గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో పొత్తుల చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అగ్రనేతలు, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్లుగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా అటు పవన్తో పాటు తమ పార్టీ నేతలతో షకావత్ భేటీ అవుతున్నారు.
చంద్రబాబు నివాసంలో తాజాగా జరుగుతున్న భేటీ మరింత కీలకంగా మారింది. నేటితో లెక్కలు తేలిపోనున్నాయి. అలాగే ఎవరికి ఎన్ని సీట్లు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ ఒంటరిగానే 6 స్తానాలు కోరుతుండగా.. జన సేన 3 స్థానాలు కోరుతోంది. మరోవైపు, అసెంబ్లీ సీట్లకు సంబంధించి 10 సీట్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక, జనసేనకు ఇప్పటికే 24 స్థానాలు కేటాయించారు.
మొత్తంగా ఆయా పార్టీల బలాబలాలు, సెగ్మెంట్ల వారిగా ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. బీజేపీకి ఉన్న బలం.. స్థానిక నేతల హవా.. వంటివాటిపైనా అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే.. ఈ భేటీకి ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి రాకపోవడం గమనార్హం. అంతా కూడా.. గజేంద్ర షెకావత్ చేతుల మీదుగానే కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. దీనిని బట్టి ఏపీ రాజకీయలలో పురందేశ్వరి కీలకమైన సమయంలో వ్యూహాత్మకంగా తప్పుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
భారత్ తో వాణిజ్య సంబంధాలు మరింతగా మెరుగుపరుచుకుంటామని చెబుతూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చేందుకు…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కు ఒక పెద్ద ఊరట లభించింది. డాన్ 3 సినిమా వివాదం నేపథ్యంలో…
ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నప్పుడు నిర్మాతకు ఫలితం కన్నా ఎక్కువగా ఆందోళనకు గురి చేసే అంశాలు చాలా ఉంటాయి. వాటిలో…
తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించదలిచిన సభకు పోలీసులు, కోర్టు అనుమతినివ్వకపోవడం రాజకీయ దుమారానికి తెర లేపిన…
ఏదైనా భవన నిర్మాణమైనా, రోడ్డు నిర్మాణమైనా… అందుకోసం చాలా మంది కార్మికులు అవసరం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని…
ఢిల్లీలోని మాళవియా నగర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్లో ఉదయం చెలరేగిన మంటలు…