Political News

కోడ‌ళ్ల‌కు పెద్ద‌పీట‌.. బాబు మార్క్ జాబితా!

తాజాగా టీడీపీ ప్ర‌క‌టించిన రెండో జాబితాలో వార‌సుల‌కు, కోడ‌ళ్ల‌కు, కుటుంబాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి వ‌చ్చే ఎన్నిక‌లు కీలకంగా మార‌డం.. బ‌ల‌మైన వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌న్న వ్యూహంతోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోడ‌ళ్ల‌కు పెద్ద‌పీట వేసి.. కుటుంబాల నేత‌ల‌కు వీర‌తాళ్లు వేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు హిందూపురం పార్ల‌మెంటు ప‌రిధిలోని రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి పుట్ట‌ప‌ర్తి. ఇక్క‌డ నుంచి మాజీ మంత్రి పల్లె ర‌ఘునాథ‌రెడ్డి కోడ‌లు.. ప‌ల్లె సింధూరకు టికెట్ ఇచ్చారు. ఇక‌, ఇదే హిందూపురం పార్ల‌మెంటు ప‌రిధిలోన మ‌రో నియోజ‌క‌వ‌ర్గం క‌దిరి. ఇక్క‌డ నుంచి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంక‌ట ప్ర‌సాద్ స‌తీమ‌ణి య‌శోదాదేవికి అవ‌కాశం క‌ల్పించారు.

ప‌ల్లె వ‌యోవృద్ధుడు కావ‌డంతో ఆయ‌న‌ను త‌ప్పించాల‌ని గ‌త ఎన్నిక‌ల్లోనే భావించారు. అయితే.. చివరి ఛాన్స్ అంటూ ఆయ‌న కోరుకోవడం తో అప్ప‌ట్లో టికెట్ ఇచ్చారు. ఇక‌, ఆయ‌న ఓట‌మి త‌ర్వాత‌.. జేసీవ‌ర్గం ఇక్క‌డ పుంజుకుంది. ఈ నేప‌థ్యంలో ప‌ల్లెకు ఇవ్వొద్ద‌ని పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో బ‌య‌టి వారికి ఇవ్వ‌డం ఇష్టం లేక .. ప‌ల్లె కోడ‌లు సింధూర‌కే టికెట్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, కందికుంట క‌దిరి నుంచి పోటీ చేయాల‌ని భావించారు. అయితే, ఆయ‌న‌పై ప‌లు కేసులు ఉన్నాయి. నామినేష‌న్ల స‌మయంలో ఇవి అడ్డం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావించిన చంద్ర‌బాబు ఆయ‌న సతీమ‌ణి య‌శోద‌కు టికెట్ కేటాయించారు. ఇరువురు మ‌హిళ‌లు కావ‌డం.. పైగా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తొలిసారి పోటీ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే. ఇద్ద‌రూ ఓసీలే కావ‌డం గ‌మ‌నార్హం.

తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలోని రెండు స్థానాల్లో చంద్ర‌బాబు త‌న మార్కు ప్ర‌ద‌ర్శించారు. శ్రీకాళ‌హ‌స్తి సీటును పార్టీ వెట‌ర‌న్ దివంగ‌త బొజ్జ‌ల గోపాల కృష్నారెడ్డి త‌న‌యుడు సుధీర్‌కే ఇచ్చి.. మిత్రుడి ఆత్మ‌కు శాంతి చేకూర్చారు. ఆది నుంచిఈ టికెట్‌పై భారీ టెన్ష‌న్ నెల‌కొంది. అయినా కూడా చంద్ర‌బాబు సుధీర్‌కు చాన్స్ ఇచ్చారు. దీనిని పొత్తులో భాగంగా బీజేపీ కోరుకోవ‌డం గ‌మ‌నార్హం. అయినా.. చివ‌రి నిముషంలో సుధీర్‌కు కేటాయించారు.

ఇక‌, మ‌రో నియోజ‌క‌వ‌ర్గం స‌త్య‌వేడు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ వైసీపీ నుంచి ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన కోనేటి ఆదిమూలంకు చంద్ర‌బాబు వీర తాడు వేశారు. ఆయ‌న‌కు వైసీపీ చిత్తూరు ఎంపీ స్థానం ఇవ్వ‌డంతో అలిగి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఈక్ర‌మంలో టీడీపీలో చేరారు. ఆ వెంట‌నే ఆయ‌న‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయింది. తాజా జాబితాలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

This post was last modified on March 17, 2024 10:29 am

Share
Show comments

Recent Posts

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

3 hours ago

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

5 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

7 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

8 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

9 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

11 hours ago