Political News

జ‌గ‌న్, మ‌మ‌తా.. సేమ్ టు సేమ్‌!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌లు రాజ‌కీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. అయితే.. వీటిలో కొన్ని పార్టీలు వ్యూహాల‌కు సంబంధించి సంస్థ‌ల‌ను పెట్టుకున్నాయి. వీటిలో ఐప్యాక్ కీల‌కంగా ప‌నిచేస్తోంది. మ‌రో వైపు కాంగ్రెస్ సునీల్ క‌నుగోలు ప‌నిచేస్తున్నారు. ఈయ‌న మాట ఎలా ఉన్నా.. ఐప్యాక్ మాత్రం ప్రాంతీయంగా చూసుకుంటే.. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్‌, ఏపీ అధికార పార్టీ వైసీపీకి, త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకేకి కూడా ప‌నిచేస్తోంది. దీంతో ఆ పార్టీలు నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాలు ఒకే త‌ర‌హాలో కొన‌సాగుతున్నాయి.

ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన వేదిక‌ల నుంచి ప్ర‌సంగాల వ‌ర‌కు.. ప్ర‌చార గీతాల నుంచి ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే వ‌ర‌కు కూడా పార్టీల‌ మ‌ధ్య సారూప్య‌త‌లు క‌నిపిస్తు న్నాయి. ఏపీలో అయితే.. అసెంబ్లీ, పార్లెమెంటు ఎన్నిక‌లు క‌లిసి వ‌స్తున్నాయి. ప‌శ్చిమ బెంగాల్‌లో కేవ‌లం పార్ల‌మెంటు ఎన్నిక‌లే ఉన్నాయి. ఇక్క‌డ కూడా రాజకీయంగా ఐప్యాకే స‌ల‌హాలు ఇస్తోంది. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్, ఏపీ ప్ర‌భుత్వాల త‌ర‌ఫున పార్టీ అధినేతలు.. వైఎస్ జ‌గ‌న్, మ‌మ‌తా బెన‌ర్జీలే స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఉన్నారు.

దీంతో వారు అనుస‌రిస్తున్న వ్యూహాలు, చేస్తున్న ప్ర‌సంగాలు, ఇస్తున్న హామీలు కూడా.. సేమ్ టు సేమ్ ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో సంక్షేమం, ప‌థ‌కాలు త‌న‌ను నిల‌బెడతాయ‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌లోనూ ఇదే త‌ర‌హా ధీమాతో మ‌మ‌తా బెన‌ర్జీ ఉన్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ రాకుండానే అటు మ‌మతా బెన‌ర్జీ ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. రాష్ట్రంలో మొత్తం 42 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. తాజాగా వాటికి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు.

ముందుగానే వైసీపీ కూడా త‌న ఎంపీ అభ్య‌ర్థుల‌ను, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను కూడా ఖ‌రారు చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు..ఇరు పార్టీల ప్ర‌చార స‌ర‌ళిని గ‌మ‌నిస్తే ఏపీలో సిద్ధం పేరుతో స‌భ‌లు నిర్వ‌హిస్తుండ‌గా, ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌న‌గ‌ర్జ‌న‌పేరుతో స‌భ‌లు చేప‌డుతున్నారు. రెండింటికీ కీల‌క‌మైన సారూప్య‌త ఏంటంటే.. ఒకే త‌ర‌హాలో ప్లాన్ చేయ‌డం. వై షేపులో భారీ ప్లాట్ ఫాం నిర్మించడం వంటివి కీల‌కంగా ఉన్నాయి.

This post was last modified on March 11, 2024 4:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

4 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago