ముచ్చటగా మూడో అభ్యర్థి పేరు పరిశీలనలో ఉందట. విషయం ఏమిటంటే గుంటూరు పార్లమెంట్ సీటును గెలుచుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి టార్గెట్. గడచిన రెండు ఎన్నికల్లో ఎంత ప్రయత్నించినా సీటులో గెలుపు తృటిలో తప్పిపోయింది. రెండుసార్లు కూడా టీడీపీ నేత గల్లా జయదేవే గెలిచారు. రాబోయే ఎన్నికల్లో జయదేవ్ పోటీచేయటం లేదు. అందుకనే టీడీపీ కొత్త అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఇదే సమయంలో ఈ సీటులో గెలిచేందుకు జగన్ ఇప్పటికి ఇద్దరు సమన్వయకర్తలను మార్చారు.
మొదట ఇక్కడి నుండి పోటీ చేయమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులును జగన్ కోరారు. అందుకు లావు అంగీకరించకపోగా ఏకంగా పార్టీకి రాజీనామా చేసి టీడీపీ అభ్యర్ధిగా తిరిగి నరసరావుపేటలోనే పోటీచేస్తున్నారు. దాంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకు ఉమ్మారెడ్డి వెంకటరమణను సమన్వయకర్తగా నియమించారు. నాలుగు రోజులు అవగానే రమణను తీసేసి పొన్నూరు ఎంఎల్ఏ, ఉమ్మారెడ్డి అల్లుడు వెంకట కిలారు రోశయ్యను సమన్వయకర్తగా నియమించారు. జగన్ నియమించారు కానీ రోశయ్య యాక్టివ్ గా లేరు. పోటీచేసే విషయంలో అనాశక్తిగా ఉన్నారట.
అందుకనే రోశయ్య స్ధానంలో ముస్లిం మహిళ, సమాజసేవలో పాపులర్, విద్యావంతురాలైన జహారాబేగంను తొందరలోనే రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. జహారాబేగం అభ్యర్ధిత్వంపై జగన్ బాగా ఇంట్రెస్టు చూపుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈమె పోయిన ఎన్నికల్లో విజయవాడలో ఎంపీగా పోటీ చేయాల్సింది. అయితే ఎందుకనో అప్పట్లో టికెట్ చేజారిపోయింది. అదే అంశం ఇపుడు మళ్ళీ ప్రస్తావనకు వచ్చిందట. విషయం ఏమిటంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో ముస్లిం సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎంఎల్ఏ అభ్యర్ధిగా ముస్తాఫా కూతురును నియమించారు.
దీనికి అదనంగా ఎంపీ అభ్యర్ధిగా కూడా ముస్లిం మహిళను దింపితే గెలుపు అవకాశాలు ఎలాగుంటుందనే విషయంపై జగన్ సర్వే చేయించుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. పరిస్ధితులన్నీ అనుకూలంగా ఉంటే జహారాబేగం ఎంపీగా వైసీపీ తరపున పోటీచేయటం ఖాయమని పార్టీలో ప్రచారం పెరిగిపోతోంది. పోటీ వరకు ఓకేనే కాని గెలుపు అవకాశాలపైనే సరైన క్లారిటి రావటంలేదట. మరి చివరకు ఏమవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.
This post was last modified on March 14, 2024 12:44 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…