టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమోషనల్ అయ్యారు. ఐదేళ్లుగా తాను ఈ రోజు(ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రోజు) కోసమే ఎదురు చూసినట్టు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా పార్లమెంటు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మాత్రం అందరితో పాటే జూన్ 4న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చంద్రబాబు ఎక్స్ వేదికగా మెసేజ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఐదేళ్లుగా ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది… జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది… ఇక పోలింగే మిగిలింది అని ట్వీట్ చేశారు. ఒక్క చాన్స్ ప్రభుత్వానికి ఒక నో చాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చింది అని చంద్రబాబు వివరించారు.
నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదాం అని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులేనని తెలిపారు. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తుండగా, జూన్ 4న కౌంటింగ్ జరగనుందని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మహిషాసుర పాలనకు ప్రజలు చరమ గీతం పాడాలన్నారు. ఈ రోజు కోసమే ఐదేళ్లుగా ఎదురు చూశా. రానే వచ్చింది. ఇక, రెండు నెలలు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
This post was last modified on March 17, 2024 12:07 am
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…