యాదృచ్ఛికమా.. కావాలని చేశారా? అనేది పక్కన పెడితే.. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో అడుగు పెట్టిన సమయంలో ఇటు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించిన(ఇప్పుడు కాదు) కేసీఆర్ తనయ, బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారు లు అరెస్టు చేయడం సరికొత్త చర్చకు దారితీసింది. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణానికి సంబంధించి.. ఆమెను నిందితు రాలిగా పేర్కొన్న అధికారులు.. అనేక సందర్భాల్లో విచారించారు. మూడు సార్లు ఆమెను విచారించారు. ఆమె ఇంటికి వచ్చి మరీ విచారించారు. తర్వాత.. ఢిల్లీకి పిలిచి మరీ విచారణ చేపట్టారు.
తర్వాత మరోసారి ఇంకోసారి విచారణకు రావాలని పిలుపునిచ్చారు. అయితే.. పార్లమెంటు ఎన్నికల సమయంలో తాను ప్రచా రానికి వెళ్లాల్సి ఉందని, బీఆర్ ఎస్ నాయకురాలిగా తనకు ఆ బాధ్యత అప్పగించారని ఆమె విన్నవిస్తూ వచ్చారు. అయినప్ప టికీ.. అనూహ్యంగా ఆమెను ఈడీ అధికారులు ఉరుములు లేని పిడుగు మాదిరిగా అరెస్టు చేయడం గమనార్హం. అయితే.. ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రచారం చేయాలని నిర్ణయించారు.
మీర్జాల గూడలో రోడ్ షో కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా కవితను అరెస్టు చేయడం.. ఏం సందేశం ఇస్తోందనేది ప్రధానం. ప్రధాని మోడీతనతో పెట్టుకున్న వారిని ఇలానే అరెస్టు చేయడం గమనార్హం. కొన్ని వారాలా కిందట జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ను కూడా ఇలానే పార్లమెంటు ఎన్నికల ముందు అరెస్టు చేశారు. అప్పుడు కూడా.. తెల్లవారితే ప్రధాని ఆ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. పర్యటించారు కూడా. అప్పుడు కూడా ఈ విషయాన్ని ఆయన ప్రచార వస్తువుగా చేసుకున్నారు. ఇక, ఇప్పుడు కవిత అరెస్టును కూడా ఆయన ప్రచార వస్తువుగా చేసుకునే వ్యూహంలో భాగమే ఆ మె అరెస్టు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు.
This post was last modified on March 15, 2024 8:01 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…