూ.656.5 కోట్లు ముట్టాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం సమాజ్‌వాదీ పార్టీ – రూ.14.5 కోట్లు ద‌క్కించుకుంది. పంజాబ్‌కు చెందిన అకాలీదళ్‌ – రూ.7.26కోట్లు, త‌మిళ‌నాడు విప‌క్షం ఏఐఏడీఎంకే – రూ.6.05కోట్లు, జమ్ము క‌శ్మీర్‌కు చెందిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ – రూ.50 లక్షలు బాండ్ల రూపంలో సొమ్ము చేసుకుంది.

This post was last modified on March 18, 2024 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘చిట్టి’బాబుని ‘పెద్ది’గాడు కొట్టగలడా?

ఎట్టకేలకు ఊహించినట్టే, ముందే లీకైనట్టే పెద్ది విడుదల తేదీ జూన్ 4 అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన నిర్మాణ సంస్థ…

53 minutes ago

లండన్ కొలువులో కొడుకు… తల్లికి ఇందిరమ్మ ఇల్లు

సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపికలో అప్పుడప్పుడూ చిత్రవిచిత్రాలు బయటపడుతూ ఉంటాయి. అలా బయటపడిన విచిత్రాలను సరిదిద్దడం అప్పటికప్పుడు సాధ్యం…

2 hours ago

థియేటర్లు కోరుకున్న జోష్ వచ్చిందా

ఇవాళ స్ట్రెయిట్, డబ్బింగ్ అన్ని భాషలు కలిపి చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజయ్యాయి. కానీ థియేటర్ల దగ్గర కోరుకున్న స్థాయిలో జోష్…

2 hours ago

సైలెంట్ అయితే ఎలా సామ్

సమంత టైటిల్ రోల్ పోషించిన మా ఇంటి బంగారం మే 15 రావడం లేదని ఫిలిం నగర్ టాక్. వాయిదా…

4 hours ago

పోరాట యోధుడిగా సల్మాన్ సర్ప్రైజ్

ఈ మధ్య సినిమాల్లో ఏదైనా దాచిపెట్టి సినిమాల్లో సడన్ సర్ప్రైజ్ ఇద్దామంటే అది లీక్ కాకుండా కాపాడుకోవడంలో దర్శక నిర్మాతలు…

7 hours ago

హోటళ్లకు బండ బాదుడే

దేశంలో వంట గ్యాస్ కు కొరత ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే అర్థమైపోయిందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్…

9 hours ago