వచ్చే ఎన్నికల్లో ఏపీలో మూడు పార్టీలు కలిసి కట్టుగా రంగంలోకి దిగుతున్నాయి. బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా వైసీపీని ఓడించాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో ఇంకా ప్రచారం ప్రారంభించ లేదు..కానీ, 17వ తేదీ నిర్వహించే బొప్పూడి సభ తర్వాత.. రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయనున్నా రు. అయితే.. ఈ కూటమి బలాబలాలపై ఇప్పటికేకొన్ని సర్వేలు వచ్చాయి. ఏబీపీ-సీ ఓటరు సర్వే తాజాగా ఎన్డీయే బలంగా దూసుకుపోతుందని చెప్పింది.
పార్లమెంటు ఎన్నికల్లో 20 స్థానాలను ఈ కూటమి తన ఖాతాలో వేసుకుంటుందని తేల్చి చెప్పింది. కట్ చేస్తే.. ‘న్యూస్ 18’ అనే మరో సంస్థ కూడా.. కూటమికి 18 పార్లమెంటు స్థానాలు దక్కుతాయని, ఓటు బ్యాంకులో మాత్రం మార్పు లేదని పేర్కొంది. దీంతో కూటమిలో ఆశలు చిగురించాయి. గెలుపుపై ఆశలు పెరిగాయి. ఇదిలావుంటే, వైసీపీ ఊరుకుంటుందా? బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీలు జత కట్టిన వెంటనే వైసీపీ కూడా క్షేత్రస్థాయిలో సర్వేలు చేయించిందని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
ఈ సర్వేల్లో కూటమి బలం ఎంత? వ్యక్తుల పరంగా నాయకుల బలం ఎలా ఉంది? అనే విషయాలపై సంపూర్ణంగా ఆరా తీయడం గమనార్హం. ఈ సర్వేల్లో వ్యక్తుల బలం విషయానికి వస్తే.. చంద్రబాబుపై సింపతీపాళ్లు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మెజారిటీ నియోజకవర్గాల్లో చంద్రబాబు దూరదృష్టి గురించి చర్చ సాగుతోంది. అంతేకాదు.. ఆయన వస్తే.. రాష్ట్రంలో అబివృద్ధి జరుగుతుందనే విషయంపై ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారట.
ఇక, పవన్ వస్తే.. అవినీతిని ప్రశ్నించడంతోపాటు.. ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేయడంతోపాటు.. కొన్నికొన్ని విషయాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన దోహదపడతారనే చర్చ సాగుతున్నట్టు వైసీపీ గుర్తించింది. అయితే.. ఇదే సర్వేలో మోడీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు తెలిసిందని వైసీపీ నాయకులు అంటున్నారు. పురందేశ్వరి ఇమేజ్ జీరోగా కనిపించిందని చెబుతున్నారు.
ఇక, కూటమి పరంగా మాత్రం ప్రజల్లో సానుకూలత ఉందని తెలుస్తోందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా చూసుకున్నా.. వ్యక్తుల బలంతోనే కూటమిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాదనేది వైసీపీ గ్రహించిందనేది సారాంశం. దీనికి తగిన విధంగా వైసీపీ ప్లాన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి ఎలా ముందుకు సాగుతారో చూడాలి.
This post was last modified on March 15, 2024 10:27 am
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…