రాజకీయాలంటేనే అవకాశ వాదం. అవసరాల సమాహారం. ఏ పార్టీ కూడా ఉత్తినే మరో పార్టీతో చేతులు కలపదు. సొంత లాభం కొంత మానుకోవడానికి ఇదే గురజాడ వారి రోజులు కానేకావు. ఇవన్నీ.. ఎవరి స్వార్థం వారు చూసుకునే పక్కా పొలిటికల్ డేస్. ఈ విషయం తెలిసి.. తాను కూడా ఇదే బాటలో నడిచిన షర్మిల.. పొరుగు పార్టీలపై విమర్శలు గుప్పించడం విచిత్రంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో పార్టీ పెట్టుకున్న షర్మిల గురించి అందరికీ తెలిసింది.
అక్కడ పార్టీ పుంజుకునే ఓపికలేక.. కాంగ్రెస్లో విలీనం చేసి.. నమ్ముకున్న నాయకులను మూసీనదిలో ముంచేసి, ఏపీకి తరలి వచ్చి.. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. ఈ విషయం ఆమె గుప్పిట మూసుకున్నంత మాత్రాన తెలుగు ప్రజలు కళ్లు మూసుకోలేదు. తన స్వార్థం కోసమే కాంగ్రెస్లోకి వచ్చింది వాస్తవం. ఇది రాజకీయంగా తప్పుకాదు. అయితే.. ఇంత చేసి.. ఇప్పుడు ఏవో పొరుగు పార్టీలు కొంపలు ముంచేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు షర్మిలక్క!!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని అక్క నిలదీశారు. మరి పదేళ్ల పాటు ఇదే ఏపీ కష్టాల్లో ఉంటే.. ఎందుకు ఇటు వైపు చూడలేదు. తెలంగాణ మెట్టినిల్లు.. అంటూ అక్కడే ఎందుకున్నారని నిలదీస్తే..షర్మిల ఏం చెబుతారు?
“2.30 లక్షల ఉద్యోగాల భర్తీ అనే హామీతో జగన్ అన్న అధికారంలోకి వచ్చారు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ విడుదల చేశారు. బీజేపీకి, వైసీపీకి అసలు తేడా ఏముంది?. ఏపీలో బీజేపీకి బీ పార్టీగా వైసీపీ ఉంది. బీజేపీకి వారసులని జగన్ నిరూపించుకున్నారు. ‘సిద్దం’ సభలతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా చేస్తున్నారు. జనాలను పోగేసుకుని మళ్లీ మాయ చేస్తున్నారు. బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలి. యువకుల కోసం కాంగ్రెస్ నేషనల్ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ‘భర్తీ భరోసా’ పేరుతో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. రాహుల్ గాంధీ గారు యువత, నిరుద్యోగ సమస్య లపై స్పందించి ఈ మ్యానిఫెస్టో రూపొందించారు” అని షర్మిల తనదైన గళం వినిపించారు. ఎంత చేసినా.. పార్టీ పుంజుకోదని.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పెంచుకోవాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 11, 2024 5:13 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…