Political News

2019 సెంటిమెంటును రిపీట్ చేసిన జ‌గ‌న్‌

రాజకీయాలంటేనే సెంటిమెంటుతో ముడిప‌డిన వ్య‌వ‌హారం. పార్టీల నుంచి నాయ‌కుల వ‌ర‌కు అంద‌రూ సెంటిమెంటుతోనే ముందుకు సాగుతుంటారు. ఇదే ఇప్పుడు వైసీపీలోనూ క‌నిపించింది. 2019లో ఏ సెంటిమెంటును అయితే ఆయ‌న పాటించారో.. ఇప్పుడు కూడా అదే సెంటిమెంటును సీఎం జ‌గ‌న్‌రిపీట్ చేశారు. 2019 ఎన్నిక‌లకు ముందు తొలిసారి.. జ‌గ‌న్‌.. త‌న పార్టీ అభ్య‌ర్థుల జాబితాను క‌డ‌ప జిల్లాలోని తన తండ్రి స‌మాధి వ‌ద్ద రిలీజ్ చేశారు.

అది కూడా విడ‌త‌ల వారీగా కాకుండా.. ఒకేసారి సీఎం జ‌గ‌న్ ఈ జాబితాల‌ను విడుద‌ల చేశారు. అసెంబ్లీకి సంబంధించిన 175 నియోజ‌క‌వ ర్గాల‌కుఅభ్య‌ర్థుల‌ను అప్పట్లో ఒకే సారి ప్ర‌క‌టించారు. ఇక పార్ల‌మెంటుకు సంబంధించి కూడా 25 మంది అభ్య‌ర్థుల‌ను కూడా ఒకేసారి విడుద‌ల చేశారు. ముందుగా త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మాధి వ‌ద్ద ప్ర‌త్యేకంగాప్రార్థ‌న‌లు చేసిన త‌ర్వాత‌.. వైసీపీ అధినేత ఈ జాబితాల‌ను విడుద‌ల చేశారు.

ఇక్క‌డ కూడా మ‌రో సూత్రం పాటించారు. జ‌గ‌న్ త‌న కుడి ప‌క్క‌న బీసీ నాయ‌కుడు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ను, ఎడ‌మ ప‌క్క‌న మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన నందిగం సురేష్‌ను కూర్చోబెట్టుకుని వారితోనే జాబితాల‌ను విడుద‌ల చేయించారు. అసెంబ్లీ జాబితాను ధ‌ర్మాన విడుద‌ల చేయ‌గా, ఎంపీల జాబితాను నందిగం సురేష్ చ‌ద‌వి వినిపించారు. ఇక ఆప్ప‌టి ఎన్నిక‌ల్లో వైసీపీ 151 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం ద‌క్కించుకుంది.. పార్ల‌మెంటుకు వ‌చ్చేస‌రికి 22 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు 2024 ఎన్నిక‌ల్లోనూ ఇదే సెంటిమెంటును సీఎం జ‌గ‌న్ ఫాలో అయ్యారు. త‌న కుడి ప‌క్క‌న బీసీ నాయ‌కుడు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ను, ఎడ‌మ ప‌క్క‌న మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన నందిగం సురేష్‌ను కూర్చోబెట్టుకుని వారితోనే జాబితాల‌ను విడుద‌ల చేయించారు. అసెంబ్లీ జాబితాను ధ‌ర్మాన విడుద‌ల చేయ‌గా, ఎంపీల జాబితాను నందిగం సురేష్ చ‌ద‌వి వినిపించారు. యితే.. సీట్ల‌లో మాత్రం బీసీలు, మైనారిటీ, ఎస్సీ, మ‌హిళ‌ల‌కు సీట్లు పెంచారు. మ‌రి ఈ సెంటిమెంటు ఏమేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

Satya

Recent Posts

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

53 minutes ago

మ్యాజిక్ చేయడానికి బుల్లితెరకు వెళ్తున్నారు

రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…

58 minutes ago

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

2 hours ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

3 hours ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

3 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

5 hours ago