తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ మరోసారి సవాల్ రువ్వారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఎవరు మొగోడు ఎవరో తేల్చుకుందాం రావాలంటూ.. కామెంట్సు చేశారు. తన సవాల్కు స్పందించి మల్కాజ్గిరిలో గెలిచి దమ్మేంటో నిరూపించుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎన్నికల్లో గెలిస్తే మగాడు.. ఓడితే మగాడు కాదా?. నా సవాల్ను రేవంత్ రెడ్డి ఎందుకు స్వీకరించడం లేదు. మల్కాజ్గిరిలో ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు మగాడో తేల్చుకుందాం” అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
ఇదే సమయంలో కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. తానేమీ.. సిఫార్సులతో ను, ఎవరికో సేవలు చేసి.. చెంచాగిరి చేసిన పదవులు దక్కించుకోలేదని పరోక్షంగా రేవంత్పై విమర్శలు గుప్పించారు.
“మా అయ్య పేరు కేసీఆర్. నేను ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చా. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అంతేగానీ రేవంత్రెడ్డిలాగా రాంగ్ రూట్లో రాలేదు. ఆంధ్రోళ్ల బూట్లు నాకి, పార్టీ మారి రేవంత్ సీఎం అయ్యారు. కారు కూతలు, చిల్లర మాటలు రేవంత్ ఇకనైనా మానుకోవాలి” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు కుంగాయే తప్ప కుప్పకూలి పోలేదని పేర్కొన్నారు. మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉన్నాయని, అయితే.. వీటిలో 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని కూలిపోలేదని కేటీఆర్ అన్నారు. మూడు నెలల సమయంలో ఈ ప్రభుత్వానికి పిల్లర్లు బాగు చేసే సమయం దొరకడం లేదా? అని ప్రశ్నించారు.
వంద రోజుల తర్వాత ఉద్యమమే!
కాంగ్రెస్ కు 100 రోజుల సమయం ఇచ్చామని, ఆ తర్వాత.. ప్రజలలోకి వెళ్లి ఉద్యమం చేపడతామని కేటీఆర్ అన్నారు. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మారని వ్యాఖ్యానించారు. రుణమాఫీ చేయకపోతే రైతులు కాంగ్రెస్ భరతం పడతారని కేటీఆర్ హెచ్చరించారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి తమను బాధించిందని కేటీఆర్ అన్నారు.
This post was last modified on March 11, 2024 8:15 am
ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…