టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 94 మందితో తొలి జాబితా ఇచ్చేశారు. మరో 34 మందితో మలి జాబితా కూడా విడుదల చేశారు. ఇక, మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరి ఇప్పటికే ప్రకటించిన 94 మందితో కూడిన జాబితాకు దాదాపు 25 రోజులు అయిపోయింది. మరి ఈ 94 మందిలో చంద్రబాబు, నారా లోకేష్, బాలయ్యలను పక్కన పెడితే.. 91 మందిలో ఎంత మంది ప్రచారం ప్రారంభించారు.. అంటే.. వేళ్ల మీదే లెక్కించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఎక్కడా ఆ ఊపు కనిపించడం లేదు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఒకత్త వారికి అవకాశం ఇవ్వడంతో వారు స్థానిక నేతలను మచ్చిక చేసుకునేందుకే సమయం సరిపోవడం లేదు. దీనికితోడు టికెట్ రాని నాయకులు .. కొత్తవారిని దూరంగా ఉంచుతున్నారు. కనీసం ఫోన్లకు కూడా స్పందించడం లేదని తెలిసింది. దీంతో చాలా నియోజకవర్గాల్లో ఇంకా ప్రచార పర్వం ప్రారంభం కాలేదు. పైగా కొత్తవారు తమను తాము నియోజకవర్గం ప్రజలకు పరిచయం చేసుకోవడం కూడా కష్టంగా మారింది.
ఇదిలావుంటే.. బీజేపీ, జనసేనతో టీడీపీ జట్టుకట్టింది. అయితే.. ఈ రెండు పార్టీల నాయకులు కూడా టీడీపీతో కలిసిరావడం లేదు. కొందరు అభ్యర్థులు చేస్తున్న ప్రచారంలో కేవలం టీడీపీ జెండాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు విజయవాడ సెంట్రల్లో టీడీపీ నాయకుడు బొండా ఉమా పోటీ చేస్తున్నారు. ఈయన ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. కానీ, నియోజకవర్గం వ్యాప్తంగా మాత్రం బ్యానర్లు కట్టించుకున్నారు. కానీ, ఎక్కడా బీజేపీ ఫేస్ లేదు. జనసేన ఫేస్ కూడా కనిపించడంలేదు.
అంటే.. ఈ రెండు పార్టీలను ఆయన కలుపుకొని పోయేందుకు సిద్ధంగా లేరనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి, జనసేనకు కూడా కేడర్ లేదు. ఇలాంటి చోట కూడా.. ఆ రెండు పార్టీల ప్రస్తావన లేకుండా పోయింది. అంతో ఇంతో ఈ రెండు పార్టీలు బలంగా ఉన్నాయని అనుకుంటే.. ఈ రెండు పార్టీల నుంచి కూడా అభ్యర్థులు పోటీ కి సై అంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలప్రచారం కేవలం 10 నుంచి 20 నియోజకవర్గాల్లో మాత్రమే ప్రారంభం కావడం గమనార్హం.
This post was last modified on March 16, 2024 12:41 pm
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…