Political News

గ్రీన్ మ్యాట్లా.. ఇది మరీ విడ్డూరం

సిద్ధం.. సిద్ధం.. సిద్ధం.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మద్దతుదారులు కొంత కాలంగా ఊదరగొట్టేస్తున్నారు. ఆ పేరుతో సభలు నిర్వహించడంతో పాటు భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఐతే ‘సిద్ధం’ సభలన్నీ జగన్ జన బలాన్ని చూపించే లక్ష్యంతోనే సాగుతున్నాయి.

తొలి సభకు 3 లక్షల మంది హాజరైతే.. రెండో సభకు 6 లక్షల మంది వచ్చారన్నారు. మూడో సభకు 10 లక్షల టార్గెట్ పెట్టారు. లేటెస్ట్‌గా అద్దంకిలో నిర్వహించిన సిద్ధం నాలుగో సభ టార్గెట్ 15 లక్షలు. ఎప్పుడైనా ఒక సభ పూర్తయిన తర్వాత దానికి ఇంతమంది వచ్చారు అని ప్రకటిస్తారు. కానీ సభకు చాలా రోజుల ముందే 15 లక్షల మంది వస్తున్నట్లు ప్రకటించడం అనూహ్యం. అంతమందిని ఒక చోటికి తీసుకొచ్చి సభ నిర్వహించడం అంటే మాటలు కాదు. వేర్వేరు జిల్లాల్లో పార్టీ నేతలకు టార్గెట్లు పెట్టి.. జనాలకు డబ్బులిచ్చి రప్పిస్తే తప్ప ఇలా జనం సభలకు రావడం కష్టం.

ఐతే ఎలా రప్పించారన్నది పక్కన పెడితే ‘సిద్ధం’ అద్దంకి సభకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్లో అయితే భారీగా జనం కనిపించారు. కానీ నిజంగా ఆ సభకు అంతమంది జనం వచ్చారా అన్న సందేహాలు కలుగుతున్నాయిప్పుడు. విడ్డూరంగా ఒక రాజకీయ సభకు సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు ఫేక్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. భారీగా జనం ఉన్న ఫొటోలను జూమ్ చేసి చూస్తే.. ఒక రకం జన సమూహం.. వేర్వేరు చోట్ల ఉండడం గమనించవచ్చు.

దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, నిజ నిర్ధారణ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫొటోలను ఎడిట్ చేసి జనంతో ప్రాంగణాన్ని నింపేసిన విషక్ష్ం స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ సభ జరిపిన ప్రదేశాన్ని పూర్తిగా గ్రీన్ మ్యాట్లతో నింపేయడంపై ముందే చర్చ జరిగింది. జనం పలుచగా అనిపిస్తే.. ఫొటో షాప్ వాడి ఆ ఖాళీల్ని నింపేయడానికే గ్రీన్ మ్యాట్స్ వేయించారని ప్రతిపక్షాలు ముందే ఆరోపించాయి. ఇప్పుడు చూస్తే ఆ సభలో అంతమంది జనం ఉండటం నిజం కాదనే అభిప్రాయం కలిగేలా ఫొటోల మార్ఫింగ్ జరిగిన విషయం బయటపడిపోయింది.

This post was last modified on March 11, 2024 4:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారణాసి సంగీతం మీద ఆర్ఆర్ఆర్ బరువు

ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…

48 minutes ago

స్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందే

నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…

2 hours ago

తాప్సి నుంచి మరో స్ట్రాంగ్ మూవీ

తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్‌కు…

2 hours ago

నిధి అగర్వాల్… అయిదేళ్ల కష్టం వృథా

నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే  కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…

4 hours ago

ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…

4 hours ago

లెనిన్ అవరోధాలకు బ్రేక్ ఎక్కడ

అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…

4 hours ago