గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో పొత్తుల చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అగ్రనేతలు, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్లుగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా అటు పవన్తో పాటు తమ పార్టీ నేతలతో షకావత్ భేటీ అవుతున్నారు.
చంద్రబాబు నివాసంలో తాజాగా జరుగుతున్న భేటీ మరింత కీలకంగా మారింది. నేటితో లెక్కలు తేలిపోనున్నాయి. అలాగే ఎవరికి ఎన్ని సీట్లు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ ఒంటరిగానే 6 స్తానాలు కోరుతుండగా.. జన సేన 3 స్థానాలు కోరుతోంది. మరోవైపు, అసెంబ్లీ సీట్లకు సంబంధించి 10 సీట్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక, జనసేనకు ఇప్పటికే 24 స్థానాలు కేటాయించారు.
మొత్తంగా ఆయా పార్టీల బలాబలాలు, సెగ్మెంట్ల వారిగా ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. బీజేపీకి ఉన్న బలం.. స్థానిక నేతల హవా.. వంటివాటిపైనా అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే.. ఈ భేటీకి ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి రాకపోవడం గమనార్హం. అంతా కూడా.. గజేంద్ర షెకావత్ చేతుల మీదుగానే కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. దీనిని బట్టి ఏపీ రాజకీయలలో పురందేశ్వరి కీలకమైన సమయంలో వ్యూహాత్మకంగా తప్పుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 11, 2024 5:07 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…