Political News

టికెట్లు క‌న్ఫ‌ర్మ్ అయినా.. ప్ర‌చారం ఏదీ?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 94 మందితో తొలి జాబితా ఇచ్చేశారు. మ‌రో 34 మందితో మ‌లి జాబితా కూడా విడుద‌ల చేశారు. ఇక‌, మిగిలిన స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. మ‌రి ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన 94 మందితో కూడిన జాబితాకు దాదాపు 25 రోజులు అయిపోయింది. మ‌రి ఈ 94 మందిలో చంద్ర‌బాబు, నారా లోకేష్‌, బాల‌య్య‌ల‌ను ప‌క్క‌న పెడితే.. 91 మందిలో ఎంత మంది ప్ర‌చారం ప్రారంభించారు.. అంటే.. వేళ్ల మీదే లెక్కించుకోవాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఎక్క‌డా ఆ ఊపు క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. చాలా నియోజక‌వ‌ర్గాల్లో ఒక‌త్త వారికి అవ‌కాశం ఇవ్వ‌డంతో వారు స్థానిక నేత‌లను మ‌చ్చిక చేసుకునేందుకే స‌మ‌యం స‌రిపోవ‌డం లేదు. దీనికితోడు టికెట్ రాని నాయ‌కులు .. కొత్త‌వారిని దూరంగా ఉంచుతున్నారు. కనీసం ఫోన్ల‌కు కూడా స్పందించ‌డం లేద‌ని తెలిసింది. దీంతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంకా ప్ర‌చార ప‌ర్వం ప్రారంభం కాలేదు. పైగా కొత్త‌వారు త‌మ‌ను తాము నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసుకోవ‌డం కూడా క‌ష్టంగా మారింది.

ఇదిలావుంటే.. బీజేపీ, జనసేన‌తో టీడీపీ జ‌ట్టుకట్టింది. అయితే.. ఈ రెండు పార్టీల నాయ‌కులు కూడా టీడీపీతో క‌లిసిరావ‌డం లేదు. కొంద‌రు అభ్య‌ర్థులు చేస్తున్న ప్ర‌చారంలో కేవ‌లం టీడీపీ జెండాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో టీడీపీ నాయ‌కుడు బొండా ఉమా పోటీ చేస్తున్నారు. ఈయ‌న ఇంకా ప్ర‌చారం ప్రారంభించ‌లేదు. కానీ, నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా మాత్రం బ్యాన‌ర్లు క‌ట్టించుకున్నారు. కానీ, ఎక్క‌డా బీజేపీ ఫేస్ లేదు. జ‌న‌సేన ఫేస్ కూడా క‌నిపించ‌డంలేదు.

అంటే.. ఈ రెండు పార్టీల‌ను ఆయ‌న క‌లుపుకొని పోయేందుకు సిద్ధంగా లేర‌నే వాద‌న వినిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంది. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి, జ‌న‌సేనకు కూడా కేడ‌ర్ లేదు. ఇలాంటి చోట కూడా.. ఆ రెండు పార్టీల ప్ర‌స్తావ‌న లేకుండా పోయింది. అంతో ఇంతో ఈ రెండు పార్టీలు బ‌లంగా ఉన్నాయ‌ని అనుకుంటే.. ఈ రెండు పార్టీల నుంచి కూడా అభ్య‌ర్థులు పోటీ కి సై అంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌ల‌ప్ర‌చారం కేవ‌లం 10 నుంచి 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే ప్రారంభం కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 16, 2024 12:41 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

1 hour ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

1 hour ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

3 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

3 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

3 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

9 hours ago