Political News

ముద్ర‌గ‌డ‌కు ముహూర్తం కుదిరింది!

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నెల 14న ఆయ‌న వైసీపీలోకి చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వైసీపీ బ‌లోపేతానికి తాను కృషి చేస్తాన‌ని ముద్ర‌గడ చెప్పారు. “వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ బ‌లోపేతాన‌ని, జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు నేను కృషిచేస్తా. ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నా” అని ముద్ర‌గ‌డ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లంతా జ‌గ‌న్‌వైపు ఉన్న‌ట్టే తాను భావిస్తున్నాన‌ని.. ఆయ‌న‌ను ఓడించేందుకు ఇంత మంది క‌లిసిపోవ‌డం.. దీనికి బ‌లాన్ని చేకూరుస్తోంద న్నారు.

అయితే..వ‌చ్చేఎన్నిక‌ల్లో తాను పోటీ చేయాలా వ‌ద్దా? అనే విష‌యాన్ని మాత్రం తాను ఇంకా నిర్ణ‌యించుకోలే దన్నారు. పోటీలో ఉన్నా.. లేకున్నా.. తాను పార్టీ కోసం ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. వైసీపీ త‌ర‌ఫున గ్రామ గ్రామానా తిరుగుతాన‌ని.. ప్ర‌చారం చేస్తాన‌ని అన్నారు. వైసీపీ త‌ర‌ఫున ఎలాంటి హామీ త‌న‌కు ఇవ్వ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. డ‌బ్బుల కోస‌మో.. ప‌ద‌వులు ఆశించో తాను వైసీపీలో చేర‌డం లేద‌ని.. కాపుల‌కు న్యాయం జ‌ర‌గాల‌న్న ఏకైక ఉద్దేశంతోనే తాను వైసీపీ బాట‌ప‌డుతున్నాన‌ని ముద్ర‌గ‌డ చెప్పారు.

కాగా.. ముద్ర‌గ‌డ వాస్త‌వానికి బీజేపీలోకి వెళ్లాల‌ని అనుకున్నారు. ఆ పార్టీ త‌ర‌ఫున కాకినాడ నుంచి పోటీ చేసి.. పార్ల‌మెంటుకు వెళ్లి.. అక్క‌డ కాపు రిజ‌ర్వేష‌న్ విష‌యాన్ని తేల్చుకుందామ‌ని భావించారు. అయితే.. బీజేపీ టీడీపీలు క‌లిసి పోవ‌డంతో ఆయ‌న ఈ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న వైసీపీ కి కూడా చెప్పారు. బీజేపీతో చేతులు క‌ల‌పాల‌ని ఉంద‌ని.. అయితే ఆపార్టీ ఒంట‌రిగా పోటీ చేస్తే.. చేర‌తాన‌ని.. లేక‌పోతే, మీకే జై కొడ‌తాన‌ని ఆయ‌న అన్నారు. తాజాగా బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డంతో ముద్ర‌గ‌డ వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 14న ఆయ‌న కండువా క‌ప్పుకోనున్నారు.

This post was last modified on March 10, 2024 12:30 pm

Share

Recent Posts

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

1 hour ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

2 hours ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

2 hours ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

2 hours ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

4 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

7 hours ago