ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక విషయంపై ఆచి తూచి అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. రెండు జాబితాలు విడుదల చేశారు. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మందికి అవకాశం ఇచ్చారు. అయితే.. కీలకమైన కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఆయన ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇలాంటి వాటిలో పెనమలూరు నియోజకవర్గం కూడా ఉంది. తాజాగా ఈ నియోజకవర్గం ఇంచార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు చంద్రబాబు ఫోన్ చేశారు.
రెండో జాబితా విడుదల చేసిన తర్వాత.. చంద్రబాబు నేరుగా బోడేతో మాట్లాడారు. ఈ సారికి సర్దుకోవాలని.. అనివార్య కారణాల నేపథ్యంలో టికెట్ ఇవ్వడం లేదని ఆయన చెప్పేశారు. దీనిపై బోడే ప్రసాద్ భగ్గు మ న్నారు. చంద్రబాబుతోనే పార్టీకి రాజీనామా చేస్తానని తెగేసి చెప్పారు. అంతేకాదు.. నచ్చిన వారికి ఇచ్చుకోచ్చని.. కానీ, ఇన్నాళ్లుగా తాను పెట్టిన ఖర్చును కూడా తిరిగి ఇవ్వాలని ఆయన కోరనట్టు తెలుస్తోంది. మొత్తానికి ఫోన్లోనే చంద్రబాబు వర్సెస్ బోడే ప్రసాద్ మధ్య మాటల యుద్ధం సాగినట్టు తెలుస్తోంది.
కట్ చేస్తే.. పెనమలూరులో టీడీపీ జెండా మాయమయ్యాయి. క్షణాల వ్యవధిలో ప్రధాన రహదారిపై ఉన్న ఫ్లెక్సీలను కూడా తొలగించారు. పార్టీ కార్యాలయానికి కొందరు తాళాలు వేశారు. బయట ఏర్పాటు చేసిన లైటింగ్ను ధ్వంసం చేశారు. ప్రచార వాహనాన్ని గుర్తు తెలియని వారు ఎత్తుకు పోయారు. మొత్తంగా పెనమలూరు టీడీపీలో ఇప్పుడు ఆగ్రహం కట్టలు తెగుతోంది.
మరోవైపు… బోడే ప్రసాద్ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ఆయన వెంట వేలాది మంది అనుచరులు కూడా పార్టీకి గగుడ్బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రం కానూరులో కీలకసమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యక్రమాలపై నిర్ణయం తీసుకునేందుకు బోడే వర్గం రెడీ అయింది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…