వచ్చే ఎన్నికల్లో ఏపీలో మూడు పార్టీలు కలిసి కట్టుగా రంగంలోకి దిగుతున్నాయి. బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా వైసీపీని ఓడించాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో ఇంకా ప్రచారం ప్రారంభించ లేదు..కానీ, 17వ తేదీ నిర్వహించే బొప్పూడి సభ తర్వాత.. రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయనున్నా రు. అయితే.. ఈ కూటమి బలాబలాలపై ఇప్పటికేకొన్ని సర్వేలు వచ్చాయి. ఏబీపీ-సీ ఓటరు సర్వే తాజాగా ఎన్డీయే బలంగా దూసుకుపోతుందని చెప్పింది.
పార్లమెంటు ఎన్నికల్లో 20 స్థానాలను ఈ కూటమి తన ఖాతాలో వేసుకుంటుందని తేల్చి చెప్పింది. కట్ చేస్తే.. ‘న్యూస్ 18’ అనే మరో సంస్థ కూడా.. కూటమికి 18 పార్లమెంటు స్థానాలు దక్కుతాయని, ఓటు బ్యాంకులో మాత్రం మార్పు లేదని పేర్కొంది. దీంతో కూటమిలో ఆశలు చిగురించాయి. గెలుపుపై ఆశలు పెరిగాయి. ఇదిలావుంటే, వైసీపీ ఊరుకుంటుందా? బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీలు జత కట్టిన వెంటనే వైసీపీ కూడా క్షేత్రస్థాయిలో సర్వేలు చేయించిందని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
ఈ సర్వేల్లో కూటమి బలం ఎంత? వ్యక్తుల పరంగా నాయకుల బలం ఎలా ఉంది? అనే విషయాలపై సంపూర్ణంగా ఆరా తీయడం గమనార్హం. ఈ సర్వేల్లో వ్యక్తుల బలం విషయానికి వస్తే.. చంద్రబాబుపై సింపతీపాళ్లు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మెజారిటీ నియోజకవర్గాల్లో చంద్రబాబు దూరదృష్టి గురించి చర్చ సాగుతోంది. అంతేకాదు.. ఆయన వస్తే.. రాష్ట్రంలో అబివృద్ధి జరుగుతుందనే విషయంపై ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారట.
ఇక, పవన్ వస్తే.. అవినీతిని ప్రశ్నించడంతోపాటు.. ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేయడంతోపాటు.. కొన్నికొన్ని విషయాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన దోహదపడతారనే చర్చ సాగుతున్నట్టు వైసీపీ గుర్తించింది. అయితే.. ఇదే సర్వేలో మోడీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు తెలిసిందని వైసీపీ నాయకులు అంటున్నారు. పురందేశ్వరి ఇమేజ్ జీరోగా కనిపించిందని చెబుతున్నారు.
ఇక, కూటమి పరంగా మాత్రం ప్రజల్లో సానుకూలత ఉందని తెలుస్తోందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా చూసుకున్నా.. వ్యక్తుల బలంతోనే కూటమిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాదనేది వైసీపీ గ్రహించిందనేది సారాంశం. దీనికి తగిన విధంగా వైసీపీ ప్లాన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి ఎలా ముందుకు సాగుతారో చూడాలి.
This post was last modified on March 15, 2024 10:27 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…