జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో, అప్పుడే జనసేన శ్రేణులు పిఠాపురంలో మోహరించేందుకు సిద్ధమవుతున్నారు.
అసలు విషయమేంటంటే, జనసేన శ్రేణులకే ఆఖర్న తెలిసింది పవన్ కళ్యాణ్, పిఠాపురం నుంచి పోటీ చేస్తారని. అందరికన్నా ముందు ఈ విషయాన్ని తెలుసుకున్నది అధికార వైసీపీనే. అందుకే, కాకినాడ ఎంపీగా వున్న వంగా గీతను, పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీకి దించుతున్నట్లు ముందుగానే ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
కొద్ది నెలల క్రితం వారాహి విజయ యాత్ర సందర్భంగానే జనసేన పార్టీ, పిఠాపురం నియోజకవర్గంలో సర్వే చేయించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గాల్లో ఈ సర్వేలు జరిగాయి. భీమవరం, పిఠాపురం.. రెండు చోట్లా జనసేనానికి సానుకూలత వ్యక్తమయ్యిందట ఆ సర్వేల్లో.
అయితే, భీమవరం కంటే, బెటర్ మెజార్టీ పిఠాపురంలో దక్కుతుందని సర్వేలు తేల్చడంతో, పిఠాపురం వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపారు. ఈ విషయం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకి కూడా ముందే తెలుసు. దాంతో, ‘పొత్తు కుదిరితే, పవన్ కళ్యాణ్ని తానే గెలిపిస్తాను’ అంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించారు.
కానీ, ఇప్పుడాయన అభిమానులు పిఠాపురంలో నానా యాగీ చేశారు. అయితే, రాజకీయంగా తన ఉనికి ఏంటన్న ఆందోళతోనే వర్మ, తన అభిమానులతో ఈ యాగీ చేయించినట్లు తెలుస్తోంది. ‘పవన్ కళ్యాణ్కి ఈ గొడవతో సంబంధం లేదు.. ఆయన్ని అవమానించడం తగదు’ అని తన అభిమానులకు వర్మ తెలివిగా హెచ్చరిక చేసేశారు.
వర్మ, టీడీపీని వీడే అవకాశం లేదు. ఒకవేళ వర్మ తెరవెనుకాల పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పని చేసినా, పిఠాపురంలో పోటీ చేసే జనసేనానికి మెజార్టీ తగ్గబోదట. అసలంటూ వర్మ, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పని చేయబోరని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి.
This post was last modified on March 15, 2024 7:26 am
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…
ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…