Political News

జేజమ్మ‌కు జై!.. బీజేపీ తాజా లిస్ట్‌లో చోటు!

గ‌ద్వాల్ జేజ‌మ్మ‌గా పేరొందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత బీజేపీ నాయ‌కురాలు డీకే అరుణ‌కు బీజేపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. తాజాగా విడుద‌ల చేసిన జాబితాలో ఆమెను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స్థానం నుంచి ఎంపిక చేసింది. ఆమె ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నారు. ఇక‌, ఈమెతోపాటు మ‌రో ఆరుగురికి కూడా క‌మ‌ల నాథులు టికెట్లు కేటాయించారు. వీరిలో మెద‌క్ స్థానానికి ఎం. ర‌ఘునంద‌న్ రావు, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ ఆదిలాబాద్ నుంచి గోదామ్ నాగేశ్‌, ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం పెద్ద‌ప‌ల్లి నుంచి గోమాసా శ్రీనివాస్‌, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన మ‌హ‌బూబాబాద్ నుంచి అజ్మీరా సీతారామ్ నాయ‌క్, న‌ల్ల‌గొండ నుంచి సైదా రెడ్డి ఉన్నారు.

ఇప్ప‌టికే 9 స్థానాల‌కు బీజేపీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా విడుద‌ల చేసిన జాబితాతో మొత్తం 17 స్థానాల‌కు గాను 15 మంది అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన‌ట్ట‌యింది. మిగిలిన స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇదిలా వుంటే.. దేశ‌వ్యాప్తంగా కూడా.. ప‌లువురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ బీజేపీ జాబితా విడుద‌ల చేసింది. మొత్తం 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను తాజాగా ఇచ్చింది.

బాపూరావు దారెటు?

ఆదిలాబాద్ ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019లో బీజేపీటికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్న సోయం బాపూరావు ఊహించిందే జ‌రిగింది. ఆయ‌న‌కు బీజేపీ ఈ ద‌ఫా టికెట్ ఇవ్వ‌లేదు. ఇటీవ‌ల ఆయ‌న ఈ విష‌యంపై త‌న‌కు స‌మాచారం ఉంద‌ని.. స్థానిక నాయ‌కులే త‌న సీటుకు ఎస‌రు పెడుతున్నార‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని.. త‌న‌ను పోటీ నుంచి ఎవ‌రూ త‌ప్పించ‌లేర‌ని అన్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌ధాని ఆదిలాబాద్ ప‌ర్య‌ట‌న‌లోనూ ఆయ‌న పాల్గొన్నారు. కానీ, తాజా జాబితాలో ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. దీంతో బాపూరావు ఏం చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

ముగ్గురికి టికెట్

చిత్రం ఏంటంటే.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ తెలంగాణ‌లో నాలుగు స్థానాల నుంచి విజ‌యం ద‌క్కించుకుంది. వీటిలో ముగ్గురికి మ‌రోసారి టికెట్ ఇచ్చారు. వీరిలో బండి సంజ‌య్‌(క‌రీంన‌గ‌ర్‌), కిష‌న్‌రెడ్డి(సికింద్రాబాద్‌) ఉన్నారు. కానీ, బాపూరావును (ఆదిలాబాద్‌) మాత్రం త‌ప్పించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 14, 2024 10:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago