గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో పొత్తుల చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అగ్రనేతలు, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్లుగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా అటు పవన్తో పాటు తమ పార్టీ నేతలతో షకావత్ భేటీ అవుతున్నారు.
చంద్రబాబు నివాసంలో తాజాగా జరుగుతున్న భేటీ మరింత కీలకంగా మారింది. నేటితో లెక్కలు తేలిపోనున్నాయి. అలాగే ఎవరికి ఎన్ని సీట్లు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ ఒంటరిగానే 6 స్తానాలు కోరుతుండగా.. జన సేన 3 స్థానాలు కోరుతోంది. మరోవైపు, అసెంబ్లీ సీట్లకు సంబంధించి 10 సీట్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక, జనసేనకు ఇప్పటికే 24 స్థానాలు కేటాయించారు.
మొత్తంగా ఆయా పార్టీల బలాబలాలు, సెగ్మెంట్ల వారిగా ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. బీజేపీకి ఉన్న బలం.. స్థానిక నేతల హవా.. వంటివాటిపైనా అగ్రనేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే.. ఈ భేటీకి ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి రాకపోవడం గమనార్హం. అంతా కూడా.. గజేంద్ర షెకావత్ చేతుల మీదుగానే కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. దీనిని బట్టి ఏపీ రాజకీయలలో పురందేశ్వరి కీలకమైన సమయంలో వ్యూహాత్మకంగా తప్పుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత…
ఏపీలో సోమావరం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఏకంగా…
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి కాంగ్రెస్ సన్నిహిత పార్టీలు హాజరవుతూ పాలిటిక్స్ లో మళ్లీ హీట్ పెంచాయి.…
నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీ మేకపాటి కుటుంబంలో ఆస్తుల రచ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి పలువురు నాయకులు…
ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు.…
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా…