Political News

జేజమ్మ‌కు జై!.. బీజేపీ తాజా లిస్ట్‌లో చోటు!

గ‌ద్వాల్ జేజ‌మ్మ‌గా పేరొందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత బీజేపీ నాయ‌కురాలు డీకే అరుణ‌కు బీజేపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. తాజాగా విడుద‌ల చేసిన జాబితాలో ఆమెను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స్థానం నుంచి ఎంపిక చేసింది. ఆమె ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నారు. ఇక‌, ఈమెతోపాటు మ‌రో ఆరుగురికి కూడా క‌మ‌ల నాథులు టికెట్లు కేటాయించారు. వీరిలో మెద‌క్ స్థానానికి ఎం. ర‌ఘునంద‌న్ రావు, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ ఆదిలాబాద్ నుంచి గోదామ్ నాగేశ్‌, ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం పెద్ద‌ప‌ల్లి నుంచి గోమాసా శ్రీనివాస్‌, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన మ‌హ‌బూబాబాద్ నుంచి అజ్మీరా సీతారామ్ నాయ‌క్, న‌ల్ల‌గొండ నుంచి సైదా రెడ్డి ఉన్నారు.

ఇప్ప‌టికే 9 స్థానాల‌కు బీజేపీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా విడుద‌ల చేసిన జాబితాతో మొత్తం 17 స్థానాల‌కు గాను 15 మంది అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన‌ట్ట‌యింది. మిగిలిన స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇదిలా వుంటే.. దేశ‌వ్యాప్తంగా కూడా.. ప‌లువురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ బీజేపీ జాబితా విడుద‌ల చేసింది. మొత్తం 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను తాజాగా ఇచ్చింది.

బాపూరావు దారెటు?

ఆదిలాబాద్ ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019లో బీజేపీటికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్న సోయం బాపూరావు ఊహించిందే జ‌రిగింది. ఆయ‌న‌కు బీజేపీ ఈ ద‌ఫా టికెట్ ఇవ్వ‌లేదు. ఇటీవ‌ల ఆయ‌న ఈ విష‌యంపై త‌న‌కు స‌మాచారం ఉంద‌ని.. స్థానిక నాయ‌కులే త‌న సీటుకు ఎస‌రు పెడుతున్నార‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని.. త‌న‌ను పోటీ నుంచి ఎవ‌రూ త‌ప్పించ‌లేర‌ని అన్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌ధాని ఆదిలాబాద్ ప‌ర్య‌ట‌న‌లోనూ ఆయ‌న పాల్గొన్నారు. కానీ, తాజా జాబితాలో ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. దీంతో బాపూరావు ఏం చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

ముగ్గురికి టికెట్

చిత్రం ఏంటంటే.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ తెలంగాణ‌లో నాలుగు స్థానాల నుంచి విజ‌యం ద‌క్కించుకుంది. వీటిలో ముగ్గురికి మ‌రోసారి టికెట్ ఇచ్చారు. వీరిలో బండి సంజ‌య్‌(క‌రీంన‌గ‌ర్‌), కిష‌న్‌రెడ్డి(సికింద్రాబాద్‌) ఉన్నారు. కానీ, బాపూరావును (ఆదిలాబాద్‌) మాత్రం త‌ప్పించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 14, 2024 10:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

27 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago