టీడీపీ యువ నేత బొజ్జల సుధీర్రెడ్డి. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం అందుకోవాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ఆయన తిరుగుతున్నారు. ప్రజలకు చేరువ అవుతున్నారు. వారి సమస్యలు వింటున్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నారు. యువతను కూడా కూడగడుతున్నారు. ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రజలకు చేరువ అవుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు బొజ్జల సుధీర్రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేయలేదు.
20 రోజుల కిందటే.. టీడీపీ ఫస్ట్ జాబితా ఇచ్చింది. దీనిలో 94 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. అయి తే.. ఈ జాబితాలో శ్రీకాళహస్తి నియోజకవర్గం లేకపోవడం గమనార్హం. దీంతో సుధీర్ దాదాపు డీలా పడిపోయాడని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన సుధీర్కు.. ఇప్పుడు సింపతీ కూడా కలిసి వస్తోంది. అంతేకాదు.. వైసీపీ నేత, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిపై వున్న వ్యతిరేకత మేలు చేస్తుందని తలపోస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఖాయమనికూడా సుధీర్ లెక్కలు వేసుకున్నారు. అయితే.. పార్టీ అధిష్టానం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు రాలేదు. మరి వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తుందా? లేదా? అనేది చూడాలి. పార్టీలో ఇదే టికెట్పై ఆసక్తికర చర్చ సాగుతోంది. చంద్రబాబు చేయించిన సర్వేలో సుధీర్ కన్నా బలమైన నాయకుడు అవసరం ఉన్నట్టు తేలిందని చెబుతున్నారు. అందుకే ఈ టికెట్ విషయంలో ఒకింత ఆలోచనలో పడ్డారని అంటున్నారు.
ప్రస్తుతం ఇంకా పరిశీలన జరుగుతోందని.. సుధీర్ గ్రాఫ్ మెరుగు పడితే.. ఆయనకే టికెట్ దక్కుతుందని పార్టీలో అంతర్గత చర్చ సాగుతోంది. అయితే.. సుధీర్ మాత్రం తనకే టికెట్ దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. బీజేపీ ఇప్పుడు టీడీపీతో జట్టు కట్టిన నేపథ్యంలో ఆ పార్టీ ఈ టికెట్ను కోరుకునే అవకాశం ఉందని.. ఇటువైపు కమలనాథుల్లో చర్చ సాగుతోంది. తాము సునాయయాసంగా నెగ్గుతామని వారు చెబుతున్నారు. మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే.. శ్రీకాళహస్తి టికెట్పై మరికొంత కాలం సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
This post was last modified on March 10, 2024 4:32 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…