ఇపుడిదే అంశంపై జనసేనలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ చర్చకు ప్రధాన కారణం ఎవరంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో భీమవరంలో పోటీచేయబోయేది పవనే అని పార్టీ నేతలు లీకులిచ్చారు. సర్వేలు చేయించుకుంటున్నారంటు ఊదరగొట్టారు. తీరాచూస్తే సీన్ అంతా మారిపోయింది. దీనికి కారణం ఏమిటంటే జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎంఎల్ఏ పులపర్తి రామాంజనేయులనే చెప్పాలి. పవన్ స్వయంగా మాజీ ఎంఎల్ఏ ఇంటికి వెళ్ళి రాబోయే ఎన్నికల్లో భీమవరం ఎంఎల్ఏగా పోటీచేయాలని అడిగినట్లు ప్రచారం జరిగింది.
దాంతో భీమవరంలో పవన్ పోటీచేయటంలేదని అర్ధమైంది. అయితే జనసేనలో పులపర్తి చేరిన సందర్భంలో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో ఇక్కడినుండి పోటీచేయబోయేది పవనే అని ప్రకటించారు. దాంతో జనసేన నేతలతోపాటు క్యాడర్లో అయోమయం పెరిగిపోతోంది. పవనేమో ఆంజనేయులను పోటీచేయమంటారు. రామాంజనేయులేమో పవనే పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. దాంతో అసలు భీమవరంలో ఇద్దరిలో పోటీచేయబోయేది ఎవరనేది అర్ధంకావటంలేదు. అయినా మిత్రపక్షం టీడీపీ నేతను తన పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇచ్చి పోటీచేయించాలనే ఆలోచన చేసిన నేత బహుశా పవన్ ఒక్కరేనేమో.
రామాంజనేయులునే పోటీచేయించాలని పవన్కు ఉన్నపుడు టీడీపీలో నుండి జనసేనలోకి చేర్చుకోవటం ఎందుకో అర్ధంకావటంలేదు. భీమవరం సీటును టీడీపీకి వదిలేస్తే అసలు ఏ గొడవా ఉండేదికాదు కదా. విషయం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో పవన్ తో పాటు రామాంజనేయులు కూడా పోటీచేసి వైసీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. అప్పటినుండి ఇప్పటివరకు రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. ఒకవిధంగా రామాంజనేయులను టీడీపీనే మరచిపోయిందనే చెప్పాలి.
అలాంటి రామాంజనేయులు ఇంటికి స్వయంగా పవన్ వెళ్ళటం, జనసేనలో చేరమని కోరటం, భీమవరంలో పోటీచేయమని అడగటం చాలా విచిత్రంగా ఉంది. రామాంజనేయులు కెపాసిటిని పవన్ ఏ విధంగా అంచనా వేశారో ఎవరికీ అర్ధంకావటంలేదు. జనసేన పోటీచేయబోయే సీటులో టీడీపీ నేతను టికెట్ ఇవ్వటానికి పవన్ సిద్ధపడటమే ఆశ్చర్యంగా ఉంది. పవన్ ఉద్దేశ్యంలో భీమవరంలో గ్రంధిని ఓడించేంత సీనున్న నేత జనసేనలో లేరనేకదా ? మరి పవన్ వ్యూహం ఏ మేరకు వర్కవుటవుతుందో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…