Political News

నేటితో లెక్కలు తేలిపోనున్నాయి

గుంటూరు జిల్లాలోని ఉండ‌వ‌ల్లిలో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నివాసంలో పొత్తుల చ‌ర్చ‌లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అగ్ర‌నేత‌లు, ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌లుగా తాత్కాలిక బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా అటు పవన్‌తో పాటు తమ పార్టీ నేతలతో షకావత్ భేటీ అవుతున్నారు.

చంద్ర‌బాబు నివాసంలో తాజాగా జ‌రుగుతున్న భేటీ మరింత కీలకంగా మారింది. నేటితో లెక్కలు తేలిపోనున్నాయి. అలాగే ఎవరికి ఎన్ని సీట్లు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్ల‌మెంటు స్థానాల‌కు సంబంధించి బీజేపీ ఒంట‌రిగానే 6 స్తానాలు కోరుతుండ‌గా.. జ‌న సేన 3 స్థానాలు కోరుతోంది. మ‌రోవైపు, అసెంబ్లీ సీట్ల‌కు సంబంధించి 10 సీట్లు కోరుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, జ‌న‌సేనకు ఇప్ప‌టికే 24 స్థానాలు కేటాయించారు.

మొత్తంగా ఆయా పార్టీల బ‌లాబ‌లాలు, సెగ్మెంట్ల వారిగా ప్రాధాన్యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. బీజేపీకి ఉన్న బ‌లం.. స్థానిక నేత‌ల హ‌వా.. వంటివాటిపైనా అగ్ర‌నేత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అయితే.. ఈ భేటీకి ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతా కూడా.. గ‌జేంద్ర షెకావ‌త్ చేతుల మీదుగానే కార్య‌క్ర‌మాన్ని న‌డిపిస్తున్నారు. దీనిని బ‌ట్టి ఏపీ రాజ‌కీయ‌లలో పురందేశ్వ‌రి కీల‌క‌మైన స‌మ‌యంలో వ్యూహాత్మ‌కంగా త‌ప్పుకున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

This post was last modified on March 11, 2024 5:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

22 minutes ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

37 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago