Political News

గ్రీన్ మ్యాట్లా.. ఇది మరీ విడ్డూరం

సిద్ధం.. సిద్ధం.. సిద్ధం.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మద్దతుదారులు కొంత కాలంగా ఊదరగొట్టేస్తున్నారు. ఆ పేరుతో సభలు నిర్వహించడంతో పాటు భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఐతే ‘సిద్ధం’ సభలన్నీ జగన్ జన బలాన్ని చూపించే లక్ష్యంతోనే సాగుతున్నాయి.

తొలి సభకు 3 లక్షల మంది హాజరైతే.. రెండో సభకు 6 లక్షల మంది వచ్చారన్నారు. మూడో సభకు 10 లక్షల టార్గెట్ పెట్టారు. లేటెస్ట్‌గా అద్దంకిలో నిర్వహించిన సిద్ధం నాలుగో సభ టార్గెట్ 15 లక్షలు. ఎప్పుడైనా ఒక సభ పూర్తయిన తర్వాత దానికి ఇంతమంది వచ్చారు అని ప్రకటిస్తారు. కానీ సభకు చాలా రోజుల ముందే 15 లక్షల మంది వస్తున్నట్లు ప్రకటించడం అనూహ్యం. అంతమందిని ఒక చోటికి తీసుకొచ్చి సభ నిర్వహించడం అంటే మాటలు కాదు. వేర్వేరు జిల్లాల్లో పార్టీ నేతలకు టార్గెట్లు పెట్టి.. జనాలకు డబ్బులిచ్చి రప్పిస్తే తప్ప ఇలా జనం సభలకు రావడం కష్టం.

ఐతే ఎలా రప్పించారన్నది పక్కన పెడితే ‘సిద్ధం’ అద్దంకి సభకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్లో అయితే భారీగా జనం కనిపించారు. కానీ నిజంగా ఆ సభకు అంతమంది జనం వచ్చారా అన్న సందేహాలు కలుగుతున్నాయిప్పుడు. విడ్డూరంగా ఒక రాజకీయ సభకు సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు ఫేక్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. భారీగా జనం ఉన్న ఫొటోలను జూమ్ చేసి చూస్తే.. ఒక రకం జన సమూహం.. వేర్వేరు చోట్ల ఉండడం గమనించవచ్చు.

దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, నిజ నిర్ధారణ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫొటోలను ఎడిట్ చేసి జనంతో ప్రాంగణాన్ని నింపేసిన విషక్ష్ం స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ సభ జరిపిన ప్రదేశాన్ని పూర్తిగా గ్రీన్ మ్యాట్లతో నింపేయడంపై ముందే చర్చ జరిగింది. జనం పలుచగా అనిపిస్తే.. ఫొటో షాప్ వాడి ఆ ఖాళీల్ని నింపేయడానికే గ్రీన్ మ్యాట్స్ వేయించారని ప్రతిపక్షాలు ముందే ఆరోపించాయి. ఇప్పుడు చూస్తే ఆ సభలో అంతమంది జనం ఉండటం నిజం కాదనే అభిప్రాయం కలిగేలా ఫొటోల మార్ఫింగ్ జరిగిన విషయం బయటపడిపోయింది.

This post was last modified on March 11, 2024 4:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

56 seconds ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago