Political News

కవితకు షాక్.. వారం రోజుల ఈడీ కస్టడీ!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే కవితను వారం రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 18 నుంచి 23 వరకు కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి నాగ్‌పాల్ ఆదేశాలు జారీ చేశారు. 7 రోజులపాటు కవితను ఈడీ కార్యాలయంలో ప్రశ్నించనున్నారు. మార్చి 23న మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరోసారి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం హైదరాబాదులో కవితను అరెస్టు చేసిన అధికారులు రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించారు. ఇక, ఈరోజు ఉదయం కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టులోకి వెళ్లే ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనది అక్రమ అరెస్టు అని, దీనిపై కోర్టులో న్యాయపోరాటం చేస్తానని కవిత అన్నారు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని కవిత ఆరోపించారు.

కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ ఇంకా విచారణలోనే ఉందని, కవిత అరెస్టు చట్ట విరుద్ధమని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూపులో కవిత కీలక సూత్రధారి అని ఈడీ తరఫు లాయర్లు వాదించారు. అందుకే ఆమెను మరింత విచారణ జరిపేందుకు కస్టడీకి అప్పగించాలని వాదనలు వినిపించారు.

మరోవైపు, కవితను అరెస్టు చేసే సమయంలో ఈడీ అధికారులతో మాజీ మంత్రి కేటీఆర్ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు. కవితను అరెస్టు చేసేటప్పుడు తమ విధులకు కేటీఆర్ ఆటంకం కలిగించారంటూ మహిళా అధికారి భానుప్రియ మీనా ఫిర్యాదు చేశారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు భారీ ఊరటనిచ్చింది. కేజ్రీవాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు ఇది పెద్ద ఊరట.

This post was last modified on March 16, 2024 6:07 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

60 minutes ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

1 hour ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

3 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

3 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

3 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

9 hours ago