Political News

వైసీపీ ఖాతాలో 442 కోట్లు.. బాండ్ల ఎఫెక్ట్‌

ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ్య‌వ‌హారం దేశాన్ని కుదిపేస్తున్న విష‌యం తెలిసిందే. ఎవ‌రు ఇచ్చారో.. తెలియ‌ని ఈ బాండ్ల నిధులు కోట్ల కు కోట్ల రూపంలో పార్టీల‌కు చేరిపోయాయి. సుదీర్ఘంగా 2019 నుంచి సాగిన ఈ బాండ్ల వ్య‌వ‌హారం.. తాజాగా సుప్రీం కోర్టు జోక్యంతో బ‌ట్ట‌బ‌య‌లైంది. ఈ క్ర‌మంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన తాజా సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచింది. సీల్ట్‌ కవరులో కోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ క్రమంలోనే కొత్త సమాచారాన్ని ఈసీ అందుబాటులో ఉంచింది. ఈసీ వెల్లడించిన డేటా ప్రకారం.. ఏపీ అధికార పార్టీకి ఏకంగా 442 కోట్ల రూపాయ‌లు ముట్టాయి. దీనిని ఎవ‌రు ఇచ్చారు? ఎంత మంది ఇచ్చారు? అనేది ప్ర‌స్తుతానికి గోప్యంగా ఉంచారు. మ‌రోసారి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే ఆ వివ‌రాలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, మ‌రో ప్రాంతీయ పార్టీ, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి 181 కోట్ల రూపాయ‌ల సొమ్ము ద‌క్కింది. ప‌లువురు టీడీపీకి అనుకూలంగా ఎస్‌బీఐలో బాండ్లు కొనుగోలు చేశారు.

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకీ ద‌క్క‌నంత సొమ్ము ద‌క్కింది. ఏకంగా రూ.1322 కోట్ల రూపాయ‌ల‌ను ఈ పార్టీ త‌న ఖాతాలో వేసుకుంది. ఒడిశాలో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న న‌వీన్ ప‌ట్నాయ‌క్ నేతృత్వం లోని బిజు జ‌న‌తాద‌ళ్‌ కూడా ఏమీ త‌క్కువ తిన‌లేదు. ఈ పార్టీకి కూడా 944 కోట్ల రూపాయ‌లు బాండ్ల రూపంలో అందాయి.

జాతీయ పార్టీల్లో బీజేపీ అత్యధికంగా రూ.6,986.5 కోట్లు విరాళాలను ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో పొందింది. కాంగ్రెస్ పార్టీకి 1334 కోట్లు, ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ – రూ.1,397 కోట్లు, త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే – రూ.656.5 కోట్లు ముట్టాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం సమాజ్‌వాదీ పార్టీ – రూ.14.5 కోట్లు ద‌క్కించుకుంది. పంజాబ్‌కు చెందిన అకాలీదళ్‌ – రూ.7.26కోట్లు, త‌మిళ‌నాడు విప‌క్షం ఏఐఏడీఎంకే – రూ.6.05కోట్లు, జమ్ము క‌శ్మీర్‌కు చెందిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ – రూ.50 లక్షలు బాండ్ల రూపంలో సొమ్ము చేసుకుంది.

This post was last modified on March 18, 2024 9:51 am

Share

Recent Posts

హీరోపై విరుచుకుపడిన అత్తగారు

తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…

52 minutes ago

ఈవెంట్లు ఒకటే కాదు… షూటింగులు కూడా జరగాలి

ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…

1 hour ago

వారణాసి నుండి రామాయణం వరకు… జక్కన్న విధ్వంసం!

తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

పవన్ – రాజు గారి గురించి జరగాల్సిన చర్చ వేరు!

ఏపీలో రెండు రోజుల క్రితం ఓ కీలక అదికారిక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ…

3 hours ago

అలియాస్ రుక్మిణి… నితిన్ దారిలో పడ్డాడు

ఒకప్పుడు యూత్ ఫుల్ హిట్లతో మంచి ఊపు మీద ఉన్న నితిన్ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో వేగంగా చేసిన సినిమాలు…

3 hours ago

ప్యారడైజ్ ప్రీమియర్లకు ఎంత పెంపు ఉంటుంది

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాటు ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాగా…

3 hours ago