యువతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, కొత్తవారికి అవకాశం ఇస్తున్నామని చెప్పుకొనే బీజేపీ .. మరోసారి కూడా ఆస్థాన విద్యాంసులకే ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ఏపీ వంటి భిన్నమైన రాజకీయ వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహత్మకంగా ముందుకు సాగుతుందని ఆది నుంచి కమల నాథులు చెబుతు వచ్చారు. కానీ, ఆ వ్యూహం ఇప్పుడు కనిపించడం లేదు. పాత నాయకులు, నిలయ విద్యాంసులకే పట్టం కడుతున్నారు.
టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేయబోతున్నట్లుగా భావిస్తున్న ఆరు ఎంపీ నియోజకవర్గాలు కూడా ఖరారు అయినట్లు సమాచారం. వీటిలో అరకు(ఎస్టీ), అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, హిందూపురం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సీట్లను బీజేపీకి కేటాయించినట్లు తెలిసింది. అయితే.. వీటి నుంచిపోటీ చేసేవారిలో ఏ ఒక్కరూ కొత్తవారు లేకపోగా.. అందరూ ఓటమి వీరులుగా పేరు తెచ్చుకున్నవారే కావడం గమనార్హం.
అరకు స్థానం నుంచి కొత్తపల్లి గీత పోటీలో ఉన్నారని సమాచారం. ఈమె 2014లో వైసీపీ తరఫున గెలిచారు. తర్వాత అడ్రస్ లేకుండా పోయి.. కేసుల్లో ఇరుక్కుని.. తర్వాత బీజేపీ పంచన చేరారు. ఈమెకు ఇక్కడ ఓటు బ్యాంకు ఏమీ పెద్దగా లేదు.
ఇక, ప్రతి ఎన్నికలకు సీటు మార్చుకునే బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి ఈ సారి రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. కానీ, ఇక్కడ ఆమె గెలుపు అంత ఈజీకాదు. బలమైన టీడీపీ నేతలు సహకరించాల్సి ఉంటుంది. ఇది ప్రశ్నార్థకమే. కడప జిల్లా రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నట్టు సమాచారం. ఈయన కూడా దాపు 10 సంవత్సరాలుగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో గెలుపు చాలా కష్టమని అంటున్నారు. హిందూపూరం నుంచి – సత్య కుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, ఏలూరు నుంచి సుజనా చౌదరి లేదా తపన్ చౌదరి పేర్లను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరి గెలుపు కూడా అంత ఈజీ కాదు.
This post was last modified on March 10, 2024 5:58 pm
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…