Political News

తెరపైకి మూడో సమన్వయకర్త ?

ముచ్చటగా మూడో అభ్యర్థి పేరు పరిశీలనలో ఉందట. విషయం ఏమిటంటే గుంటూరు పార్లమెంట్ సీటును గెలుచుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి టార్గెట్. గడచిన రెండు ఎన్నికల్లో ఎంత ప్రయత్నించినా సీటులో గెలుపు తృటిలో తప్పిపోయింది. రెండుసార్లు కూడా టీడీపీ నేత గల్లా జయదేవే గెలిచారు. రాబోయే ఎన్నికల్లో జయదేవ్ పోటీచేయటం లేదు. అందుకనే టీడీపీ కొత్త అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఇదే సమయంలో ఈ సీటులో గెలిచేందుకు జగన్ ఇప్పటికి ఇద్దరు సమన్వయకర్తలను మార్చారు.

మొదట ఇక్కడి నుండి పోటీ చేయమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులును జగన్ కోరారు. అందుకు లావు అంగీకరించకపోగా ఏకంగా పార్టీకి రాజీనామా చేసి టీడీపీ అభ్యర్ధిగా తిరిగి నరసరావుపేటలోనే పోటీచేస్తున్నారు. దాంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకు ఉమ్మారెడ్డి వెంకటరమణను సమన్వయకర్తగా నియమించారు. నాలుగు రోజులు అవగానే రమణను తీసేసి పొన్నూరు ఎంఎల్ఏ, ఉమ్మారెడ్డి అల్లుడు వెంకట కిలారు రోశయ్యను సమన్వయకర్తగా నియమించారు. జగన్ నియమించారు కానీ రోశయ్య యాక్టివ్ గా లేరు. పోటీచేసే విషయంలో అనాశక్తిగా ఉన్నారట.

అందుకనే రోశయ్య స్ధానంలో ముస్లిం మహిళ, సమాజసేవలో పాపులర్, విద్యావంతురాలైన జహారాబేగంను తొందరలోనే రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. జహారాబేగం అభ్యర్ధిత్వంపై జగన్ బాగా ఇంట్రెస్టు చూపుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈమె పోయిన ఎన్నికల్లో విజయవాడలో ఎంపీగా పోటీ చేయాల్సింది. అయితే ఎందుకనో అప్పట్లో టికెట్ చేజారిపోయింది. అదే అంశం ఇపుడు మళ్ళీ ప్రస్తావనకు వచ్చిందట. విషయం ఏమిటంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో ముస్లిం సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎంఎల్ఏ అభ్యర్ధిగా ముస్తాఫా కూతురును నియమించారు.

దీనికి అదనంగా ఎంపీ అభ్యర్ధిగా కూడా ముస్లిం మహిళను దింపితే గెలుపు అవకాశాలు ఎలాగుంటుందనే విషయంపై జగన్ సర్వే చేయించుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. పరిస్ధితులన్నీ అనుకూలంగా ఉంటే జహారాబేగం ఎంపీగా వైసీపీ తరపున పోటీచేయటం ఖాయమని పార్టీలో ప్రచారం పెరిగిపోతోంది. పోటీ వరకు ఓకేనే కాని గెలుపు అవకాశాలపైనే సరైన క్లారిటి రావటంలేదట. మరి చివరకు ఏమవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.

This post was last modified on March 14, 2024 12:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

35 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago