Political News

ఒక్కసీటులో సస్పెన్స్

రాబోయే ఎన్నికలకు పోటీచేయబోయే అభ్యర్ధులను ప్రకటించిన పార్టీలు ఒక్క సీటును మాత్రం పెండింగులో పెట్టాయి. ఆ ఒక్కసీటు ఏమిటంటే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం. ఈ సీటును జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెండింగులో పెట్టారంటే ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధి ఎవరో తేలకపోవటం వల్లే. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో అనకాపల్లి పార్లమెంటు సీటులో బీజేపీ పోటీచేయబోతోంది. టీడీపీకి ఈ సీటులో గట్టి బలమే ఉంది. అయినా సరే నియోజకవర్గాన్ని బీజేపీకి వదిలేసింది.

బీజేపీ తరపున ఎవరు పోటీచేయాలన్న విషయం కమలంపార్టీలో తేలలేదు. సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు పేర్లు వినబడుతున్నాయి. నిజానికి ఈ ఇద్దరికీ అనకాపల్లితో ఎలాంటి సంబంధం లేదు. పైగా ఇద్దరు కూడా జనబలమున్న నేతలు కారు. అంతేకాకుండా బీజేపీకి కూడా ఎలాంటి బలంలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్ధి పోటీలో ఉన్నారన్నా, గెలుపుకు ప్రయత్నిస్తున్నారన్నా అచ్చంగా టీడీపీ, జనసేన నేతలు, క్యాడర్ బలంమీదే అన్న విషయం అర్ధమవుతోంది.

ఇలాంటి పరిస్ధితుల్లో సీఎం రమేష్ కు చంద్రబాబు, పవన్ మద్దతుంది. ఇదే సమయంలో జీవీఎల్ కు బీజేపీలోని కొందరు కీలక నేతల మద్దతుంది. కాబట్టి ఇద్దరిలో అభ్యర్ధిగా ఎవరుంటారనేది కీలకమైంది. లేకపోతే మధ్యేమార్గంలో కొత్త అభ్యర్ధి తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కూటమి తరపున పోటీలోకి దిగబోయే అభ్యర్ధి ఎవరో తేలలేదు కాబట్టి జగన్ కూడా పార్టీ అభ్యర్ధిని పెండింగులో పెట్టినట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం ఎంపీగా డాక్టర్ సత్యవతి ఉన్నారు. సత్యవతికి జనాల్లో పెద్దగా నెగిటివ్ కూడా ఏమీలేదు.

కాబట్టి సత్యవతికే జగన్ మళ్ళీ టికెటిస్తారా ? లేకపోతే కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపుతారా అన్నది ఆసక్తిగా మారింది. ఎవరు పోటీలో ఉన్నా టికెట్ మాత్రం బీసీ సామాజికవర్గానికే అన్నది అర్ధమవుతోంది. ఉత్తరాంధ్రలోని పార్లమెంటు స్ధానాల్లో వైజాగ్ తర్వాత అనకాపల్లి లోక్ సభ సీటే కీలకమైంది. కాబట్టి వైసీపీ-కూటమి తరపున అభ్యర్ధులుగా ఎవరు పోటీచేయబోతున్నారన్నది ఆసక్తిగా మారుతోంది. మరి చివరకు ఎవరు పోటీలోకి దిగుతారో చూడాలి.

This post was last modified on March 17, 2024 1:01 pm

Share
Show comments
Published by
satya
Tags: Anakapalle

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

53 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

3 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

4 hours ago