రాజకీయాలంటేనే అవకాశ వాదం. అవసరాల సమాహారం. ఏ పార్టీ కూడా ఉత్తినే మరో పార్టీతో చేతులు కలపదు. సొంత లాభం కొంత మానుకోవడానికి ఇదే గురజాడ వారి రోజులు కానేకావు. ఇవన్నీ.. ఎవరి స్వార్థం వారు చూసుకునే పక్కా పొలిటికల్ డేస్. ఈ విషయం తెలిసి.. తాను కూడా ఇదే బాటలో నడిచిన షర్మిల.. పొరుగు పార్టీలపై విమర్శలు గుప్పించడం విచిత్రంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో పార్టీ పెట్టుకున్న షర్మిల గురించి అందరికీ తెలిసింది.
అక్కడ పార్టీ పుంజుకునే ఓపికలేక.. కాంగ్రెస్లో విలీనం చేసి.. నమ్ముకున్న నాయకులను మూసీనదిలో ముంచేసి, ఏపీకి తరలి వచ్చి.. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ఈ విషయం ఆమె గుప్పిట మూసుకున్నంత మాత్రాన తెలుగు ప్రజలు కళ్లు మూసుకోలేదు. తన స్వార్థం కోసమే కాంగ్రెస్లోకి వచ్చింది వాస్తవం. ఇది రాజకీయంగా తప్పుకాదు. అయితే.. ఇంత చేసి.. ఇప్పుడు ఏవో పొరుగు పార్టీలు కొంపలు ముంచేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు షర్మిలక్క!!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని అక్క నిలదీశారు. మరి పదేళ్ల పాటు ఇదే ఏపీ కష్టాల్లో ఉంటే.. ఎందుకు ఇటు వైపు చూడలేదు. తెలంగాణ మెట్టినిల్లు.. అంటూ అక్కడే ఎందుకున్నారని నిలదీస్తే..షర్మిల ఏం చెబుతారు?
“2.30 లక్షల ఉద్యోగాల భర్తీ అనే హామీతో జగన్ అన్న అధికారంలోకి వచ్చారు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ విడుదల చేశారు. బీజేపీకి, వైసీపీకి అసలు తేడా ఏముంది?. ఏపీలో బీజేపీకి బీ పార్టీగా వైసీపీ ఉంది. బీజేపీకి వారసులని జగన్ నిరూపించుకున్నారు. ‘సిద్దం’ సభలతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా చేస్తున్నారు. జనాలను పోగేసుకుని మళ్లీ మాయ చేస్తున్నారు. బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలి. యువకుల కోసం కాంగ్రెస్ నేషనల్ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ‘భర్తీ భరోసా’ పేరుతో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. రాహుల్ గాంధీ గారు యువత, నిరుద్యోగ సమస్య లపై స్పందించి ఈ మ్యానిఫెస్టో రూపొందించారు” అని షర్మిల తనదైన గళం వినిపించారు. ఎంత చేసినా.. పార్టీ పుంజుకోదని.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పెంచుకోవాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 11, 2024 5:13 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…