Political News

ఇంతియాజ్ పోటీ.. తెర‌వెనుక ఇంత డ్రామా జ‌రిగిందా!

క‌ర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా ఇటీవ‌ల త‌న ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఏఎస్ అదికారి, మైనారిటీ వ్య‌క్తి ఇంతియాజ్‌కు సీఎం జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇలా ఆయ‌న‌ను అనూహ్యంగా తెర‌మీదికి తీసుకురావ‌డం వెనుక చాలా జ‌రిగింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అంత తేలిక‌గా.. ఇంతియాజ్కు టికెట్ ఇవ్వ‌లేద‌ని.. ఇంటి పోరు కార‌ణంగానే ఆయ‌న‌ను తెర‌మీదికి తెచ్చార‌ని పార్టీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?
టికెట్ నాకు రాకున్నా ఫర్వాలేదు నా ప్రత్యర్ధికి రాకుడదంటూ కర్నూలు వైసీపీ నేతలు ఎత్తులకు పైఎత్తులు వేశారు. టికెట్ దక్కించుకునేందుకు కర్నూలు సిటీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నంలో ఇద్దరి నేతలకు సీఎం జగన్ చెక్ పెట్టారు. ఇద్దరినీ కాదని మూడో వ్యక్తికి టికెట్ ఎందుకు కేటాయించారు. కర్నూలు ఎమ్మెల్యేగా ప్రస్తుతం హఫీజ్ ఖాన్ కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పై హఫీజ్ ఖాన్ గెలుపొందారు.

రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడంతో కర్నూలు హెడ్ క్వార్టర్‌లో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చురుకుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వైసిపి అధినేత టికెట్లు మార్పులు చేర్పులు చేస్తూ ఉండడం తెలిసిందే. కర్నూలు నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం, మొదట్నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం జగన్‌కి నమ్మిన బంటులా ఉన్న తనను కాదని టికెట్ వేరే వారికి కేటాయించే పరిస్థితి లేదనుకన్నారు.

వచ్చే ఎన్నికలకు అన్నీ సిద్ధం కూడా చేసుకున్నారు. మరోవైపు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్.వి మోహన్ రెడ్డి దంపతులు ఈసారి టికెట్ తమకే కేటాయించాలని జగన్ ముందు పట్టు పట్టారు. 2019 ఎన్నికల్లో మీరు చెప్పారని హఫీజ్ ఖాన్‌కు సపోర్ట్ చేశామని ఈసారి తమకు టికెట్ కేటాయించి న్యాయం చేయాలని పంచాయితీ పెట్టారు. అంతేకాదు, కర్నూలులో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు తీవ్ర వ్యతిరేకత ఉందని ఈసారి టికెట్ కేటాయిస్తే కచ్చితంగా వైసీపీ ఓడిపోతుం దని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే పై వ్యతిరేకతను చూపిస్తూ హఫీజ్ ఖాన్ బాధితులను సైతం ఏకం చేసి టికెట్ రాకుండా ప్రయతించారు. ఈ ఇద్దరి నేతలతో కర్నూలు టికెట్ వైసిపి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో చేసేది లేక అధిష్టానం ఇద్దరినీ పక్కనపెట్టి మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్‌ను వైసిపి కర్నూలు అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతియాజ్ ను గెలిపించుకొని రావాల్సిన బాధ్యతలు కూడా ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డికి అప్పగించారు. ఇదీ సంగ‌తి!

This post was last modified on March 10, 2024 4:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago