Political News

ఇంతియాజ్ పోటీ.. తెర‌వెనుక ఇంత డ్రామా జ‌రిగిందా!

క‌ర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా ఇటీవ‌ల త‌న ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఏఎస్ అదికారి, మైనారిటీ వ్య‌క్తి ఇంతియాజ్‌కు సీఎం జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇలా ఆయ‌న‌ను అనూహ్యంగా తెర‌మీదికి తీసుకురావ‌డం వెనుక చాలా జ‌రిగింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అంత తేలిక‌గా.. ఇంతియాజ్కు టికెట్ ఇవ్వ‌లేద‌ని.. ఇంటి పోరు కార‌ణంగానే ఆయ‌న‌ను తెర‌మీదికి తెచ్చార‌ని పార్టీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?
టికెట్ నాకు రాకున్నా ఫర్వాలేదు నా ప్రత్యర్ధికి రాకుడదంటూ కర్నూలు వైసీపీ నేతలు ఎత్తులకు పైఎత్తులు వేశారు. టికెట్ దక్కించుకునేందుకు కర్నూలు సిటీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నంలో ఇద్దరి నేతలకు సీఎం జగన్ చెక్ పెట్టారు. ఇద్దరినీ కాదని మూడో వ్యక్తికి టికెట్ ఎందుకు కేటాయించారు. కర్నూలు ఎమ్మెల్యేగా ప్రస్తుతం హఫీజ్ ఖాన్ కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పై హఫీజ్ ఖాన్ గెలుపొందారు.

రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడంతో కర్నూలు హెడ్ క్వార్టర్‌లో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చురుకుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వైసిపి అధినేత టికెట్లు మార్పులు చేర్పులు చేస్తూ ఉండడం తెలిసిందే. కర్నూలు నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం, మొదట్నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం జగన్‌కి నమ్మిన బంటులా ఉన్న తనను కాదని టికెట్ వేరే వారికి కేటాయించే పరిస్థితి లేదనుకన్నారు.

వచ్చే ఎన్నికలకు అన్నీ సిద్ధం కూడా చేసుకున్నారు. మరోవైపు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్.వి మోహన్ రెడ్డి దంపతులు ఈసారి టికెట్ తమకే కేటాయించాలని జగన్ ముందు పట్టు పట్టారు. 2019 ఎన్నికల్లో మీరు చెప్పారని హఫీజ్ ఖాన్‌కు సపోర్ట్ చేశామని ఈసారి తమకు టికెట్ కేటాయించి న్యాయం చేయాలని పంచాయితీ పెట్టారు. అంతేకాదు, కర్నూలులో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు తీవ్ర వ్యతిరేకత ఉందని ఈసారి టికెట్ కేటాయిస్తే కచ్చితంగా వైసీపీ ఓడిపోతుం దని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే పై వ్యతిరేకతను చూపిస్తూ హఫీజ్ ఖాన్ బాధితులను సైతం ఏకం చేసి టికెట్ రాకుండా ప్రయతించారు. ఈ ఇద్దరి నేతలతో కర్నూలు టికెట్ వైసిపి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో చేసేది లేక అధిష్టానం ఇద్దరినీ పక్కనపెట్టి మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్‌ను వైసిపి కర్నూలు అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతియాజ్ ను గెలిపించుకొని రావాల్సిన బాధ్యతలు కూడా ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డికి అప్పగించారు. ఇదీ సంగ‌తి!

This post was last modified on March 10, 2024 4:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

4 minutes ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

1 hour ago

అన్వేషణ హద్దు దాటేస్తుందా?

నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది...! యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితమే.…

1 hour ago

హ‌రీష్‌రావు కంచుకోట‌ను క‌విత బ‌ద్ద‌లు కొట్ట‌గ‌లదా?

బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి.. అంత‌కుమించి మాట‌ల మాంత్రీకుడు.. త‌న్నీరు హ‌రీష్ రావు గురించి చెప్ప‌డానికి ఇవి చాలు.…

1 hour ago

మాఫియా రాజ్యంలో ‘టాక్సిక్’ రక్తపాతం

కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యష్ వచ్చే నెల టాక్సిక్ తో రాబోతున్న…

2 hours ago

చూసిందే న‌మ్మండి: భువ‌నేశ్వ‌రి వీడియో ఎందుకంటే!

"చూసిందే న‌మ్మండి"- అంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి గ‌త రాత్రి సోష‌ల్ మీడియాలో ఓ సెల్ఫీ…

2 hours ago