Political News

టీడీపీ రెండో జాబితాలో స్పెష‌ల్ ఆశిస్తున్నారా?

టీడీపీ అంటేనే కొంత స్పెష‌ల్. అభ్య‌ర్థుల ఎంపిక నుంచి టికెట్ల వ‌ర‌కు ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు చంద్రబాబు పెద్ద పీట వేశాన‌ని చెప్పుకొంటున్నారు. అలానే చేస్తున్నారు కూడా. ఇప్పుడు తాజాగా వెలువ‌రించిన రెండో జాబితాలోనూ .. చంద్ర‌బాబు ఇలానే వ్య‌వ‌హ‌రించారు. 34 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఈ జాబితాలో కొన్ని కొన్ని ప్ర‌త్యేక‌త‌లు స్ప‌ష్టంగా క‌నిపించాయి. ఇవి ఆ పార్టీకే కాదు.. మార్పును కోరుకునే వారికి కూడా కొంత ఆశాజ‌న‌కంగానే ఉన్నాయ‌ని అంటున్నారు త‌మ్ముళ్లు.

ఇవీ ప్ర‌త్యేక‌త‌లు..

  • మొత్తం 11 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
  • 9 మంది గ్రాడ్యుయేషన్ చేసినవారు.
  • ఒకరు పీహెచ్‌డీ చేసిన అభ్యర్థి(గుంటూరు జిల్లా పెద‌కూర‌పాడు, భాష్య ప్ర‌వీణ్‌)
  • 8 మంది ఇంటర్మీడియెట్ అర్హులు. త‌ప్పిన వారు కూడా ఉన్నారు.
  • ఐదుగురు 10వ తరగతి విద్యార్హతగా కలిగినవారు. వీరిలోనూ త‌ప్పిన‌వారు ఉన్నారు.
  • మొత్తం 34 మంది అభ్యర్థుల్లో 27 మంది పరుషులు
  • ఏడుగురు మ‌హిళా నేత‌లు. దాదాపు అంద‌రూ వార‌సులే.
  • 25-35 ఏళ్ల మధ్య వయసువారు ఇద్దరు
  • 36-45 ఏళ్లలోపువారు 8 మంది
  • 46-60 ఏళ్ల వయసున్నవారు 19 మంది
  • 61-75 ఏళ్లవారు ముగ్గురు
  • 75 ఏళ్లకు పైబడినవారు ఇద్దరు

ఇక్క‌డ వారు వీరేనా?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 14 స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఇప్పటికే టీడీపీ రెండు విడతల జాబితాలు ప్రకటించింది. అయితే పోలవరం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ తరపున బొరగం శ్రీనివాసులు టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు కూడా పోటీలో ఉన్నారు. ఈయ‌న‌కు గెలుపు అవ‌కాశం త‌క్కువ‌గా ఉంద‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ అభ్య‌ర్థిని(భీమ‌వ‌రంలో మాదిరిగా) జ‌న‌సేన‌లోకి తీసుకుని టికెట్ ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంది.

This post was last modified on March 15, 2024 7:23 am

Share

Recent Posts

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

35 minutes ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

52 minutes ago

శర్వానంద్ రిలీజులకు కొత్త చిక్కుముడి

శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…

1 hour ago

ఊర్మిళను పెళ్లాడిన వర్మ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…

1 hour ago

భోగాపురం క్రెడిట్ కోసం వైసీపీ తంటాలు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏపీ ప్ర‌జ‌లు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఊద‌ర గొడుతోంది. అంతేకాదు.. గ‌త…

2 hours ago

స్పైడర్ మ్యాన్ సక్సెస్… ఏ పాఠం నేర్చుకోవాలి

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…

3 hours ago