Political News

కొంద‌రు వ‌స్తున్నారు.. మ‌రికొంద‌రిని తెస్తున్నారు..!

పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సమ‌యం చేరువ అవుతున్న నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త పోక‌డ‌లు క‌నిపిస్తున్నాయి. కొందరు నేత‌లు తమంత‌ట తామే పార్టీలు మారేందుకు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. అయితే.. మ‌రికొంద‌రు మాత్రం వేచి చూస్తున్నారు. ఇలా వేచి చూస్తున్న వారిని పార్టీలే చొర‌వ తీసుకుని మ‌రీ వెళ్లి క‌లిసి.. పార్టీలో చేర్చుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అంటే.. ఒక ర‌కంగా.. ఇప్పుడు కొంద‌రు తమంత‌ట తామే వ‌స్తుండ‌గా.. మ‌రికొంద‌రిని నాయ‌కులే వెళ్లి తీసుకువ‌స్తున్నారు.

తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి స్వ‌యంగా వెళ్లి.. బీజేపీ నేతను పార్టీలో చేరాల‌ని ఆహ్వానించ‌డం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం ఆశించి జితేందర్ రెడ్డి భంగపడ్డారు. ఈ టిక్కెట్‌ను మాజీ మంత్రి డీకే అరుణకు కేటాయించారు. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ విష‌యాన్ని గ్ర‌హించిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఇలాంటి వారి విష‌యంలో జాప్యం చేయ‌డం మంచిది కాద‌ని అనుకుందో ఏమో.. వెంట‌నే ఇలాంటి వారి ఇళ్ల‌కు వెళ్లి మ‌రీ.. ఆహ్వానాలు అందిస్తోంది. వ‌చ్చేయండి మేం చూసుకుంటాం.. అంటూ భ‌రోసా ఇచ్చేస్తోంది. ఇలానే జితేంద‌ర్‌రెడ్డి ఇంటికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి స్వయంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

దీంతో లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి జితేంద‌ర్ కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయిన‌ట్టే న‌ని భావిస్తున్నారు. బీజేపీ రెండో జాబితాను బుధ‌వారం సాయంత్రం విడుదల చేసింది. ఇందులో మహబూబ్ నగర్ ను డీకే అరుణకు కేటాయించింది. జితేందర్ రెడ్డి కూడా ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు. ఇక‌, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వ్య‌వ‌హారంపైనా కాంగ్రెస్ దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న‌కు గెలిచే అవ‌కాశం ఉంద‌ని హ‌స్తం నేత‌లు భావిస్తున్నారు. ఈనేప‌థ్యంలో ఆయ‌నను కూడా చేర్చుకుంటే ఒక సీటు రిజ‌ర్వ్ అయిన‌ట్టేన‌ని అంటున్నారు.

This post was last modified on March 14, 2024 5:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

45 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago