Political News

టికెట్లు క‌న్ఫ‌ర్మ్ అయినా.. ప్ర‌చారం ఏదీ?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 94 మందితో తొలి జాబితా ఇచ్చేశారు. మ‌రో 34 మందితో మ‌లి జాబితా కూడా విడుద‌ల చేశారు. ఇక‌, మిగిలిన స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. మ‌రి ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన 94 మందితో కూడిన జాబితాకు దాదాపు 25 రోజులు అయిపోయింది. మ‌రి ఈ 94 మందిలో చంద్ర‌బాబు, నారా లోకేష్‌, బాల‌య్య‌ల‌ను ప‌క్క‌న పెడితే.. 91 మందిలో ఎంత మంది ప్ర‌చారం ప్రారంభించారు.. అంటే.. వేళ్ల మీదే లెక్కించుకోవాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఎక్క‌డా ఆ ఊపు క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. చాలా నియోజక‌వ‌ర్గాల్లో ఒక‌త్త వారికి అవ‌కాశం ఇవ్వ‌డంతో వారు స్థానిక నేత‌లను మ‌చ్చిక చేసుకునేందుకే స‌మ‌యం స‌రిపోవ‌డం లేదు. దీనికితోడు టికెట్ రాని నాయ‌కులు .. కొత్త‌వారిని దూరంగా ఉంచుతున్నారు. కనీసం ఫోన్ల‌కు కూడా స్పందించ‌డం లేద‌ని తెలిసింది. దీంతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంకా ప్ర‌చార ప‌ర్వం ప్రారంభం కాలేదు. పైగా కొత్త‌వారు త‌మ‌ను తాము నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసుకోవ‌డం కూడా క‌ష్టంగా మారింది.

ఇదిలావుంటే.. బీజేపీ, జనసేన‌తో టీడీపీ జ‌ట్టుకట్టింది. అయితే.. ఈ రెండు పార్టీల నాయ‌కులు కూడా టీడీపీతో క‌లిసిరావ‌డం లేదు. కొంద‌రు అభ్య‌ర్థులు చేస్తున్న ప్ర‌చారంలో కేవ‌లం టీడీపీ జెండాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో టీడీపీ నాయ‌కుడు బొండా ఉమా పోటీ చేస్తున్నారు. ఈయ‌న ఇంకా ప్ర‌చారం ప్రారంభించ‌లేదు. కానీ, నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా మాత్రం బ్యాన‌ర్లు క‌ట్టించుకున్నారు. కానీ, ఎక్క‌డా బీజేపీ ఫేస్ లేదు. జ‌న‌సేన ఫేస్ కూడా క‌నిపించ‌డంలేదు.

అంటే.. ఈ రెండు పార్టీల‌ను ఆయ‌న క‌లుపుకొని పోయేందుకు సిద్ధంగా లేర‌నే వాద‌న వినిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంది. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి, జ‌న‌సేనకు కూడా కేడ‌ర్ లేదు. ఇలాంటి చోట కూడా.. ఆ రెండు పార్టీల ప్ర‌స్తావ‌న లేకుండా పోయింది. అంతో ఇంతో ఈ రెండు పార్టీలు బ‌లంగా ఉన్నాయ‌ని అనుకుంటే.. ఈ రెండు పార్టీల నుంచి కూడా అభ్య‌ర్థులు పోటీ కి సై అంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌ల‌ప్ర‌చారం కేవ‌లం 10 నుంచి 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే ప్రారంభం కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 16, 2024 12:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

19 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago