Political News

అంతా ఆస్థాన విద్వాంసులే.. బీజేపీలో కొత్త ముఖాలేవీ?

యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని, కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తున్నామ‌ని చెప్పుకొనే బీజేపీ .. మ‌రోసారి కూడా ఆస్థాన విద్యాంసుల‌కే ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ఏపీ వంటి భిన్న‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహ‌త్మ‌కంగా ముందుకు సాగుతుంద‌ని ఆది నుంచి క‌మ‌ల నాథులు చెబుతు వ‌చ్చారు. కానీ, ఆ వ్యూహం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. పాత నాయ‌కులు, నిల‌య విద్యాంసుల‌కే ప‌ట్టం క‌డుతున్నారు.

టీడీపీ, జ‌న‌సేన పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేయబోతున్నట్లుగా భావిస్తున్న ఆరు ఎంపీ నియోజకవర్గాలు కూడా ఖరారు అయినట్లు స‌మాచారం. వీటిలో అరకు(ఎస్టీ), అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, హిందూపురం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సీట్లను బీజేపీకి కేటాయించినట్లు తెలిసింది. అయితే.. వీటి నుంచిపోటీ చేసేవారిలో ఏ ఒక్క‌రూ కొత్త‌వారు లేక‌పోగా.. అంద‌రూ ఓట‌మి వీరులుగా పేరు తెచ్చుకున్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం.

అరకు స్థానం నుంచి కొత్తప‌ల్లి గీత పోటీలో ఉన్నార‌ని స‌మాచారం. ఈమె 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచారు. త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయి.. కేసుల్లో ఇరుక్కుని.. త‌ర్వాత బీజేపీ పంచ‌న చేరారు. ఈమెకు ఇక్క‌డ ఓటు బ్యాంకు ఏమీ పెద్ద‌గా లేదు.

ఇక‌, ప్ర‌తి ఎన్నిక‌ల‌కు సీటు మార్చుకునే బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి ఈ సారి రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. కానీ, ఇక్క‌డ ఆమె గెలుపు అంత ఈజీకాదు. బ‌ల‌మైన టీడీపీ నేత‌లు స‌హ‌క‌రించాల్సి ఉంటుంది. ఇది ప్ర‌శ్నార్థ‌క‌మే. కడప జిల్లా రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయ‌నున్నట్టు స‌మాచారం. ఈయ‌న కూడా దాపు 10 సంవ‌త్స‌రాలుగా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. దీంతో గెలుపు చాలా క‌ష్ట‌మ‌ని అంటున్నారు. హిందూపూరం నుంచి – సత్య కుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, ఏలూరు నుంచి సుజనా చౌదరి లేదా తపన్‌ చౌదరి పేర్లను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరి గెలుపు కూడా అంత ఈజీ కాదు.

This post was last modified on March 10, 2024 5:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

44 minutes ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

5 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

7 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

11 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

13 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

13 hours ago