ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక విషయంపై ఆచి తూచి అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. రెండు జాబితాలు విడుదల చేశారు. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మందికి అవకాశం ఇచ్చారు. అయితే.. కీలకమైన కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఆయన ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇలాంటి వాటిలో పెనమలూరు నియోజకవర్గం కూడా ఉంది. తాజాగా ఈ నియోజకవర్గం ఇంచార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు చంద్రబాబు ఫోన్ చేశారు.
రెండో జాబితా విడుదల చేసిన తర్వాత.. చంద్రబాబు నేరుగా బోడేతో మాట్లాడారు. ఈ సారికి సర్దుకోవాలని.. అనివార్య కారణాల నేపథ్యంలో టికెట్ ఇవ్వడం లేదని ఆయన చెప్పేశారు. దీనిపై బోడే ప్రసాద్ భగ్గు మ న్నారు. చంద్రబాబుతోనే పార్టీకి రాజీనామా చేస్తానని తెగేసి చెప్పారు. అంతేకాదు.. నచ్చిన వారికి ఇచ్చుకోచ్చని.. కానీ, ఇన్నాళ్లుగా తాను పెట్టిన ఖర్చును కూడా తిరిగి ఇవ్వాలని ఆయన కోరనట్టు తెలుస్తోంది. మొత్తానికి ఫోన్లోనే చంద్రబాబు వర్సెస్ బోడే ప్రసాద్ మధ్య మాటల యుద్ధం సాగినట్టు తెలుస్తోంది.
కట్ చేస్తే.. పెనమలూరులో టీడీపీ జెండా మాయమయ్యాయి. క్షణాల వ్యవధిలో ప్రధాన రహదారిపై ఉన్న ఫ్లెక్సీలను కూడా తొలగించారు. పార్టీ కార్యాలయానికి కొందరు తాళాలు వేశారు. బయట ఏర్పాటు చేసిన లైటింగ్ను ధ్వంసం చేశారు. ప్రచార వాహనాన్ని గుర్తు తెలియని వారు ఎత్తుకు పోయారు. మొత్తంగా పెనమలూరు టీడీపీలో ఇప్పుడు ఆగ్రహం కట్టలు తెగుతోంది.
మరోవైపు… బోడే ప్రసాద్ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ఆయన వెంట వేలాది మంది అనుచరులు కూడా పార్టీకి గగుడ్బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రం కానూరులో కీలకసమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యక్రమాలపై నిర్ణయం తీసుకునేందుకు బోడే వర్గం రెడీ అయింది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
This post was last modified on March 14, 2024 4:38 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…