గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో పొత్తుల చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అగ్రనేతలు, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్లుగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా అటు పవన్తో పాటు తమ పార్టీ నేతలతో షకావత్ భేటీ అవుతున్నారు.
చంద్రబాబు నివాసంలో తాజాగా జరుగుతున్న భేటీ మరింత కీలకంగా మారింది. నేటితో లెక్కలు తేలిపోనున్నాయి. అలాగే ఎవరికి ఎన్ని సీట్లు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ ఒంటరిగానే 6 స్తానాలు కోరుతుండగా.. జన సేన 3 స్థానాలు కోరుతోంది. మరోవైపు, అసెంబ్లీ సీట్లకు సంబంధించి 10 సీట్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక, జనసేనకు ఇప్పటికే 24 స్థానాలు కేటాయించారు.
మొత్తంగా ఆయా పార్టీల బలాబలాలు, సెగ్మెంట్ల వారిగా ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. బీజేపీకి ఉన్న బలం.. స్థానిక నేతల హవా.. వంటివాటిపైనా అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే.. ఈ భేటీకి ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి రాకపోవడం గమనార్హం. అంతా కూడా.. గజేంద్ర షెకావత్ చేతుల మీదుగానే కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. దీనిని బట్టి ఏపీ రాజకీయలలో పురందేశ్వరి కీలకమైన సమయంలో వ్యూహాత్మకంగా తప్పుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 11, 2024 5:07 pm
మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని,…
అడివి శేష్ డెకాయిట్ రెండో వారంలోకి అడుగు పెట్టింది. మిక్స్డ్ టాక్ తోనూ కలెక్షన్లు వచ్చేలా చేసుకోవడం ద్వారా శేష్…
బుమ్రా.. ఈ పేరు చెబితే ప్రత్యర్థి జట్లకు హడల్. తన జట్టుకు ఒక భరోసా. ఆడుతోంది ఎక్కడైనా కానీ.. పిచ్…
ఇవాళ రిలీజైన కొత్త సినిమాల్లో అందరి దృష్టి తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ మీద ఉంది కానీ బ్యాడ్ బాయ్…
ఐపీఎల్ 2026లో చాలా మంది ప్లేయర్స్ సరిగ్గా ఆడటం లేదు, కానీ అందరి కళ్లు మాత్రం పంత్, రుతురాజ్, సూర్య…
దళపతి విజయ్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాడు. ఒకవైపు 30 ఏళ్ల సినీ కెరీర్ను వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి…