రాజకీయాలంటేనే సెంటిమెంటుతో ముడిపడిన వ్యవహారం. పార్టీల నుంచి నాయకుల వరకు అందరూ సెంటిమెంటుతోనే ముందుకు సాగుతుంటారు. ఇదే ఇప్పుడు వైసీపీలోనూ కనిపించింది. 2019లో ఏ సెంటిమెంటును అయితే ఆయన పాటించారో.. ఇప్పుడు కూడా అదే సెంటిమెంటును సీఎం జగన్రిపీట్ చేశారు. 2019 ఎన్నికలకు ముందు తొలిసారి.. జగన్.. తన పార్టీ అభ్యర్థుల జాబితాను కడప జిల్లాలోని తన తండ్రి సమాధి వద్ద రిలీజ్ చేశారు.
అది కూడా విడతల వారీగా కాకుండా.. ఒకేసారి సీఎం జగన్ ఈ జాబితాలను విడుదల చేశారు. అసెంబ్లీకి సంబంధించిన 175 నియోజకవ ర్గాలకుఅభ్యర్థులను అప్పట్లో ఒకే సారి ప్రకటించారు. ఇక పార్లమెంటుకు సంబంధించి కూడా 25 మంది అభ్యర్థులను కూడా ఒకేసారి విడుదల చేశారు. ముందుగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రత్యేకంగాప్రార్థనలు చేసిన తర్వాత.. వైసీపీ అధినేత ఈ జాబితాలను విడుదల చేశారు.
ఇక్కడ కూడా మరో సూత్రం పాటించారు. జగన్ తన కుడి పక్కన బీసీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ను, ఎడమ పక్కన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నందిగం సురేష్ను కూర్చోబెట్టుకుని వారితోనే జాబితాలను విడుదల చేయించారు. అసెంబ్లీ జాబితాను ధర్మాన విడుదల చేయగా, ఎంపీల జాబితాను నందిగం సురేష్ చదవి వినిపించారు. ఇక ఆప్పటి ఎన్నికల్లో వైసీపీ 151 నియోజకవర్గాల్లో విజయం దక్కించుకుంది.. పార్లమెంటుకు వచ్చేసరికి 22 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది.
కట్ చేస్తే.. ఇప్పుడు 2024 ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంటును సీఎం జగన్ ఫాలో అయ్యారు. తన కుడి పక్కన బీసీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ను, ఎడమ పక్కన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నందిగం సురేష్ను కూర్చోబెట్టుకుని వారితోనే జాబితాలను విడుదల చేయించారు. అసెంబ్లీ జాబితాను ధర్మాన విడుదల చేయగా, ఎంపీల జాబితాను నందిగం సురేష్ చదవి వినిపించారు. యితే.. సీట్లలో మాత్రం బీసీలు, మైనారిటీ, ఎస్సీ, మహిళలకు సీట్లు పెంచారు. మరి ఈ సెంటిమెంటు ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
This post was last modified on March 17, 2024 2:34 pm
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…