టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమోషనల్ అయ్యారు. ఐదేళ్లుగా తాను ఈ రోజు(ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రోజు) కోసమే ఎదురు చూసినట్టు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా పార్లమెంటు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మాత్రం అందరితో పాటే జూన్ 4న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చంద్రబాబు ఎక్స్ వేదికగా మెసేజ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఐదేళ్లుగా ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది… జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది… ఇక పోలింగే మిగిలింది అని ట్వీట్ చేశారు. ఒక్క చాన్స్ ప్రభుత్వానికి ఒక నో చాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చింది అని చంద్రబాబు వివరించారు.
నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదాం అని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులేనని తెలిపారు. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తుండగా, జూన్ 4న కౌంటింగ్ జరగనుందని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మహిషాసుర పాలనకు ప్రజలు చరమ గీతం పాడాలన్నారు. ఈ రోజు కోసమే ఐదేళ్లుగా ఎదురు చూశా. రానే వచ్చింది. ఇక, రెండు నెలలు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…
72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు అవార్డు పుష్ప 2కి గాను అల్లు అర్జున్ కి మరోసారి రావొచ్చేమో అని…
క, కె ర్యాంప్ ఊపులో ఉన్న కిరణ్ అబ్బవరంకు మధ్యలో దిల్ రుబా ఒకటే షాక్ ఇచ్చింది కానీ దాని…
తెలుగు సినిమాలో స్క్రీన్ ప్లే అనగానే గుర్తుకొచ్చే పేరు.. సుకుమార్. ఈ లెక్కల మాస్టారి కథన నైపుణ్యం గురించి ఎంత…
72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న…
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…