Political News

ఈ రోజు కోసం ఐదేళ్లుగా ఎదురు చూశా: చంద్ర‌బాబు ఎమోష‌న‌ల్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎమోష‌న‌ల్ అయ్యారు. ఐదేళ్లుగా తాను ఈ రోజు(ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న రోజు) కోస‌మే ఎదురు చూసిన‌ట్టు తెలిపారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా పార్ల‌మెంటు, ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఏపీలో మే 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఫ‌లితాలు మాత్రం అందరితో పాటే జూన్ 4న విడుద‌ల కానున్నాయి. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు ఎక్స్ వేదిక‌గా మెసేజ్ చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఐదేళ్లుగా ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది… జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది… ఇక పోలింగే మిగిలింది అని ట్వీట్ చేశారు. ఒక్క చాన్స్ ప్రభుత్వానికి ఒక నో చాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చింది అని చంద్రబాబు వివరించారు.

నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదాం అని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులేనని తెలిపారు. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తుండగా, జూన్ 4న కౌంటింగ్ జరగనుందని చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మ‌హిషాసుర పాల‌న‌కు ప్ర‌జ‌లు చ‌ర‌మ గీతం పాడాల‌న్నారు. ఈ రోజు కోస‌మే ఐదేళ్లుగా ఎదురు చూశా. రానే వ‌చ్చింది. ఇక‌, రెండు నెల‌లు అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

This post was last modified on March 17, 2024 12:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

1 hour ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

2 hours ago

బ్రేకింగ్: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

2 hours ago

ఇక్కడ వైసీపీ విమర్శలు.. అక్కడ కేంద్రం ప్రశంసలు

ఏపీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…

3 hours ago

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…

3 hours ago

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

5 hours ago