Political News

టీడీపీ రెండో జాబితాలో స్పెష‌ల్ ఆశిస్తున్నారా?

టీడీపీ అంటేనే కొంత స్పెష‌ల్. అభ్య‌ర్థుల ఎంపిక నుంచి టికెట్ల వ‌ర‌కు ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు చంద్రబాబు పెద్ద పీట వేశాన‌ని చెప్పుకొంటున్నారు. అలానే చేస్తున్నారు కూడా. ఇప్పుడు తాజాగా వెలువ‌రించిన రెండో జాబితాలోనూ .. చంద్ర‌బాబు ఇలానే వ్య‌వ‌హ‌రించారు. 34 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఈ జాబితాలో కొన్ని కొన్ని ప్ర‌త్యేక‌త‌లు స్ప‌ష్టంగా క‌నిపించాయి. ఇవి ఆ పార్టీకే కాదు.. మార్పును కోరుకునే వారికి కూడా కొంత ఆశాజ‌న‌కంగానే ఉన్నాయ‌ని అంటున్నారు త‌మ్ముళ్లు.

ఇవీ ప్ర‌త్యేక‌త‌లు..

  • మొత్తం 11 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
  • 9 మంది గ్రాడ్యుయేషన్ చేసినవారు.
  • ఒకరు పీహెచ్‌డీ చేసిన అభ్యర్థి(గుంటూరు జిల్లా పెద‌కూర‌పాడు, భాష్య ప్ర‌వీణ్‌)
  • 8 మంది ఇంటర్మీడియెట్ అర్హులు. త‌ప్పిన వారు కూడా ఉన్నారు.
  • ఐదుగురు 10వ తరగతి విద్యార్హతగా కలిగినవారు. వీరిలోనూ త‌ప్పిన‌వారు ఉన్నారు.
  • మొత్తం 34 మంది అభ్యర్థుల్లో 27 మంది పరుషులు
  • ఏడుగురు మ‌హిళా నేత‌లు. దాదాపు అంద‌రూ వార‌సులే.
  • 25-35 ఏళ్ల మధ్య వయసువారు ఇద్దరు
  • 36-45 ఏళ్లలోపువారు 8 మంది
  • 46-60 ఏళ్ల వయసున్నవారు 19 మంది
  • 61-75 ఏళ్లవారు ముగ్గురు
  • 75 ఏళ్లకు పైబడినవారు ఇద్దరు

ఇక్క‌డ వారు వీరేనా?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 14 స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఇప్పటికే టీడీపీ రెండు విడతల జాబితాలు ప్రకటించింది. అయితే పోలవరం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ తరపున బొరగం శ్రీనివాసులు టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు కూడా పోటీలో ఉన్నారు. ఈయ‌న‌కు గెలుపు అవ‌కాశం త‌క్కువ‌గా ఉంద‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ అభ్య‌ర్థిని(భీమ‌వ‌రంలో మాదిరిగా) జ‌న‌సేన‌లోకి తీసుకుని టికెట్ ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంది.

This post was last modified on March 15, 2024 7:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

43 minutes ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

4 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

5 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

6 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

6 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

6 hours ago