Political News

ముద్ర‌గ‌డ‌కు ముహూర్తం కుదిరింది!

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నెల 14న ఆయ‌న వైసీపీలోకి చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వైసీపీ బ‌లోపేతానికి తాను కృషి చేస్తాన‌ని ముద్ర‌గడ చెప్పారు. “వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ బ‌లోపేతాన‌ని, జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు నేను కృషిచేస్తా. ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నా” అని ముద్ర‌గ‌డ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లంతా జ‌గ‌న్‌వైపు ఉన్న‌ట్టే తాను భావిస్తున్నాన‌ని.. ఆయ‌న‌ను ఓడించేందుకు ఇంత మంది క‌లిసిపోవ‌డం.. దీనికి బ‌లాన్ని చేకూరుస్తోంద న్నారు.

అయితే..వ‌చ్చేఎన్నిక‌ల్లో తాను పోటీ చేయాలా వ‌ద్దా? అనే విష‌యాన్ని మాత్రం తాను ఇంకా నిర్ణ‌యించుకోలే దన్నారు. పోటీలో ఉన్నా.. లేకున్నా.. తాను పార్టీ కోసం ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. వైసీపీ త‌ర‌ఫున గ్రామ గ్రామానా తిరుగుతాన‌ని.. ప్ర‌చారం చేస్తాన‌ని అన్నారు. వైసీపీ త‌ర‌ఫున ఎలాంటి హామీ త‌న‌కు ఇవ్వ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. డ‌బ్బుల కోస‌మో.. ప‌ద‌వులు ఆశించో తాను వైసీపీలో చేర‌డం లేద‌ని.. కాపుల‌కు న్యాయం జ‌ర‌గాల‌న్న ఏకైక ఉద్దేశంతోనే తాను వైసీపీ బాట‌ప‌డుతున్నాన‌ని ముద్ర‌గ‌డ చెప్పారు.

కాగా.. ముద్ర‌గ‌డ వాస్త‌వానికి బీజేపీలోకి వెళ్లాల‌ని అనుకున్నారు. ఆ పార్టీ త‌ర‌ఫున కాకినాడ నుంచి పోటీ చేసి.. పార్ల‌మెంటుకు వెళ్లి.. అక్క‌డ కాపు రిజ‌ర్వేష‌న్ విష‌యాన్ని తేల్చుకుందామ‌ని భావించారు. అయితే.. బీజేపీ టీడీపీలు క‌లిసి పోవ‌డంతో ఆయ‌న ఈ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న వైసీపీ కి కూడా చెప్పారు. బీజేపీతో చేతులు క‌ల‌పాల‌ని ఉంద‌ని.. అయితే ఆపార్టీ ఒంట‌రిగా పోటీ చేస్తే.. చేర‌తాన‌ని.. లేక‌పోతే, మీకే జై కొడ‌తాన‌ని ఆయ‌న అన్నారు. తాజాగా బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డంతో ముద్ర‌గ‌డ వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 14న ఆయ‌న కండువా క‌ప్పుకోనున్నారు.

This post was last modified on March 10, 2024 12:30 pm

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago