Political News

ఒక్కసీటులో సస్పెన్స్

రాబోయే ఎన్నికలకు పోటీచేయబోయే అభ్యర్ధులను ప్రకటించిన పార్టీలు ఒక్క సీటును మాత్రం పెండింగులో పెట్టాయి. ఆ ఒక్కసీటు ఏమిటంటే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం. ఈ సీటును జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెండింగులో పెట్టారంటే ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధి ఎవరో తేలకపోవటం వల్లే. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో అనకాపల్లి పార్లమెంటు సీటులో బీజేపీ పోటీచేయబోతోంది. టీడీపీకి ఈ సీటులో గట్టి బలమే ఉంది. అయినా సరే నియోజకవర్గాన్ని బీజేపీకి వదిలేసింది.

బీజేపీ తరపున ఎవరు పోటీచేయాలన్న విషయం కమలంపార్టీలో తేలలేదు. సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు పేర్లు వినబడుతున్నాయి. నిజానికి ఈ ఇద్దరికీ అనకాపల్లితో ఎలాంటి సంబంధం లేదు. పైగా ఇద్దరు కూడా జనబలమున్న నేతలు కారు. అంతేకాకుండా బీజేపీకి కూడా ఎలాంటి బలంలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్ధి పోటీలో ఉన్నారన్నా, గెలుపుకు ప్రయత్నిస్తున్నారన్నా అచ్చంగా టీడీపీ, జనసేన నేతలు, క్యాడర్ బలంమీదే అన్న విషయం అర్ధమవుతోంది.

ఇలాంటి పరిస్ధితుల్లో సీఎం రమేష్ కు చంద్రబాబు, పవన్ మద్దతుంది. ఇదే సమయంలో జీవీఎల్ కు బీజేపీలోని కొందరు కీలక నేతల మద్దతుంది. కాబట్టి ఇద్దరిలో అభ్యర్ధిగా ఎవరుంటారనేది కీలకమైంది. లేకపోతే మధ్యేమార్గంలో కొత్త అభ్యర్ధి తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కూటమి తరపున పోటీలోకి దిగబోయే అభ్యర్ధి ఎవరో తేలలేదు కాబట్టి జగన్ కూడా పార్టీ అభ్యర్ధిని పెండింగులో పెట్టినట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం ఎంపీగా డాక్టర్ సత్యవతి ఉన్నారు. సత్యవతికి జనాల్లో పెద్దగా నెగిటివ్ కూడా ఏమీలేదు.

కాబట్టి సత్యవతికే జగన్ మళ్ళీ టికెటిస్తారా ? లేకపోతే కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపుతారా అన్నది ఆసక్తిగా మారింది. ఎవరు పోటీలో ఉన్నా టికెట్ మాత్రం బీసీ సామాజికవర్గానికే అన్నది అర్ధమవుతోంది. ఉత్తరాంధ్రలోని పార్లమెంటు స్ధానాల్లో వైజాగ్ తర్వాత అనకాపల్లి లోక్ సభ సీటే కీలకమైంది. కాబట్టి వైసీపీ-కూటమి తరపున అభ్యర్ధులుగా ఎవరు పోటీచేయబోతున్నారన్నది ఆసక్తిగా మారుతోంది. మరి చివరకు ఎవరు పోటీలోకి దిగుతారో చూడాలి.

This post was last modified on March 17, 2024 1:01 pm

Share
Show comments
Published by
Satya
Tags: Anakapalle

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

9 minutes ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

24 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago